Movie News

తప్పు ఒప్పుకున్న ఐశ్వర్య

గత నెల విడుదలై ఆల్ టైం డిజాస్టర్స్ లో చోటు దక్కించుకున్న లాల్ సలామ్ విషయంలో అందరి వేళ్ళు దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ మీదకే వెళ్లాయి. సూపర్ స్టార్ తండ్రి ని చేతులారా వృథా చేసుకుందని విమర్శకులు విరుచుకు పడ్డారు. మొదటి రోజు మార్నింగ్ షోకే ఫలితం తేలిపోవడంతో ఆవిడ బయట కనిపించనే లేదు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తప్పు ఒప్పేసుకుంది. ముందు అనుకున్న కథ వేరని, మొయినుద్దీన్ పాత్రని పది నిమిషాలకు రాసుకుని కథను తయారు చేసుకుంటే రజనీకాంత్ ఒప్పుకున్నాక స్వరూపమే మారిపోయిందని అన్నారు.

ఐశ్యర్య చెప్పిన వెర్షన్ ఇలా ఉంది. లాల్ సలామ్ ఫస్ట్ వెర్షన్ లో ఇంటర్వెల్ తర్వాతే మొయినుద్దీన్ క్యారెక్టర్ ప్రవేశిస్తుంది. అప్పటిదాకా ఊళ్ళో పాత్రల ఎమోషన్లు, క్రికెట్ కు సంబంధించిన డ్రామా వగైరాలతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. అయితే లెన్త్ ఎక్కువైనా పర్వాలేదనే రీతిలో రజని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా స్క్రీన్ ప్లే మారిపోయింది. అవసరం లేకపోయినా తలైవర్ కి బిల్డప్ ఇంట్రో, ఫైట్ పెట్టాల్సి వచ్చింది. అదనంగా సీన్లు రాశారు. దీని వల్ల విక్రాంత్ స్పేస్ తగ్గిపోయి విష్ణు విశాల్ పాత్రకు సరైన తీరు తెన్నూ లేకుండా పోయాయి. ఇదంతా కన్ఫ్యూజన్ కి దారి తీసింది.

రిలీజ్ కు రెండు రోజుల ముందు వరకు ఎడిటింగ్ లో చోటు చేసుకున్న గందరగోళం వల్ల ఫైనల్ అవుట్ ఫుట్ ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే అవకాశం లేకపోయింది. క్రిటిక్స్ ఎంచిన లోపాలన్నీ సబబేనని అంగీకరించింది. ఏది ఏమైనా జరిగిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల లాభం లేదు కానీ మరోసారి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడేందుకు ఛాన్స్ ఉంటుంది. లాల్ సలాం ఒక్క ఐశ్వర్యకే కాదు లైకా సంస్థకు, రజనికి, ఆర్టిస్టులు అందరికీ పీడకలగా నిలిచిపోయింది. అన్నట్టు తలైవర్ తనయ సౌరవ్ గంగూలీ బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నారని చెన్నై టాక్.

This post was last modified on March 7, 2024 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ గడపలో టీడీపీ మహానాడు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…

1 hour ago

‘ఫామ్‌హౌస్ సోది మాకొద్దు.. ద‌మ్ముంటే అసెంబ్లీకి రా!’

తెలంగాణ‌లో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి స‌ర్కారుపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన…

3 hours ago

సాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది!

యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…

4 hours ago

మన త్రిష సత్తా చాటితే వరల్డ్ కప్ మనదే

అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…

5 hours ago

ఇంగ్లండ్‌పై భారత్ విజృంభణ.. సిరీస్‌ పట్టేసిన టీమ్ ఇండియా

భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో…

5 hours ago

మీ కోసం కాల్ చేసే గూగుల్.. ‘ఆస్క్ ఫర్ మీ’ AI ప్రయోగం!

రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…

6 hours ago