విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ యాక్టింగ్ లోనే కాదు దర్శకుడిగానూ తన అభిరుచిని ధోని, ఉలవచారు బిర్యానీ లాంటి చిత్రాల ద్వారా చూపించారు. పెద్ద విజయాలు అందుకోలేదు కానీ డైరెక్టర్ గా ఆయన టాలెంట్ ప్రపంచానికి పరిచయమయ్యింది. నిర్మాతగానూ తన అభిరుచి అలాంటిదే. ఉత్సవ్ గోన్వర్ అనే దర్శకుడు ఇటీవలే కన్నడలో ఫోటో అనే చిన్న సినిమా తీశాడు. ఢిల్లీ హ్యబిటట్ అంతర్జాతీయ చిత్రోత్సవం, బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో దీన్ని ప్రీమియర్ చేసినప్పుడు ఆడియన్స్ షో అయ్యాక లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వాళ్లలో ప్రకాష్ రాజ్ ఉన్నారు.
దీన్ని థియేటర్ ఆడియన్స్ కి చేరువ చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి తన సమర్పణలో మార్చి 15 విడుదల చేసేందుకు పూనుకున్నారు. మాములుగా దాని ఒరిజినల్ నిర్మాతకు అంత స్థోమత లేదు. ఒకవేళ వసూళ్ల పరంగా ఏదైనా తేడా వస్తే తట్టుకోవడం కష్టం. కానీ ప్రకాష్ రాజ్ కు ఆ సమస్య లేదు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఏర్పడిన దయనీయ పరిస్థితుల ఆధారంగా ఒక చిన్న పిల్లాడి సెంటిమెంట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. క్లైమాక్స్ గుండెలు పిండేసేలా ఉంటుంది. అంతగా కదిలించింది కాబట్టి ప్రకాష్ రాజ్ కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతానికి కన్నడలో మాత్రమే తీసుకొస్తున్నారు. అక్కడ సక్సెస్ అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ లేదా రీమేక్ చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. అయితే లాక్ డౌన్ ట్రాజెడీని జనాలు మర్చిపోయిన నేపథ్యంలో ఆ బ్యాక్ డ్రాప్ తో చేసిన సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఆ మధ్య రాజేంద్రప్రసాద్ హీరోగా అనుకోని ప్రయాణం ఇలాంటి తరహాలో ఒక ఆఫ్ బీట్ మూవీ తీశారు కానీ డబ్బులు రాలేదు. కానీ ఫోటో విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఖచ్చితంగా మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఎంత నిజమో చూడాలి మరి.
This post was last modified on March 11, 2024 4:54 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…