తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాలకు మంచి ఆప్షన్ గా నిలుస్తున్న కుర్ర హీరో సుహాస్ కు ఇటీవలే విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఆశించినంత పెద్ద ఫలితం ఇవ్వలేదు కానీ కమర్షియల్ గా నిర్మాతలు గట్టెక్కే వసూళ్లను తెచ్చింది. అంతకు ముందు రైటర్ పద్మభూషణ్ ద్వారా యూత్ తో పాటు ఫ్యామిలీస్ కు దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరస రిలీజులతో బిజీగా ఉన్న సుహాస్ త్వరలో ప్రసన్న వదనంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇవాళ రిలీజ్ చేసిన టీజర్ లో కాన్సెప్ట్ వైవిధ్యంగా అనిపించి అంచనాలు రేకెత్తించేలా ఉంది.
అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ వెరైటీ థ్రిల్లర్ లో ఫేస్ బ్లైండ్ నెస్ అనే పాయింట్ తీసుకున్నారు. అంటే అవతలి వాళ్ళ మొహాలు కనిపించలేని జబ్బు. చుట్టూ పరిసరాలు అన్నీ స్పష్టంగా ఉన్నా సరే ఎదురుగా ఉండే వ్యక్తులను పోల్చుకోలేడు. దీనికి లవ్, క్రైమ్ ని జోడించి డిఫరెంట్ గా ట్రై చేసినట్టున్నారు. నిజానికి సుహాస్ కు ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు చాలా అవసరం. రొటీన్ ఫార్ములా జోలికి వెళ్లే ఇమేజ్ తనకు లేదు. జనాలను థియేటర్లకు రప్పించాలంటే కంటెంట్ తప్ప వేరే ఆప్షన్ లేదు. పైగా గ్లామర్ తో మాస్ వర్గాలను ఆకట్టుకునే సబ్జెక్టులు చేయలేడు కాబట్టి ఇలాంటివే బెస్ట్.
పోటీ విపరీతంగా ఉన్న టైంలో క్రియేటివిటీని చూపించే ప్రయోగాలు మార్కెట్ ని పెంచుతాయి. అలా అని ఆడియన్స్ కి కనెక్ట్ కాలేని వాటిని తీసుకున్నా ఇబ్బందే. పారితోషికం పెంచుతున్నారటగా అని అడిగిన ప్రశ్నకు ఏం నేను బ్రతకొద్దా అంటూ నవ్వుతు సమాధానం ఇచ్చిన సుహాస్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన మూడు కోట్ల రెమ్యునరేషన్ ప్రచారాన్ని మాత్రం అంగీకరించలేదు. ఇకపై స్పీడ్ తగ్గిస్తానని, వేగంగా సినిమాలు చేయడం వల్ల క్వాలిటీ దెబ్బ తినే ప్రమాదముందని చెబుతున్నాడు. ఇదీ మంచిదే . ప్రసన్న వదనంతో పాటు గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…