ఇటీవలే బాలీవుడ్ లో విడుదలైన సైతాన్ బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్లు నమోదు చేస్తోంది. అజయ్ దేవగన్, జ్యోతిక జంటగా మాధవన్ విలన్ గా వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ కి మిక్స్డ్ టాక్ వినిపించినా వసూళ్లు మాత్రం బాగున్నాయి. ముంబై లాంటి నగరాల్లో శనివారం వీకెండ్ అర్ధరాత్రి షోలు వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుజరాతి బ్లాక్ బస్టర్ వష్ రీమేక్ గా రూపొందిన ఈ చేతబడి డ్రామాని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే షో చూసిన వెంకీకి కాన్సెప్ట్ బాగా నచ్చిందట. కాకపోతే పెద్ద రిస్క్ పొంచి ఉంది.
సైతాన్ లో మాధవన్ ది వన్ మ్యాన్ షో. పూర్తి నెగటివ్ షేడ్స్ లో సాగుతుంది. క్లైమాక్స్ లో ఏకంగా భయపెట్టేలా విశ్వరూపం చూపించాడు. అజయ్ దేవగన్ ది అధికశాతం భయం చూపిస్తూ రెండు మూడు ఎమోషన్స్ మీద నడిచిపోతుంది. ఒకవేళ వెంకటేష్ చేయాలి అనుకుంటే ఈ పాత్ర ఆయన ఇమేజ్ కి సూట్ కాదు. పోనీ మాధవన్ క్యారెక్టర్ తీసుకుంటే అంత నెగటివ్ షేడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు ఒప్పుకోరు. అప్పుడెప్పుడో నాగవల్లిలో కాసేపు అలా కనిపిస్తేనే తిరస్కరించారు. ఒకవేళ మాధవనే ఒప్పుకుంటే తనకొచ్చే ప్రాధాన్యం ముందు వెంకీ స్పేస్ తగ్గిపోతుంది.
ప్రస్తుతానికి ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఆ మధ్య డిసెంబర్ లో మోహన్ లాల్ నేరుని రీమేక్ చేసే ప్రపోజల్ వస్తే వద్దనుకున్న వెంకీ మంచి పని చేశారు. తర్వాత ఓటిటిలో చూసిన మన ఆడియన్స్ అంత సుదీర్ఘమైన కోర్ట్ డ్రామాని గొప్పగా ఉందని అనలేకపోయారు. ఇప్పుడు సైతాన్ విషయంలో అలాగే ఆలోచిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందబోయే సంక్రాంతికి వస్తున్నాం(ప్రచారంలో ఉన్న టైటిల్), రానా నాయుడు సీజన్ 2 తప్ప వెంకటేష్ అఫీషియల్ గా ఇచ్చిన కమిట్ మెంట్లు ఇంకేం లేవు.
This post was last modified on March 10, 2024 9:30 pm
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…