స్టార్ హీరోల సినిమాలు ఏవైనా ఇలా మొదలయ్యాయంటే.. అలా అభిమానుల నుంచి అప్డేట్స్ కోసం డిమాండ్లు మొదలైపోతాయి. రెగ్యులర్ ఇంటర్వల్స్లో వాళ్లకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉండాలి. మా పని మేం చేసుకుంటుంటే ఎంతసేపూ అప్డేట్ అప్డేట్ అంటే ఎలా అని జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు అసహనం వ్యక్తం చేసినా.. అభిమానుల గొడవ అభిమానులదే. ఈ మధ్య కాలంలో అప్డేట్ అప్డేట్ అంటూ అడిగి అడిగి విసుగెత్తిపోయిన ఫ్యాన్స్ అంటే.. రామ్ చరణ్ అభిమానులే.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ నుంచి ఏదైనా విశేషం బయటికి వస్తుందేమో అని వాళ్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఒక పాట రిలీజ్ చేస్తామని చాలా నెలలుగా ఊరిస్తోంది చిత్ర బృందం. కానీ అది ఎంతకూ బయటికి రావట్లేదు. గతంలో ఆ పాటకు సంబంధించి రా వెర్షన్ ఆన్ లైన్లో లీక్ అవ్వడం తెలిసిందే. ఈ పాట గతంలో అనుకున్న ప్రకారం లాంచ్ కాకపోవడానికి అది కూడా ఒక కారణమే.
ఐతే ఎట్టకేలకు ‘గేమ్ చేంజర్’ నుంచి పాట లాంచ్ కాబోతున్న విషయం దాదాపుగా ఖరారైనట్లే కనిపిస్తోంది. ‘గేమ్ చేంజర్’ నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ సినిమా అప్డేట్ గురించి కన్ఫర్మేషన్ ఇచ్చారు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘లవ్ మి’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులకు హుషారునిచ్చే మాట చెప్పారు రాజు. ఈ సినిమా అప్డేట్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో, బయట చాలా గొడవ చేస్తున్నారని.. మార్చి 27న చరణ్ పుట్టిన రోజు కానుకగా అప్డేట్ ఇస్తున్నామని రాజు వెల్లడించాడు. దీంతో ఆడిటోరియంలో చరణ్ అభిమానులు ఆనందం మిన్నంటింది.
మరోవైపు నానితో తాను ప్రొడ్యూస్ చేయబోయే కొత్త సినిమా కబురు కూడా చెప్పాడు రాజు. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరెకెక్కనున్న ఈ చిత్రానికి అంతా సిద్ధమైందని చెబుతూ ‘యెల్లమ్మ’ అని ఈ సినిమాకు ప్రచారంలో ఉన్న పేరును కూడా ఆయన ఖరారు చేశారు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…