తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాలకు మంచి ఆప్షన్ గా నిలుస్తున్న కుర్ర హీరో సుహాస్ కు ఇటీవలే విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఆశించినంత పెద్ద ఫలితం ఇవ్వలేదు కానీ కమర్షియల్ గా నిర్మాతలు గట్టెక్కే వసూళ్లను తెచ్చింది. అంతకు ముందు రైటర్ పద్మభూషణ్ ద్వారా యూత్ తో పాటు ఫ్యామిలీస్ కు దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరస రిలీజులతో బిజీగా ఉన్న సుహాస్ త్వరలో ప్రసన్న వదనంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇవాళ రిలీజ్ చేసిన టీజర్ లో కాన్సెప్ట్ వైవిధ్యంగా అనిపించి అంచనాలు రేకెత్తించేలా ఉంది.
అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ వెరైటీ థ్రిల్లర్ లో ఫేస్ బ్లైండ్ నెస్ అనే పాయింట్ తీసుకున్నారు. అంటే అవతలి వాళ్ళ మొహాలు కనిపించలేని జబ్బు. చుట్టూ పరిసరాలు అన్నీ స్పష్టంగా ఉన్నా సరే ఎదురుగా ఉండే వ్యక్తులను పోల్చుకోలేడు. దీనికి లవ్, క్రైమ్ ని జోడించి డిఫరెంట్ గా ట్రై చేసినట్టున్నారు. నిజానికి సుహాస్ కు ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు చాలా అవసరం. రొటీన్ ఫార్ములా జోలికి వెళ్లే ఇమేజ్ తనకు లేదు. జనాలను థియేటర్లకు రప్పించాలంటే కంటెంట్ తప్ప వేరే ఆప్షన్ లేదు. పైగా గ్లామర్ తో మాస్ వర్గాలను ఆకట్టుకునే సబ్జెక్టులు చేయలేడు కాబట్టి ఇలాంటివే బెస్ట్.
పోటీ విపరీతంగా ఉన్న టైంలో క్రియేటివిటీని చూపించే ప్రయోగాలు మార్కెట్ ని పెంచుతాయి. అలా అని ఆడియన్స్ కి కనెక్ట్ కాలేని వాటిని తీసుకున్నా ఇబ్బందే. పారితోషికం పెంచుతున్నారటగా అని అడిగిన ప్రశ్నకు ఏం నేను బ్రతకొద్దా అంటూ నవ్వుతు సమాధానం ఇచ్చిన సుహాస్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన మూడు కోట్ల రెమ్యునరేషన్ ప్రచారాన్ని మాత్రం అంగీకరించలేదు. ఇకపై స్పీడ్ తగ్గిస్తానని, వేగంగా సినిమాలు చేయడం వల్ల క్వాలిటీ దెబ్బ తినే ప్రమాదముందని చెబుతున్నాడు. ఇదీ మంచిదే . ప్రసన్న వదనంతో పాటు గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
This post was last modified on March 7, 2024 2:59 pm
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…