Movie News

బ్లాక్‌బస్టర్ మూవీ.. ఓటీటీ కష్టాలు

కరోనా టైంలో, ఆ తర్వాత కొంత కాలం ఓటీటీల దూకుడు ఏ స్థాయిలో ఉండేదో తెలిసిందే. ప్రొడ్యూసర్లు కూడా ఊహించని రేటు ఇచ్చి డిజిటల్ రైట్స్ తీసుకునేవారు. కొత్త సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయించి మరీ నేరుగా డిజిటల్ రిలీజ్‌కు ఒప్పించి భారీ రేట్లు ఇచ్చాయి అప్పట్లో ఓటీటీలు. ఈ పరిణామం చూసి నిర్మాతలు మురిసిపోయారు. కొత్త ఆదాయ వనరు దొరికిందని బడ్జెట్లు కొంచెం పెంచారు. ఈ ఆదాయం చూసుకునే హీరోలు సైతం పారితోషకాలను అయినకాడికి పెంచేశారు.

కానీ తీరా చూస్తే ప్రేక్షకులను ఓటీటీలకు అలవాటు చేయించాక నెమ్మదిగా వాటి యాజమాన్యాల తీరు మారింది. ఇంతకముందులా వేలంవెర్రిగా సినిమాలను కొనట్లేదు. మంచి కాంబినేషన్లలో తెరకెక్కిన సినిమాలకు కూడా డిజిటల్ హక్కులు అమ్ముడవడం కష్టంగా ఉంది. దీని కారణంగా కొన్ని సినిమాలే ఆగిపోవడం చూశాం.

ఐతే థియేటర్లలో పెద్ద హిట్టయిన సినిమాలకు ఆటోమేటిగ్గా డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడైపోతుంటాయి. కానీ ఇప్పుడు ఇది కూడా జరగట్లేదు. నిర్మాతలు కోరుకున్న రేట్లు ఇవ్వడానికి ఓటీటలు సిద్ధపడట్లేదు. ప్రస్తుతం సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న మలయాళ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’కు డిజిటల్ డీల్ పూర్తి కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రూ.14 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి ఆల్రెడీ వరల్డ్ వైడ్ వంద కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది ‘మంజుమ్మెల్ బాయ్స్’. మూడో వారంలోనూ హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతున్న ఈ చిత్రానికి ఇంకా ఓటీటీ హక్కులు అమ్ముడవలేదు.

నిర్మాతలు సినిమా సక్సెస్ రేంజ్ చూసి రూ.20 కోట్లు కోట్ చేస్తుంటే అందులో సగం మాత్రమే ఆఫర్ చేస్తున్నాయట ఓటీటీలు. పేరున్న ఓటీటీలన్నింటినీ సంప్రదించడం.. అవేవీ కూడా కోరుకున్న రేటులో 60 శాతం కూడా ఇవ్వడానికి కూడా రెడీగా లేకపోవడంతో నిర్మాతలు సైలెంట్ అయిపోయారు.

This post was last modified on March 11, 2024 8:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

3 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

4 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

5 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

5 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

7 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

7 hours ago