కరోనా టైంలో, ఆ తర్వాత కొంత కాలం ఓటీటీల దూకుడు ఏ స్థాయిలో ఉండేదో తెలిసిందే. ప్రొడ్యూసర్లు కూడా ఊహించని రేటు ఇచ్చి డిజిటల్ రైట్స్ తీసుకునేవారు. కొత్త సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయించి మరీ నేరుగా డిజిటల్ రిలీజ్కు ఒప్పించి భారీ రేట్లు ఇచ్చాయి అప్పట్లో ఓటీటీలు. ఈ పరిణామం చూసి నిర్మాతలు మురిసిపోయారు. కొత్త ఆదాయ వనరు దొరికిందని బడ్జెట్లు కొంచెం పెంచారు. ఈ ఆదాయం చూసుకునే హీరోలు సైతం పారితోషకాలను అయినకాడికి పెంచేశారు.
కానీ తీరా చూస్తే ప్రేక్షకులను ఓటీటీలకు అలవాటు చేయించాక నెమ్మదిగా వాటి యాజమాన్యాల తీరు మారింది. ఇంతకముందులా వేలంవెర్రిగా సినిమాలను కొనట్లేదు. మంచి కాంబినేషన్లలో తెరకెక్కిన సినిమాలకు కూడా డిజిటల్ హక్కులు అమ్ముడవడం కష్టంగా ఉంది. దీని కారణంగా కొన్ని సినిమాలే ఆగిపోవడం చూశాం.
ఐతే థియేటర్లలో పెద్ద హిట్టయిన సినిమాలకు ఆటోమేటిగ్గా డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడైపోతుంటాయి. కానీ ఇప్పుడు ఇది కూడా జరగట్లేదు. నిర్మాతలు కోరుకున్న రేట్లు ఇవ్వడానికి ఓటీటలు సిద్ధపడట్లేదు. ప్రస్తుతం సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న మలయాళ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’కు డిజిటల్ డీల్ పూర్తి కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రూ.14 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి ఆల్రెడీ వరల్డ్ వైడ్ వంద కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది ‘మంజుమ్మెల్ బాయ్స్’. మూడో వారంలోనూ హౌస్ ఫుల్స్తో రన్ అవుతున్న ఈ చిత్రానికి ఇంకా ఓటీటీ హక్కులు అమ్ముడవలేదు.
నిర్మాతలు సినిమా సక్సెస్ రేంజ్ చూసి రూ.20 కోట్లు కోట్ చేస్తుంటే అందులో సగం మాత్రమే ఆఫర్ చేస్తున్నాయట ఓటీటీలు. పేరున్న ఓటీటీలన్నింటినీ సంప్రదించడం.. అవేవీ కూడా కోరుకున్న రేటులో 60 శాతం కూడా ఇవ్వడానికి కూడా రెడీగా లేకపోవడంతో నిర్మాతలు సైలెంట్ అయిపోయారు.
This post was last modified on March 11, 2024 8:24 am
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు మాత్రమే వచ్చిన వైసీపీ సభ్యులు.. తర్వాత పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సభకు…
ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ కావడం అన్నది రేర్ ఫీట్. తెలుగులో ఈ రికార్డు నందమూరి…
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…