మెగా కాంపౌండ్ హీరోలు డిజాస్టర్లతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఏకంగా కెరీర్లు ప్రమాదంలో పడి నిర్మాణంలో ఉన్న సినిమాల బడ్జెట్లు పునః సమీక్షించే దాకా తీసుకెళ్తున్నారు. వరుణ్ తేజ్ ఆల్రెడీ మూడు చేదు ఫలాలు తిన్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ మూడూ ఒకదాన్ని మరొకటి టపా కట్టేశాయి. బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న వైష్ణవ్ తేజ్ తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ రూపంలో తన టేస్ట్ ఎంత బ్యాడ్ అవుతోందో మళ్ళీ మళ్ళీ ఋజువు చేస్తున్నాడు. వీళిద్దరి మార్కెట్ రిస్క్ లో పడి కలిసే ముందు నిర్మాతలు ఆలోచించేలా చేసుకున్నారు.
సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో మంచి విజయం నమోదు చేసుకున్నా గాంజా శంకర్ ఏవో కారణాల వల్ల ఆగిపోవడం ఊహించని పరిణామం. నిజంగా క్యాన్సిలయ్యిందా లేక పెండింగ్ లో ఉంచారా అనేది సితార మేకర్స్ చెప్పడం లేదు. ఇంకోవైపు అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ సిచువేషన్ ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. అల్లు అరవింద్ బ్యాకప్ ఉన్నా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఊర్వశివో రాక్షసివోకి డీసెంట్ టాక్ వచ్చినా ఫెయిల్యూరయ్యింది. టెడ్డి ఎప్పుడు పూర్తవుతుందో అంతు చిక్కడం లేదు. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు కథలతో వస్తున్నా ఏదీ కొలిక్కి రావడం లేదు.
రామ్ చరణ్ సైతం ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఆచార్య రూపంలో తండ్రితో కలిసి షాక్ తిన్నాడు. గేమ్ ఛేంజర్ మూడేళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇలా మెగా కుర్రాళ్లందరూ ఏదో రూపంలో బ్రేకులు వేసుకుంటూనే ఉన్నారు. మెగా లెగసికి పెద్దగా చిరంజీవి సలహాలు సూచనలు వీళ్లకు అవసరమయ్యేలా ఉంది. మాములుగా అయితే ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ దీని వల్ల కెరీర్లు దెబ్బ తింటున్నాయి.
This post was last modified on March 7, 2024 3:39 pm
థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…