గత ఏడాది బలగంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దిల్ రాజు వారసుల స్వంత ప్రొడక్షన్స్ ఇప్పుడు ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే పెళ్లి కొడుకుగా మారిన ఆశిష్ రెడ్డి హీరోగా, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందించారు. మాములుగా కథల కొరతతో టాలీవుడ్ ఎంతగా కొట్టుమిట్టాడుతొందో చూస్తున్నాం. అందులోనూ ఒకే తరహా పాయింట్లతో హారర్ జానర్ రొటీన్ గా మారిపోయింది. అందులో ఒక లవ్ స్టోరీ తీయడం వెరైటీ ఐడియా. లవ్ మీ బృందం అదే చేసింది. ఇందాక రిలీజ్ చేసిన టీజర్ లో క్లారిటీ ఇచ్చారు.
ఎక్కడో పాడుబడిన బంగాళాలో ఓ అందమైన దెయ్యం ఉంటుంది. దాన్ని ఒక్కసారి చూసినవాళ్లకు నెక్స్ట్ చావు తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అందుకే ఎవరూ ఆ ఛాయలకు వెళ్లకుండా ఉంటారు. ఓ కుర్రాడికి సరదా పుడుతుంది. కేవలం చూడటమే కాదు ఆ దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన స్నేహితులతో పాటు అక్కడికి వెళ్లేలా చేస్తుంది. కోరి మరీ ప్రమాదాలకు స్వాగతం చెప్పే అతనికి అక్కడికి వెళ్ళాక అనూహ్యమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఏదో తమాషాకి అనుకున్న ప్రేమ సీరియస్ గా మారిపోతుంది. ప్రాణాల మీదకు తెస్తుంది. అదెలాగో థియేటర్లోనే చూడాలి.
ఆర్య తర్వాత అంత పాజిటివ్ వైబ్ దీనికే అనిపించిందని దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే చాలా క్వాలిటీ టీమ్ ని సెట్ చేసుకున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకులు పిసి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు తీసుకోగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మాములుగా ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాకు టీమ్ లో యూత్ ఎక్కువగా ఉంటారు. దానికి భిన్నంగా అరుణ్ అదే పనిగా అనుభవజ్ఞులు తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. త్వరలో విడుదల కాబోతున్న లవ్ మీ నుంచి వచ్చే పాటలు కూడా ట్రెండ్ సెట్టర్ లా ఉంటాయని దిల్ రాజు ప్రత్యేకంగా ఊరిస్తున్నారు
This post was last modified on March 7, 2024 5:32 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…