అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న పుష్ప పార్ట్ 2 ది రూల్ ఆగస్ట్ 15 విడుదలకు ఇంకో అయిదు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికే భారీగా ఉన్న అంచనాలు మరింత ఎగబాకనున్నాయి. మైత్రి మేకర్స్ ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. నెలల క్రితం రిలీజ్ చేసిన చిన్న టీజర్ తప్ప ఎలాంటి వీడియో కంటెంట్ మళ్ళీ వదల్లేదు. గంగమ్మ జాతర స్టిల్ ని ప్రత్యేకంగా వదలడం మినహాయించి ఇంకెలాంటి అప్డేట్స్ లేవు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ డే అండ్ నైట్ పుష్పనే ప్రపంచంగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఇక అసలు పాయింట్ కు వస్తే పుష్ప 2లో అనసూయ పాత్ర చాలా కీలకంగా వ్యవహరించనుందని యూనిట్ టాక్. మొదటి భాగంలో దాక్షాయణిగా కనిపించిన ఈమెకు కథ ప్రకారం రెండు రివెంజ్ పాయింట్లున్నాయి. ఒకటి పుష్ప చేతిలో తమ్ముడు చనిపోవడం. రెండు అతని కారణంగానే మంగళం శీను అలియాస్ సునీల్ ని భర్తని చూడకుండా తన చేతులతోనే స్వయంగా గొంతుకు గాయం చేయాల్సి రావడం. వీటికి ప్రతీకారంగా ఫహద్ ఫాసిల్ చేసిన భన్వర్ సింగ్ షెకావత్ తో చేతులు కలిపి ఎర్రచందనం మాఫియాని ఆమె చేతుల్లోకి తీసుకునే ఎపిసోడ్లు సుకుమార్ బాగా తీశారని వినికిడి.
ఇవి కనక ఎడిటింగ్ కు గురి కాకుండా సరిగ్గా పేలితే రంగస్థలంలో రంగమ్మత్తని మించి గుర్తింపు రావడం ఖాయమని రషెస్ చూసినవాళ్ల నుంచి వినిపిస్తున్న మాట. సునీల్ ప్రాధాన్యం కూడా పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం కీలక భాగాల చిత్రీకరణలో బిజీగా ఉన్న సుకుమార్ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపిక చేసే తతంగం ఎంతకీ తెమలక సతమతమవుతున్నారట. శ్రీలీల, జాన్వీ కపూర్, దిశా పటాని ఇలా పలు ఆప్షన్లు ట్రై చేసి వర్కవుట్ కాక వేరే ఛాయస్ చూస్తున్నారట. జూన్ లోగా పాటలతో సహా మొత్తం పూర్తయితే తప్ప పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీకి తగినంత సమయం దొరకదు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…