ధనుష్ – నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రానికి కుబేర టైటిల్ ని లాక్ చేస్తూ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టర్ లో మాసిన గెడ్డం, పాత దుస్తులతో ఉన్న ధనుష్ తో పాటు అందులో శివ పార్వతుల చిత్రపటం ఒకటి ఉండటం ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. అయితే ఇదేదో ఆషామాషీగా సెట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ కాదట. అదేంటో చూద్దాం. కుబేరుడు అంటే కోటీశ్వరుడని సాధారణ వాడుక భాషలో అంటారు కానీ నిజానికి ఆయన అందగాడు కాదు. ఏడుకొండలవాడికే అప్పులిచ్చాడు కానీ రూపం పరంగా మాత్రం చూడచక్కని దేహం కాదు.
శేఖర్ కమ్ముల ఈ పాత్ర డిజైన్ కోసం కుబేరుడి పూర్వ జన్మ అయిన గుణనిధి రిఫరెన్స్ తీసుకున్నారట. పురాణాల్లో సూత మహర్షి చెప్పిన ప్రకారం బ్రాహ్మణ వంశానికి చెందిన గుణనిధి వ్యసనాలకు, దొంగతనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు వెతుక్కుంటాడు. వాటిలో జూదం ఒకటి. తండ్రికి నిజం తెలిశాక గుణనిధి కట్టుబట్టలతో పారిపోయి ఒక శివాలయంలో తల దాచుకుంటాడు. అక్కడ జాగారం చేసిన భక్తులకు పుణ్యం దక్కే పని చేశాక కాలుజారి నంది తల తగిలి అక్కడే చనిపోతాడు. ఆ ఫలమే మరుజన్మలో కుబేరుడి పుట్టుక. కృతయుగంలో జన్మిస్తాడు.
కుబేరుడు మహా శివ భక్తుడు. ఆ తపస్సుకు మెచ్చే గరళకంఠుడు అద్భుత వరాలు ఇస్తాడు. శేఖర్ కమ్ముల ఈ రెండు నేపధ్యాలను తీసుకుని ధనుష్ చేస్తున్న పాత్రకు అన్వయించి ముంబై బ్యాక్ డ్రాప్ తో 90 దశకంలో ఒక బిచ్చగాడు ఎలా మాఫియా స్థాయికి ఎదిగాడనే పాయింట్ ని చూపిస్తారని టాక్. నాగార్జున తనను వెంటాడే ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ గా కనిపిస్తారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇవన్నీ అన్వయించుకుంటే శేఖర్ కమ్ముల వేసిన ప్లాన్ అంచనాలకు మించేలా ఉంది. అంత దీనమైన గెటప్ లో ధనుష్ ఎందుకు కనిపించాడో అర్థమయ్యిందిగా. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కుబేరకు ప్రధాన ఆకర్షణ.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…