సీనియర్ దర్శకులు కెఎస్ రవికుమార్ ఇటీవలే ఒక తమిళ ఈవెంట్ లో బాలకృష్ణ గురించి చేసిన కామెంట్లు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. సెట్లో ఉన్నప్పుడు బాలయ్య కోపం, విగ్గు గురించిన సంగతులు అందరి ముందు ప్రస్తావించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ముత్తు, నరసింహ, పంచతంత్రం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ గా ఆయనంటే అందరికీ గౌరవముంది. చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్ లాంటి అగ్ర హీరోలు పిలిచి మరీ ఛాన్సులిచ్చారు. ఒక్క స్నేహం కోసం మాత్రం హిట్ అనిపించుకోగా మిగిలినవి డిజాస్టర్లుగా నిలిచాయి.
2018 టైంలో కెఎస్ రవికుమార్ కెరీర్ పరంగా బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు బాలయ్యే జై సింహ ఒప్పుకున్నారు. సంక్రాంతికి భారీ పోటీ మధ్య విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించడంలో డైరెక్షన్ తో మాస్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషించాయి. ఆ నమ్మకమే సన్నిహితులు వద్దంటున్నా సరే మరుసటి ఏడాదే 2019లో రూలర్ ఆఫర్ ఇచ్చేలా చేసింది. తీరా చూస్తే అది ఎంత పెద్ద ఫ్లాపో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. తమిళ స్టార్ హీరోలే దూరం పెట్టిన టైంలో రవికుమార్ కి దర్శకత్వం మీద కాన్ఫిడెన్స్ చూపించింది బాలయ్య మాత్రమేనని ఫ్యాన్స్ కామెంట్. ఇది నిజమే.
మరి ఇదంతా మర్చిపోయి చాలా తేలికగా పక్క బాష అగ్ర హీరో మీద ఇలా అనడం ఖచ్చితంగా అభ్యంతరం చెప్పేదే. ఆ వీడియో క్లిప్ నిన్న సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. రవికుమార్ ప్రస్తుతం ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. అయిదేళ్ల నుంచి ఏ హీరో నుంచి పిలుపు రాలేదు. లారెన్స్ ఏదో కథకు ఓకే అన్నాడట కానీ అదింకా పట్టాలు ఎక్కలేదు. నిజంగా బాలయ్యకే కనక అంత కోపం ఉంటే ఫోన్ చేసి మరీ చెడామడా తిడతారుగా. అయినా ఇంత అనుభవమున్న సీనియర్ దర్శకులు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి కానీ మైకు ఉంది కదాని టంగ్ స్లిప్ అయితే లేనిపోని చెడ్డపేరు.
This post was last modified on March 7, 2024 12:34 pm
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…