సీనియర్ దర్శకులు కెఎస్ రవికుమార్ ఇటీవలే ఒక తమిళ ఈవెంట్ లో బాలకృష్ణ గురించి చేసిన కామెంట్లు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. సెట్లో ఉన్నప్పుడు బాలయ్య కోపం, విగ్గు గురించిన సంగతులు అందరి ముందు ప్రస్తావించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ముత్తు, నరసింహ, పంచతంత్రం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ గా ఆయనంటే అందరికీ గౌరవముంది. చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్ లాంటి అగ్ర హీరోలు పిలిచి మరీ ఛాన్సులిచ్చారు. ఒక్క స్నేహం కోసం మాత్రం హిట్ అనిపించుకోగా మిగిలినవి డిజాస్టర్లుగా నిలిచాయి.
2018 టైంలో కెఎస్ రవికుమార్ కెరీర్ పరంగా బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు బాలయ్యే జై సింహ ఒప్పుకున్నారు. సంక్రాంతికి భారీ పోటీ మధ్య విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించడంలో డైరెక్షన్ తో మాస్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషించాయి. ఆ నమ్మకమే సన్నిహితులు వద్దంటున్నా సరే మరుసటి ఏడాదే 2019లో రూలర్ ఆఫర్ ఇచ్చేలా చేసింది. తీరా చూస్తే అది ఎంత పెద్ద ఫ్లాపో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. తమిళ స్టార్ హీరోలే దూరం పెట్టిన టైంలో రవికుమార్ కి దర్శకత్వం మీద కాన్ఫిడెన్స్ చూపించింది బాలయ్య మాత్రమేనని ఫ్యాన్స్ కామెంట్. ఇది నిజమే.
మరి ఇదంతా మర్చిపోయి చాలా తేలికగా పక్క బాష అగ్ర హీరో మీద ఇలా అనడం ఖచ్చితంగా అభ్యంతరం చెప్పేదే. ఆ వీడియో క్లిప్ నిన్న సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. రవికుమార్ ప్రస్తుతం ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. అయిదేళ్ల నుంచి ఏ హీరో నుంచి పిలుపు రాలేదు. లారెన్స్ ఏదో కథకు ఓకే అన్నాడట కానీ అదింకా పట్టాలు ఎక్కలేదు. నిజంగా బాలయ్యకే కనక అంత కోపం ఉంటే ఫోన్ చేసి మరీ చెడామడా తిడతారుగా. అయినా ఇంత అనుభవమున్న సీనియర్ దర్శకులు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి కానీ మైకు ఉంది కదాని టంగ్ స్లిప్ అయితే లేనిపోని చెడ్డపేరు.
This post was last modified on March 7, 2024 12:34 pm
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో…
ప్రస్తుతం పొదుపు మంత్రం పఠిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సహా బంగారం వంటివాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పరిధిలో…
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో…
ఇంకో రెండు రోజుల్లో రాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. మూడు నిమిషాల…
వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారా? ప్రస్తుతం ఇస్తున్న పథకాలను మరింత పెంచనున్నారా? అంటే…
లోక నాయకుడు కమల్ హాసన్ తమిళనాడు సీఎం, సహనటుడు విజయ్ ని కలిశారు. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ…