నిన్న విడుదలైన గామికి ముందు నుంచి ఏర్పడ్డ అంచనాలకు తగ్గట్టే టాక్ రావడంతో మొదటి రోజు ఏకంగా 9 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. మాములుగా మాస్ కంటెంట్ కే ఎక్కువ ఆదరణ ఉండే సీడెడ్ లాంటి ప్రాంతంలో యాభై లక్షలకు పైగా వసూలు చేయడం ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని తేటతెల్లం చేస్తోంది. టాక్ రాక ముందు గోపిచంద్ భీమా వల్ల మాస్ సెంటర్స్ లో గట్టి పోటీ ఉంటుందనే అంచనాలకు భిన్నంగా విశ్వక్ సేన్ సినిమా ఇలాంటి ఫిగర్లు నమోదు చేయడం విశేషం. నిన్న సెలవు రోజుని పూర్తిగా వాడేసుకుంది.
అన్ని ఏరియాల్లో చూసుకుంటే నైజామ్ లో గామి చాలా స్ట్రాంగ్ గా ఉంది. మల్టీప్లెక్సుల్లో భారీ ఫిగర్లు నమోదవుతున్నాయి. వీకెండ్ మొత్తం కంట్రోల్ లోకి వచ్చేలా ఉంది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ని రప్పించేలా చేసుకోవడం తర్వాతి రోజుల్లో గామి స్టేటస్ ని నిర్ణయించనుంది. ఏ సర్టిఫికెట్ కావడంతో పలు చోట్ల పిల్లల్ని అనుమతిస్తారో లేదోననే అనుమానంతో కుటుంబాలు వెళ్లేందుకు ఆలోచిస్తున్నాయి. ఇలాంటివి కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. యానిమల్, సలార్ లాగా హీరో ఎలివేషన్ల మీద నడిచే కంటెంట్ కాకపోవడంతో దీని ఇంపాక్ట్ గామి మీద ఉండే ఛాన్స్ కొట్టిపారేయలేం.
దర్శకుడు విద్యాధర్ కి ఫుల్ మార్కులు పడుతున్నాయి. నెరేషన్ నెమ్మదిగా ఉందన్న కామెంట్ ని కాదనలేం కానీ పరిమిత బడ్జెట్ లో ఇంత క్వాలిటీ విజువల్స్, హిమాలయాలు, హరిద్వార్, కాశి లాంటి రిస్కీ ప్రాంతాల్లో షూట్ చేసిన విధానం మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. ఆదివారం దాకా ఢోకా లేకపోయినా సోమవారం నుంచి డ్రాప్ ని పరిమితంగా మేనేజ్ చేసుకోవడం గామి ముందున్న సవాల్. కాంపిటీషన్ లో ఉన్న భీమాకు రొటీననే టాక్ రాగా మలయాళం డబ్బింగ్ ప్రేమలు మెల్లగా పికప్ అవుతోంది. సో కలెక్షన్ల లెక్కలో చూసుకుంటే ఫస్ట్ డే విజేత నిస్సందేహంగా గామినే.
This post was last modified on March 9, 2024 11:35 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…