Movie News

పూరి తమ్ముడి ఒంటరి పోరాటం

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకోవాలని చూసిన సాయిరాం శంకర్ కు మొదట్లో ఓ మాదిరి హిట్లు పడ్డాయి. అన్నయ్యే తీసిన 143 ఐ లవ్ యు ఓ మోస్తరుగా ఆడగా బంపర్ ఆఫర్ కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. అక్కడితో కుర్రాడి లైఫ్ సెటిలనే అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. అల్ట్రా డిజాస్టర్లతో సాయిరాం తన కెరీర్ ని రిస్క్ లో పెట్టుకున్నాడు. ఏవీ కనీస స్థాయిలో ఆడకపోవడంతో నిర్మాతలు క్రమంగా దూరమయ్యారు. ఒకపక్క పూరినే డైరెక్టర్ గా మార్కెట్ తగ్గించుకున్న పరిస్థితుల్లో ఇతని పరిస్థితి మెరుగు పడే అవకాశం దొరకలేదు.

2017 నేనో రకం తర్వాత సాయిరాం శంకర్ మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు ఏడేళ్ల గ్యాప్ తర్వాత వెయ్ దరువెయ్ తో మార్చి 15 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రమోషన్లు గట్రా బాగానే చేస్తున్నారు. సునీల్ విలన్ గా నటించగా ఈసారి కూడా మాస్ బ్యాక్ డ్రాప్ నే ఎంచుకున్నాడు. ఇది కాకుండా ఒక పథకం ప్రకారం (సినిమా పేరు) షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని ల్యాబ్ నుంచి బయటికి వచ్చేందుకు కష్టపడుతోంది. ఇవి సక్సెస్ అయితే బంపర్ ఆఫర్ 2 తెరకెక్కించాలనే ప్రతిపాదన ముందే అందుకున్నారు. సో ఇదంతా సాయిరాం శంకర్ కంబ్యాక్ కోసం చేస్తున్న ఒంటరి పోరాటమే.

నిజానికి పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ విషయంలోనూ లిఫ్ట్ చేయలేక వదిలేయడం చూస్తున్నాం. అతనేదో సినిమాలు చేసుకుంటున్నాడు కానీ విజయం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ప్రస్తుతం యాడ్స్ చేస్తున్నాడు తప్పించి కొత్త ప్రాజెక్టు ఇంకా ప్రకటించలేదు. వెయ్ దరువెయ్ మీద సాయిరాం శంకర్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. లైగర్ డిజాస్టర్, డబుల్ ఇస్మార్ట్ లో జరుగుతున్న ఆలస్యం వల్ల పూరి ఇవేవి పట్టించుకునే స్టేజిలో లేడు. పోటీ ఏమి లేకపోయినా సాయిరాం శంకర్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం సవాలే. టాక్ చాలా బాగుంటే తప్ప జనాలు రారు.

This post was last modified on March 10, 2024 2:14 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

56 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago