టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ కెరీర్లో అతి పెద్ద మలుపు అంటే.. ‘జయం’ మూవీనే. లెజెండరీ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడైన గోపీచంద్ ‘తొలి వలపు’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాగా.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో తన కెరీర్ డోలాయమానంలో పడింది. ఆ స్థితిలో ‘జయం’ మూవీతో గోపీని విలన్గా పరిచయం చేశాడు తేజ. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయి గోపీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నిజం, వర్షం లాంటి చిత్రాల్లో విలన్గా మరింత మెప్పించిన గోపీ.. ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు.
ఇలా తన కెరీర్ను మలుపు తిప్పిన తేజ.. తర్వాత ఓ సినిమాలో హీరోగా నటించమంటే నో అన్నాడట గోపీచంద్. ఐతే అది ధిక్కరింపు కాదని.. తనకు సూటవ్వని సినిమా కాబట్టే దానికి నో చెప్పానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు గోపీచంద్.
“తేజ గారు ‘నిజం’ తర్వాత కొన్నేళ్లకు ఓ కథ చెప్పారు. అందులో హీరో పాత్రే ఇచ్చారు. కానీ అది లేడీ ఓరియెంటెడ్ టచ్ ఉన్న సినిమా. నాకు సూట్ కాదనిపించింది. నా పక్కన ఓ కొత్తమ్మాయిని నటింపజేయాలనుకున్నారు. అది మరింత రిస్క్. ఎవరైనా పేరున్న హీరోయిన్ అయితే బాగుంటుందన్నా. మొత్తంగా నా అయిష్టతను ఆయనకు తెలియజేశా. తేజ గారు నా అభిప్రాయంతో ఏకీభవించారు. కొన్నిసార్లు మొహమాటాలకు పోయి చేసిన సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అందుకే నేను పూర్తిగా సంతృప్తి చెందిన సినిమాలే చేయాలనుకున్నా” అని గోపీచంద్ తెలిపాడు.
ఇక తన కెరీర్లో ఎంతో నచ్చి చేసిన సినిమాల్లో కొన్ని సరిగా ఆడకపోవడం బాధ పెట్టిందంటూ.. ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ చిత్రాలను ఉదాహరణగా చెప్పాడు గోపీచంద్. ‘ఒక్కడున్నాడు’ను ఇప్పుడు రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని చెప్పాడు. కొన్ని లోపాలున్నప్పటికీ ‘గౌతమ్ నంద’ కూడా పెద్ద హిట్టవ్వాల్సిన సినిమాగా పేర్కొన్నాడు.
This post was last modified on March 7, 2024 4:14 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…