సీనియర్ దర్శకులు కెఎస్ రవికుమార్ ఇటీవలే ఒక తమిళ ఈవెంట్ లో బాలకృష్ణ గురించి చేసిన కామెంట్లు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. సెట్లో ఉన్నప్పుడు బాలయ్య కోపం, విగ్గు గురించిన సంగతులు అందరి ముందు ప్రస్తావించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ముత్తు, నరసింహ, పంచతంత్రం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ గా ఆయనంటే అందరికీ గౌరవముంది. చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్ లాంటి అగ్ర హీరోలు పిలిచి మరీ ఛాన్సులిచ్చారు. ఒక్క స్నేహం కోసం మాత్రం హిట్ అనిపించుకోగా మిగిలినవి డిజాస్టర్లుగా నిలిచాయి.
2018 టైంలో కెఎస్ రవికుమార్ కెరీర్ పరంగా బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు బాలయ్యే జై సింహ ఒప్పుకున్నారు. సంక్రాంతికి భారీ పోటీ మధ్య విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించడంలో డైరెక్షన్ తో మాస్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషించాయి. ఆ నమ్మకమే సన్నిహితులు వద్దంటున్నా సరే మరుసటి ఏడాదే 2019లో రూలర్ ఆఫర్ ఇచ్చేలా చేసింది. తీరా చూస్తే అది ఎంత పెద్ద ఫ్లాపో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. తమిళ స్టార్ హీరోలే దూరం పెట్టిన టైంలో రవికుమార్ కి దర్శకత్వం మీద కాన్ఫిడెన్స్ చూపించింది బాలయ్య మాత్రమేనని ఫ్యాన్స్ కామెంట్. ఇది నిజమే.
మరి ఇదంతా మర్చిపోయి చాలా తేలికగా పక్క బాష అగ్ర హీరో మీద ఇలా అనడం ఖచ్చితంగా అభ్యంతరం చెప్పేదే. ఆ వీడియో క్లిప్ నిన్న సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. రవికుమార్ ప్రస్తుతం ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. అయిదేళ్ల నుంచి ఏ హీరో నుంచి పిలుపు రాలేదు. లారెన్స్ ఏదో కథకు ఓకే అన్నాడట కానీ అదింకా పట్టాలు ఎక్కలేదు. నిజంగా బాలయ్యకే కనక అంత కోపం ఉంటే ఫోన్ చేసి మరీ చెడామడా తిడతారుగా. అయినా ఇంత అనుభవమున్న సీనియర్ దర్శకులు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి కానీ మైకు ఉంది కదాని టంగ్ స్లిప్ అయితే లేనిపోని చెడ్డపేరు.
This post was last modified on March 7, 2024 12:34 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…