ఆగస్ట్ 15 పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మైత్రి మూవీ మేకర్స్ క్రమం తప్పకుండ హింట్ వదులుతూనే ఉన్నారు. అధికారికంగా ప్రకటన గతంలోనే ఇచ్చినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా వాయిదా పడొచ్చేమోననే వార్తల నేపథ్యంలో ఇతర నిర్మాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీని మీద ఉన్న హైప్ కి కాంపిటీషన్ లో ఎవరు వచ్చినా ఇబ్బంది పడక తప్పదని బయ్యర్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. అయినా సరే అజయ్ దేవగన్ మల్టీస్టారర్ సింగం అగైన్ ని అదే డేట్ కి దింపాలనే లక్ష్యంతో దర్శకుడు రోహిత్ శెట్టి పని చేస్తున్నారు.
ఇంకోవైపు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఒక విదేశీ షెడ్యూల్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అది కూడా మే లోగా అయిపోతుంది. పాటలు అక్కడే ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు పూర్తయిన భాగానికి ఆల్రెడీ చేస్తున్నారు. దీన్ని ఆగస్ట్ 15 విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు చెన్నై టాక్. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు చేయబోయే రెండు సినిమాల్లో ఇదీ ఒకటి కావడం విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పైగా డ్యూయల్ రోల్ చేయడం ఫ్యాన్స్ ని ఎగ్జైట్ మెంట్ కి గురి చేస్తోంది.
ఈ లెక్కన పుష్ప 2కి సోలో రిలీజ్ దక్కడం అనుమానంగానే ఉంది. అయినా సరే క్రేజ్ పరంగా అల్లు అర్జున్ ని పైన ఇద్దరూ అందుకోవడం కష్టం. ఎందుకంటే అటు నార్త్ నుంచి ఇటు కేరళ దాకా బన్నీ ఫాలోయింగ్ తో పోటీ పడే స్థాయిలో అజయ్ దేవగన్, విజయ్ ఇద్దరూ లేరు. పైగా సుకుమార్ ఈసారి స్కేల్ భారీగా పెంచి మరీ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. మూడో భాగం ఉండొచ్చనే లీక్ ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. వేసవిలో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టడం ద్వారా పుష్ప 2ని ఇండియా వైడ్ ఆడియన్స్ కి చేరువ చేసేందుకు ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లాన్ సిద్ధమవుతోందని సమాచారం.
This post was last modified on March 7, 2024 6:15 am
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…