ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా అంటే.. గామినే. ఒక సినిమాకు ఎక్కువ టైం పడితే రెండేళ్లు తీస్తారు.. మూడేళ్లు తీస్తారు.. కానీ ఈ సినిమా మొదలుపెట్టి పూర్తి చేసేలోపు ఆరేళ్లు గడిచిపోయాయి. పేరుకు చిన్న సినిమా కానీ.. ఈ సినిమా విజువల్స్ చూస్తే ఒక భారీ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా కనిపించింది టీజర్, ట్రైలర్ చూస్తే. అవే ప్రేక్షకులను అమితాశ్చర్యానికి గురి చేశాయి.
ఇక సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ ఆసక్తితోనే తొలి రోజు థియేటర్లకు అభిరుచి ఉన్న ప్రేక్షకులు బాగానే కదిలారు. కొన్ని సినిమాలు ప్రోమోల వరకు ఆహా అనిపించి.. థియేటర్కు వెళ్లాక ఉస్సూరుమనిపిస్తుంటాయి. కానీ గామి ఆ కోవకు చెందిన సినిమా కాదని తొలి ఫ్రేమ్ నుంచి చివరి వరకు అర్థమవుతూనే ఉంటుంది.
అఘోరాల నేపథ్యంలో వచ్చే తొలి ఎపిసోడ్ నుంచే విజువల్గా గామి కట్టి పడేస్తుంది. ఆ తర్వాత మహా కుంభమేళా.. ఆపై హిమాలయాలు.. అలాగే ఇండియా-చైనా బోర్డర్లో ఉండే ఒక సీక్రెట్ లేబొరేటరీ అంటూ చూపించే ప్రాంతం.. ఇలా ప్రతి చోటా గామి విజువల్ మాయాజాలాన్ని చూడొచ్చు. హిమాలయాలు.. సీక్రెట్ ల్యాబ్ నేపథ్యంలో వచ్చే సీన్లయితే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి.
అసలు అనుభం లేని డైరెక్టర్.. మిగతా టెక్నీషియన్లు అందరూ కూడా కొత్త వాళ్లే. వీళ్లకు భారీ బడ్జెట్ కూడా అందుబాటులో లేదు. పరిమిత వనరులతో, తక్కువ కాస్ట్ అండ్ క్రూతో సినిమా తీస్తూ ఇలాంటి విజువల్స్ రాబట్టడం.. వీఎఫెక్స్ అంత బాగా చేయించుకుని తెర మీద అంత మంచి ఔట్ పుట్ తీసుకురావడం అసామాన్యమైన విషయం. తక్కువ బడ్జెట్లో గొప్ప ఔట్ పుట్ రాబట్టుకునే విషయంలో టాలీవుడ్కు గామి ఒక పాఠంలా మారుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on March 8, 2024 9:41 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…