కరోనా కాలంలో సినిమాల పరంగా వచ్చిన అతి పెద్ద మార్పు.. ఓటీటీ ఫ్లాట్ఫాంల హవా పెరగడం. అప్పటికే ఇండియాలో కొన్ని ఓటీటీలు ఉన్నాయి కానీ.. అవి ఓ మోస్తరు స్థాయిలో నడుస్తుండేవి. కానీ కరోనా టైంలో థియేటర్లు మూతబడి.. అవి తెరుచుకున్నాక కూడా జనాలు థియేటర్లకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి ప్రదర్శించని సమయంలో ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్స్ విజృంభించాయి. అన్ని సంస్థలూ కంటెంట్ మీద భారీగా పెట్టుబడులు పెట్టాయి. కొత్తగా అనేక ఓటీటీలు పుట్టుకొచ్చాయి. మొదట్లో ఉన్నంత దూకుడు లేకపోయినా.. ఆ తర్వాత కూడా ఓటీటీల జోరు కొనసాగింది.
తెలుగులో ‘ఆహా’ కూడా బాగానే సబ్స్క్రిప్షన్లు సాధించింది. ఈ మధ్య ‘ఈటీవీ విన్’ కొంచెం దూకుడు చూపిస్తోంది. ఐతే ఈ మధ్య ఓటీటీల జోరు కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది. కాగా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓటీటీలను నిర్వహించే సంప్రదాయం మొదలవుతోంది. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ సర్కారు చిన్న స్థాయిలో ఒక ఓటీటీని మొదలుపెట్టింది. ఐతే దానికి సరైన స్పందన లేదు.
కాగా ఇప్పుడు కేరళ ప్రభుత్వం కొంచెం పెద్ద స్థాయిలో ఓటీటీని నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్ చేతుల మీదుగా మొదలైన ఆ ప్రభుత్వ ఓటీటీ పేరు.. సిస్పేస్. కేరళ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఓటీటీ నడవనుంది. ముగ్గురు నిపుణుల కమిటీ సినిమాల కొనుగోలు, ఇతర వ్యవహారాలను చూసుకుంటుంది. 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిలింతో ఈ ఓటీటీని లాంచ్ చేశారు. భవిష్యత్తులో కంటెంట్ మరింత పెంచనున్నారు. సబ్స్క్రిప్షన్ కాకుండా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ ఓటీటీ మొదలైంది. ఇందులో ఒక్కో సినిమా వీక్షణకు 75 రూపాయలు చెల్లించాలి. అందులో సగం మొత్తం కంటెంట్ ప్రొవైడర్కు వెళ్తుంది. మిగతాది ప్రభుత్వ మెయింటైనెన్స్ అన్నమాట. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను బట్టి సి స్పేస్లో కంటెంట్ను పెంచి పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది కేరళ ప్రభుత్వం.
This post was last modified on March 8, 2024 11:32 am
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…