టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ కెరీర్లో అతి పెద్ద మలుపు అంటే.. ‘జయం’ మూవీనే. లెజెండరీ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడైన గోపీచంద్ ‘తొలి వలపు’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాగా.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో తన కెరీర్ డోలాయమానంలో పడింది. ఆ స్థితిలో ‘జయం’ మూవీతో గోపీని విలన్గా పరిచయం చేశాడు తేజ. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయి గోపీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నిజం, వర్షం లాంటి చిత్రాల్లో విలన్గా మరింత మెప్పించిన గోపీ.. ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు.
ఇలా తన కెరీర్ను మలుపు తిప్పిన తేజ.. తర్వాత ఓ సినిమాలో హీరోగా నటించమంటే నో అన్నాడట గోపీచంద్. ఐతే అది ధిక్కరింపు కాదని.. తనకు సూటవ్వని సినిమా కాబట్టే దానికి నో చెప్పానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు గోపీచంద్.
“తేజ గారు ‘నిజం’ తర్వాత కొన్నేళ్లకు ఓ కథ చెప్పారు. అందులో హీరో పాత్రే ఇచ్చారు. కానీ అది లేడీ ఓరియెంటెడ్ టచ్ ఉన్న సినిమా. నాకు సూట్ కాదనిపించింది. నా పక్కన ఓ కొత్తమ్మాయిని నటింపజేయాలనుకున్నారు. అది మరింత రిస్క్. ఎవరైనా పేరున్న హీరోయిన్ అయితే బాగుంటుందన్నా. మొత్తంగా నా అయిష్టతను ఆయనకు తెలియజేశా. తేజ గారు నా అభిప్రాయంతో ఏకీభవించారు. కొన్నిసార్లు మొహమాటాలకు పోయి చేసిన సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అందుకే నేను పూర్తిగా సంతృప్తి చెందిన సినిమాలే చేయాలనుకున్నా” అని గోపీచంద్ తెలిపాడు.
ఇక తన కెరీర్లో ఎంతో నచ్చి చేసిన సినిమాల్లో కొన్ని సరిగా ఆడకపోవడం బాధ పెట్టిందంటూ.. ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ చిత్రాలను ఉదాహరణగా చెప్పాడు గోపీచంద్. ‘ఒక్కడున్నాడు’ను ఇప్పుడు రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని చెప్పాడు. కొన్ని లోపాలున్నప్పటికీ ‘గౌతమ్ నంద’ కూడా పెద్ద హిట్టవ్వాల్సిన సినిమాగా పేర్కొన్నాడు.
This post was last modified on March 7, 2024 4:14 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…