కరోనా టైంలో, ఆ తర్వాత కొంత కాలం ఓటీటీల దూకుడు ఏ స్థాయిలో ఉండేదో తెలిసిందే. ప్రొడ్యూసర్లు కూడా ఊహించని రేటు ఇచ్చి డిజిటల్ రైట్స్ తీసుకునేవారు. కొత్త సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయించి మరీ నేరుగా డిజిటల్ రిలీజ్కు ఒప్పించి భారీ రేట్లు ఇచ్చాయి అప్పట్లో ఓటీటీలు. ఈ పరిణామం చూసి నిర్మాతలు మురిసిపోయారు. కొత్త ఆదాయ వనరు దొరికిందని బడ్జెట్లు కొంచెం పెంచారు. ఈ ఆదాయం చూసుకునే హీరోలు సైతం పారితోషకాలను అయినకాడికి పెంచేశారు.
కానీ తీరా చూస్తే ప్రేక్షకులను ఓటీటీలకు అలవాటు చేయించాక నెమ్మదిగా వాటి యాజమాన్యాల తీరు మారింది. ఇంతకముందులా వేలంవెర్రిగా సినిమాలను కొనట్లేదు. మంచి కాంబినేషన్లలో తెరకెక్కిన సినిమాలకు కూడా డిజిటల్ హక్కులు అమ్ముడవడం కష్టంగా ఉంది. దీని కారణంగా కొన్ని సినిమాలే ఆగిపోవడం చూశాం.
ఐతే థియేటర్లలో పెద్ద హిట్టయిన సినిమాలకు ఆటోమేటిగ్గా డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడైపోతుంటాయి. కానీ ఇప్పుడు ఇది కూడా జరగట్లేదు. నిర్మాతలు కోరుకున్న రేట్లు ఇవ్వడానికి ఓటీటలు సిద్ధపడట్లేదు. ప్రస్తుతం సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న మలయాళ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’కు డిజిటల్ డీల్ పూర్తి కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రూ.14 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి ఆల్రెడీ వరల్డ్ వైడ్ వంద కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది ‘మంజుమ్మెల్ బాయ్స్’. మూడో వారంలోనూ హౌస్ ఫుల్స్తో రన్ అవుతున్న ఈ చిత్రానికి ఇంకా ఓటీటీ హక్కులు అమ్ముడవలేదు.
నిర్మాతలు సినిమా సక్సెస్ రేంజ్ చూసి రూ.20 కోట్లు కోట్ చేస్తుంటే అందులో సగం మాత్రమే ఆఫర్ చేస్తున్నాయట ఓటీటీలు. పేరున్న ఓటీటీలన్నింటినీ సంప్రదించడం.. అవేవీ కూడా కోరుకున్న రేటులో 60 శాతం కూడా ఇవ్వడానికి కూడా రెడీగా లేకపోవడంతో నిర్మాతలు సైలెంట్ అయిపోయారు.
This post was last modified on March 11, 2024 8:24 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…