Movie News

ప్రభుత్వమే ఓటీటీ మొదలుపెట్టింది

కరోనా కాలంలో సినిమాల పరంగా వచ్చిన అతి పెద్ద మార్పు.. ఓటీటీ ఫ్లాట్‌ఫాంల హవా పెరగడం. అప్పటికే ఇండియాలో కొన్ని ఓటీటీలు ఉన్నాయి కానీ.. అవి ఓ మోస్తరు స్థాయిలో నడుస్తుండేవి. కానీ కరోనా టైంలో థియేటర్లు మూతబడి.. అవి తెరుచుకున్నాక కూడా జనాలు థియేటర్లకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి ప్రదర్శించని సమయంలో ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్స్ విజృంభించాయి. అన్ని సంస్థలూ కంటెంట్ మీద భారీగా పెట్టుబడులు పెట్టాయి. కొత్తగా అనేక ఓటీటీలు పుట్టుకొచ్చాయి. మొదట్లో ఉన్నంత దూకుడు లేకపోయినా.. ఆ తర్వాత కూడా ఓటీటీల జోరు కొనసాగింది.

తెలుగులో ‘ఆహా’ కూడా బాగానే సబ్‌స్క్రిప్షన్లు సాధించింది. ఈ మధ్య ‘ఈటీవీ విన్’ కొంచెం దూకుడు చూపిస్తోంది. ఐతే ఈ మధ్య ఓటీటీల జోరు కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది. కాగా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓటీటీలను నిర్వహించే సంప్రదాయం మొదలవుతోంది. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ సర్కారు చిన్న స్థాయిలో ఒక ఓటీటీని మొదలుపెట్టింది. ఐతే దానికి సరైన స్పందన లేదు.

కాగా ఇప్పుడు కేరళ ప్రభుత్వం కొంచెం పెద్ద స్థాయిలో ఓటీటీని నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్ చేతుల మీదుగా మొదలైన ఆ ప్రభుత్వ ఓటీటీ పేరు.. సిస్పేస్. కేరళ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఓటీటీ నడవనుంది. ముగ్గురు నిపుణుల కమిటీ సినిమాల కొనుగోలు, ఇతర వ్యవహారాలను చూసుకుంటుంది. 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిలింతో ఈ ఓటీటీని లాంచ్ చేశారు. భవిష్యత్తులో కంటెంట్ మరింత పెంచనున్నారు. సబ్‌స్క్రిప్షన్ కాకుండా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ ఓటీటీ మొదలైంది. ఇందులో ఒక్కో సినిమా వీక్షణకు 75 రూపాయలు చెల్లించాలి. అందులో సగం మొత్తం కంటెంట్ ప్రొవైడర్‌కు వెళ్తుంది. మిగతాది ప్రభుత్వ మెయింటైనెన్స్ అన్నమాట. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను బట్టి సి స్పేస్‌లో కంటెంట్‌ను పెంచి పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది కేరళ ప్రభుత్వం.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago