జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర పార్ట్ 1 అక్టోబర్ 10 విడుదలను చేరుకునేందుకు పరుగులు పెడుతోంది. వినడానికి ఇంకా టైం ఉన్నట్టు అనిపిస్తున్నా చేతిలో ఉన్న ఏడు నెలలు ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి ఎంత మాత్రం చాలవు. ఏప్రిల్ లో మంచి డేట్ వదులుకోవడం వల్ల ఫ్యాన్స్ లో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు వేసవి నుంచి పక్కా ప్లానింగ్ తో భారీ ఎత్తున ప్రమోషన్లు మొదలుపెట్టేందుకు టీమ్ రెడీ అవుతోంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం గోవా వెళ్ళబోతున్నారు. ఇక బాహుబలి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.
దేవర తండ్రి కొడుకుల కథగా తారక్ ని రెండు పాత్రల్లో కొరటాల చూపించబోతున్నారని ఇన్ సైడ్ టాక్. మొదటి భాగంలో కొడుకుకి సంబంధించిన ఘట్టాన్ని ఆవిష్కరించి సీక్వెల్ లో తండ్రి క్యారెక్టర్ ని హై వోల్టేజ్ లో రివీల్ చేస్తారని తెలిసింది. అలా అని వయసు మళ్ళిన వాడిగా జూనియర్ కనిపించడట. బాహుబలి లాగే రెండు కాలాల్లో రెండు పాత్రలను చూపించి తద్వారా ఒకదానితో మరొకటి ముడిపెట్టే విధానం ప్రత్యేకంగా ఉంటుందట. సో మహేంద్ర, అమరేంద్రగా ప్రభాస్ లో చూపించిన ఎలివేషన్ ని మించి దేవరలో జూనియర్ ఎన్టీఆర్ రూపంలో చూడొచ్చన్న మాట.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న దేవర వల్ల ఆమెకు రామ్ చరణ్ సినిమాలోనూ ఛాన్స్ దక్కిందనే టాక్ ఆల్రెడీ ఉంది. సైఫ్ అలీ ఖాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఇప్పుడు గోవాలో తను కూడా పాల్గొనబోతున్నారు. తారక్, జాన్వీల మీద ఒక పాటతో పాటు బీచ్ ఒడ్డున సముద్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లను షూట్ చేయబోతున్నారు. అనిరుద్ రవిచందర్ మిగిలిన పాటలకు సంబంధించిన పని పూర్తి చేయగానే వాటి చిత్రీకరణ కూడా కొలిక్కి వస్తుంది. ఈసారి ఎలాంటి పోస్ట్ పోన్ లేకుండా ఖచ్చితంగా విడుదల తేదీని అందుకునేలా ప్లానింగ్ చేసుకున్నారు.
This post was last modified on March 12, 2024 6:33 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…