Movie News

కుర్రాళ్ళకు బాస్ సలహాలు అవసరం

మెగా కాంపౌండ్ హీరోలు డిజాస్టర్లతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఏకంగా కెరీర్లు ప్రమాదంలో పడి నిర్మాణంలో ఉన్న సినిమాల బడ్జెట్లు పునః సమీక్షించే దాకా తీసుకెళ్తున్నారు. వరుణ్ తేజ్ ఆల్రెడీ మూడు చేదు ఫలాలు తిన్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ మూడూ ఒకదాన్ని మరొకటి టపా కట్టేశాయి. బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న వైష్ణవ్ తేజ్ తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ రూపంలో తన టేస్ట్ ఎంత బ్యాడ్ అవుతోందో మళ్ళీ మళ్ళీ ఋజువు చేస్తున్నాడు. వీళిద్దరి మార్కెట్ రిస్క్ లో పడి కలిసే ముందు నిర్మాతలు ఆలోచించేలా చేసుకున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో మంచి విజయం నమోదు చేసుకున్నా గాంజా శంకర్ ఏవో కారణాల వల్ల ఆగిపోవడం ఊహించని పరిణామం. నిజంగా క్యాన్సిలయ్యిందా లేక పెండింగ్ లో ఉంచారా అనేది సితార మేకర్స్ చెప్పడం లేదు. ఇంకోవైపు అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ సిచువేషన్ ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. అల్లు అరవింద్ బ్యాకప్ ఉన్నా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఊర్వశివో రాక్షసివోకి డీసెంట్ టాక్ వచ్చినా ఫెయిల్యూరయ్యింది. టెడ్డి ఎప్పుడు పూర్తవుతుందో అంతు చిక్కడం లేదు. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు కథలతో వస్తున్నా ఏదీ కొలిక్కి రావడం లేదు.

రామ్ చరణ్ సైతం ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఆచార్య రూపంలో తండ్రితో కలిసి షాక్ తిన్నాడు. గేమ్ ఛేంజర్ మూడేళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇలా మెగా కుర్రాళ్లందరూ ఏదో రూపంలో బ్రేకులు వేసుకుంటూనే ఉన్నారు. మెగా లెగసికి పెద్దగా చిరంజీవి సలహాలు సూచనలు వీళ్లకు అవసరమయ్యేలా ఉంది. మాములుగా అయితే ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ దీని వల్ల కెరీర్లు దెబ్బ తింటున్నాయి.

This post was last modified on March 7, 2024 3:39 pm

Share
Show comments

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago