గత నెల విడుదలై ఆల్ టైం డిజాస్టర్స్ లో చోటు దక్కించుకున్న లాల్ సలామ్ విషయంలో అందరి వేళ్ళు దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ మీదకే వెళ్లాయి. సూపర్ స్టార్ తండ్రి ని చేతులారా వృథా చేసుకుందని విమర్శకులు విరుచుకు పడ్డారు. మొదటి రోజు మార్నింగ్ షోకే ఫలితం తేలిపోవడంతో ఆవిడ బయట కనిపించనే లేదు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తప్పు ఒప్పేసుకుంది. ముందు అనుకున్న కథ వేరని, మొయినుద్దీన్ పాత్రని పది నిమిషాలకు రాసుకుని కథను తయారు చేసుకుంటే రజనీకాంత్ ఒప్పుకున్నాక స్వరూపమే మారిపోయిందని అన్నారు.
ఐశ్యర్య చెప్పిన వెర్షన్ ఇలా ఉంది. లాల్ సలామ్ ఫస్ట్ వెర్షన్ లో ఇంటర్వెల్ తర్వాతే మొయినుద్దీన్ క్యారెక్టర్ ప్రవేశిస్తుంది. అప్పటిదాకా ఊళ్ళో పాత్రల ఎమోషన్లు, క్రికెట్ కు సంబంధించిన డ్రామా వగైరాలతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. అయితే లెన్త్ ఎక్కువైనా పర్వాలేదనే రీతిలో రజని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా స్క్రీన్ ప్లే మారిపోయింది. అవసరం లేకపోయినా తలైవర్ కి బిల్డప్ ఇంట్రో, ఫైట్ పెట్టాల్సి వచ్చింది. అదనంగా సీన్లు రాశారు. దీని వల్ల విక్రాంత్ స్పేస్ తగ్గిపోయి విష్ణు విశాల్ పాత్రకు సరైన తీరు తెన్నూ లేకుండా పోయాయి. ఇదంతా కన్ఫ్యూజన్ కి దారి తీసింది.
రిలీజ్ కు రెండు రోజుల ముందు వరకు ఎడిటింగ్ లో చోటు చేసుకున్న గందరగోళం వల్ల ఫైనల్ అవుట్ ఫుట్ ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే అవకాశం లేకపోయింది. క్రిటిక్స్ ఎంచిన లోపాలన్నీ సబబేనని అంగీకరించింది. ఏది ఏమైనా జరిగిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల లాభం లేదు కానీ మరోసారి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడేందుకు ఛాన్స్ ఉంటుంది. లాల్ సలాం ఒక్క ఐశ్వర్యకే కాదు లైకా సంస్థకు, రజనికి, ఆర్టిస్టులు అందరికీ పీడకలగా నిలిచిపోయింది. అన్నట్టు తలైవర్ తనయ సౌరవ్ గంగూలీ బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నారని చెన్నై టాక్.
This post was last modified on March 7, 2024 12:30 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…