తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాలకు మంచి ఆప్షన్ గా నిలుస్తున్న కుర్ర హీరో సుహాస్ కు ఇటీవలే విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఆశించినంత పెద్ద ఫలితం ఇవ్వలేదు కానీ కమర్షియల్ గా నిర్మాతలు గట్టెక్కే వసూళ్లను తెచ్చింది. అంతకు ముందు రైటర్ పద్మభూషణ్ ద్వారా యూత్ తో పాటు ఫ్యామిలీస్ కు దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరస రిలీజులతో బిజీగా ఉన్న సుహాస్ త్వరలో ప్రసన్న వదనంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇవాళ రిలీజ్ చేసిన టీజర్ లో కాన్సెప్ట్ వైవిధ్యంగా అనిపించి అంచనాలు రేకెత్తించేలా ఉంది.
అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ వెరైటీ థ్రిల్లర్ లో ఫేస్ బ్లైండ్ నెస్ అనే పాయింట్ తీసుకున్నారు. అంటే అవతలి వాళ్ళ మొహాలు కనిపించలేని జబ్బు. చుట్టూ పరిసరాలు అన్నీ స్పష్టంగా ఉన్నా సరే ఎదురుగా ఉండే వ్యక్తులను పోల్చుకోలేడు. దీనికి లవ్, క్రైమ్ ని జోడించి డిఫరెంట్ గా ట్రై చేసినట్టున్నారు. నిజానికి సుహాస్ కు ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు చాలా అవసరం. రొటీన్ ఫార్ములా జోలికి వెళ్లే ఇమేజ్ తనకు లేదు. జనాలను థియేటర్లకు రప్పించాలంటే కంటెంట్ తప్ప వేరే ఆప్షన్ లేదు. పైగా గ్లామర్ తో మాస్ వర్గాలను ఆకట్టుకునే సబ్జెక్టులు చేయలేడు కాబట్టి ఇలాంటివే బెస్ట్.
పోటీ విపరీతంగా ఉన్న టైంలో క్రియేటివిటీని చూపించే ప్రయోగాలు మార్కెట్ ని పెంచుతాయి. అలా అని ఆడియన్స్ కి కనెక్ట్ కాలేని వాటిని తీసుకున్నా ఇబ్బందే. పారితోషికం పెంచుతున్నారటగా అని అడిగిన ప్రశ్నకు ఏం నేను బ్రతకొద్దా అంటూ నవ్వుతు సమాధానం ఇచ్చిన సుహాస్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన మూడు కోట్ల రెమ్యునరేషన్ ప్రచారాన్ని మాత్రం అంగీకరించలేదు. ఇకపై స్పీడ్ తగ్గిస్తానని, వేగంగా సినిమాలు చేయడం వల్ల క్వాలిటీ దెబ్బ తినే ప్రమాదముందని చెబుతున్నాడు. ఇదీ మంచిదే . ప్రసన్న వదనంతో పాటు గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
This post was last modified on March 7, 2024 2:59 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…