ఆగస్ట్ 15 విడుదల చేసే తీరతామని పుష్ప 2 ది రూల్ ఎంత చెబుతూ వస్తున్నా ఖచ్చితంగా వాయిదా పడుతుందన్న నమ్మకమో లేక దాన్ని తట్టుకుని నిలబడతామనే ధైర్యమో తెలియదు కానీ క్రమంగా ఆ డేట్ మీద కర్చీఫ్ వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా రేస్ లో ఉన్న వాళ్ళలో అజయ్ దేవగన్ సింగం అగైన్, విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఈ లిస్టులో తాజాగా జైలర్ ద్వారా మనకు దగ్గరైన శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చేరిపోయాడు. ఆయన భైరతి రణగల్ ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
ఇది 2017 మఫ్టీకి ప్రీక్వెల్. కన్నడలో పెద్ద హిట్టు. తెలుగులో రీమేక్ చేయాలని పలువురు ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. ఇందులో శివన్న గెటప్ నే వీరసింహారెడ్డిలో రిఫరెన్స్ గా వాడుకున్నామని బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. మఫ్టీకు ముందు ఏం జరిగిందనే కథని భైరతి రణగల్ లో చూపించబోతున్నారు. నర్తన్ దర్శకుడు. ఇతను ఎవరో కాదు. సుమారు ఏడాది క్రితం రామ్ చరణ్, విజయ్ దేవరకొండలకు స్టోరీ చెప్పి దాదాపు ఓకే అనిపించుకున్నంత పని చేశాడు. కానీ ఫైనల్ వెర్షన్లు కుదరక ఎందుకో ఆ కాంబోలు సాధ్యపడలేదు. తిరిగి శివన్నతో చేరాడు.
చూస్తుంటే పుష్ప 2కి అన్ని భాషల్లో టఫ్ కాంపిటీషన్ తప్పేలా లేదు. అలా అని అల్లు అర్జున్ కి వాళ్ళేదో దెబ్బ కొడతారని కాదు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ పరంగా ఎఫెక్ట్ ఉంటుంది. నార్త్ లో అజయ్ దేవగన్ కవ్వింపు మాములుగా ఉండదు. ఇవన్నీ కొంత ప్రతికూల ప్రభావం చూపించేవే. దర్శకుడు సుకుమార్ మాత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా వైజాగ్ లో సుదీర్ఘమైన షెడ్యూల్ లో మొదలుపెట్టబోతున్నారు. వేసవిలో గుమ్మడికాయ కొట్టాలని చూస్తున్నారు. అది జరిగితేనే చెప్పిన డేట్ కి పుష్ప 2 థియేటర్లలో అడుగు పెడుతుంది.
This post was last modified on March 10, 2024 9:24 pm
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…