గత ఏడాది బలగంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దిల్ రాజు వారసుల స్వంత ప్రొడక్షన్స్ ఇప్పుడు ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే పెళ్లి కొడుకుగా మారిన ఆశిష్ రెడ్డి హీరోగా, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందించారు. మాములుగా కథల కొరతతో టాలీవుడ్ ఎంతగా కొట్టుమిట్టాడుతొందో చూస్తున్నాం. అందులోనూ ఒకే తరహా పాయింట్లతో హారర్ జానర్ రొటీన్ గా మారిపోయింది. అందులో ఒక లవ్ స్టోరీ తీయడం వెరైటీ ఐడియా. లవ్ మీ బృందం అదే చేసింది. ఇందాక రిలీజ్ చేసిన టీజర్ లో క్లారిటీ ఇచ్చారు.
ఎక్కడో పాడుబడిన బంగాళాలో ఓ అందమైన దెయ్యం ఉంటుంది. దాన్ని ఒక్కసారి చూసినవాళ్లకు నెక్స్ట్ చావు తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అందుకే ఎవరూ ఆ ఛాయలకు వెళ్లకుండా ఉంటారు. ఓ కుర్రాడికి సరదా పుడుతుంది. కేవలం చూడటమే కాదు ఆ దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన స్నేహితులతో పాటు అక్కడికి వెళ్లేలా చేస్తుంది. కోరి మరీ ప్రమాదాలకు స్వాగతం చెప్పే అతనికి అక్కడికి వెళ్ళాక అనూహ్యమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఏదో తమాషాకి అనుకున్న ప్రేమ సీరియస్ గా మారిపోతుంది. ప్రాణాల మీదకు తెస్తుంది. అదెలాగో థియేటర్లోనే చూడాలి.
ఆర్య తర్వాత అంత పాజిటివ్ వైబ్ దీనికే అనిపించిందని దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే చాలా క్వాలిటీ టీమ్ ని సెట్ చేసుకున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకులు పిసి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు తీసుకోగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మాములుగా ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాకు టీమ్ లో యూత్ ఎక్కువగా ఉంటారు. దానికి భిన్నంగా అరుణ్ అదే పనిగా అనుభవజ్ఞులు తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. త్వరలో విడుదల కాబోతున్న లవ్ మీ నుంచి వచ్చే పాటలు కూడా ట్రెండ్ సెట్టర్ లా ఉంటాయని దిల్ రాజు ప్రత్యేకంగా ఊరిస్తున్నారు
This post was last modified on March 7, 2024 5:32 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…