రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయకు ఇప్పటికే ప్రొడక్షన్లో మంచి అనుభవం ఉంది. అతను తండ్రి తీసే సినిమాల ప్రొడక్షన్లో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. అది కాకుండా సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్న ఆసక్తి ఉంది. పూర్తి స్థాయి నిర్మాతగా మారే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. అది ఇంకా ఒక కొలిక్కా రాలేదు.
గతంలో ‘ఆకాశవాణి’ అనే సినిమాల భాగస్వామి అయి.. మళ్లీ తప్పుకున్నాడు. ఇప్పుడతను నిర్మాతగా చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా కార్తికేయ మలయాళ హిట్ మూవీ ‘ప్రేమలు’ను తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మలయాళ వెర్షన్ హైదరాబాద్లో బాగా ఆడుతుండగా.. తెలుగులో అనువాదం చేసి ఈ శుక్రవారమే రిలీజ్ చేశాడు కార్తికేయ.
ఎక్కడా మలయాళ నేటివిటీ లేకుండా తెలుగు సినిమా అనిపించేలా కథ, నేపథ్యం ఉండటం ఈ సినిమాకు ప్లస్. ఒరిజినల్లో కూడా ఈ కథ హైదరాబాద్ నేపథ్యంలోనే నడుస్తుంది. ఇక ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ ఫేమ్ ఆదిత్య హాసన్తో ట్రెండీ డైలాగులు రాయించడం.. మీమ్స్ను ఫుల్లుగా వాడేసుకోవడంతో ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమా జాలీ రైడ్లాగా సరదాగా సాగిపోవడం.. హీరో హీరోయిన్ల పాత్రలు, వాటిని పోషించిన నటులు లవబుల్గా అనిపించడం సినిమాకు ప్లస్ అయింది. మొత్తంగా సినిమా మంచి టాక్ తెచ్చుకుని తొలి రోజు మంచి వసూళ్లతో నడిచింది. సాయంత్రం షోలు కొన్ని ఫుల్ అయ్యాయి కూడా.
ముందు వారంలో వచ్చిన సినిమాలన్నీ వాషౌట్ అయిపోవడంతో ‘ప్రేమలు’కు మంచి సంఖ్యలో స్క్రీన్లు దక్కాయి. రెండో రోజు ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు కూడా పెరిగాయి. తక్కువ మొత్తానికి రైట్స్ తీసుకుని మంచి క్వాలిటీతో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేయడంతో కార్తికేయకు ఈ సినిమా మంచి లాభాలే తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.
This post was last modified on March 9, 2024 9:17 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…