విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ యాక్టింగ్ లోనే కాదు దర్శకుడిగానూ తన అభిరుచిని ధోని, ఉలవచారు బిర్యానీ లాంటి చిత్రాల ద్వారా చూపించారు. పెద్ద విజయాలు అందుకోలేదు కానీ డైరెక్టర్ గా ఆయన టాలెంట్ ప్రపంచానికి పరిచయమయ్యింది. నిర్మాతగానూ తన అభిరుచి అలాంటిదే. ఉత్సవ్ గోన్వర్ అనే దర్శకుడు ఇటీవలే కన్నడలో ఫోటో అనే చిన్న సినిమా తీశాడు. ఢిల్లీ హ్యబిటట్ అంతర్జాతీయ చిత్రోత్సవం, బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో దీన్ని ప్రీమియర్ చేసినప్పుడు ఆడియన్స్ షో అయ్యాక లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వాళ్లలో ప్రకాష్ రాజ్ ఉన్నారు.
దీన్ని థియేటర్ ఆడియన్స్ కి చేరువ చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి తన సమర్పణలో మార్చి 15 విడుదల చేసేందుకు పూనుకున్నారు. మాములుగా దాని ఒరిజినల్ నిర్మాతకు అంత స్థోమత లేదు. ఒకవేళ వసూళ్ల పరంగా ఏదైనా తేడా వస్తే తట్టుకోవడం కష్టం. కానీ ప్రకాష్ రాజ్ కు ఆ సమస్య లేదు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఏర్పడిన దయనీయ పరిస్థితుల ఆధారంగా ఒక చిన్న పిల్లాడి సెంటిమెంట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. క్లైమాక్స్ గుండెలు పిండేసేలా ఉంటుంది. అంతగా కదిలించింది కాబట్టి ప్రకాష్ రాజ్ కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతానికి కన్నడలో మాత్రమే తీసుకొస్తున్నారు. అక్కడ సక్సెస్ అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ లేదా రీమేక్ చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. అయితే లాక్ డౌన్ ట్రాజెడీని జనాలు మర్చిపోయిన నేపథ్యంలో ఆ బ్యాక్ డ్రాప్ తో చేసిన సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఆ మధ్య రాజేంద్రప్రసాద్ హీరోగా అనుకోని ప్రయాణం ఇలాంటి తరహాలో ఒక ఆఫ్ బీట్ మూవీ తీశారు కానీ డబ్బులు రాలేదు. కానీ ఫోటో విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఖచ్చితంగా మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఎంత నిజమో చూడాలి మరి.
This post was last modified on March 11, 2024 4:54 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…