ఆగస్ట్ 15 పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మైత్రి మూవీ మేకర్స్ క్రమం తప్పకుండ హింట్ వదులుతూనే ఉన్నారు. అధికారికంగా ప్రకటన గతంలోనే ఇచ్చినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా వాయిదా పడొచ్చేమోననే వార్తల నేపథ్యంలో ఇతర నిర్మాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీని మీద ఉన్న హైప్ కి కాంపిటీషన్ లో ఎవరు వచ్చినా ఇబ్బంది పడక తప్పదని బయ్యర్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. అయినా సరే అజయ్ దేవగన్ మల్టీస్టారర్ సింగం అగైన్ ని అదే డేట్ కి దింపాలనే లక్ష్యంతో దర్శకుడు రోహిత్ శెట్టి పని చేస్తున్నారు.
ఇంకోవైపు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఒక విదేశీ షెడ్యూల్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అది కూడా మే లోగా అయిపోతుంది. పాటలు అక్కడే ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు పూర్తయిన భాగానికి ఆల్రెడీ చేస్తున్నారు. దీన్ని ఆగస్ట్ 15 విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు చెన్నై టాక్. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు చేయబోయే రెండు సినిమాల్లో ఇదీ ఒకటి కావడం విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పైగా డ్యూయల్ రోల్ చేయడం ఫ్యాన్స్ ని ఎగ్జైట్ మెంట్ కి గురి చేస్తోంది.
ఈ లెక్కన పుష్ప 2కి సోలో రిలీజ్ దక్కడం అనుమానంగానే ఉంది. అయినా సరే క్రేజ్ పరంగా అల్లు అర్జున్ ని పైన ఇద్దరూ అందుకోవడం కష్టం. ఎందుకంటే అటు నార్త్ నుంచి ఇటు కేరళ దాకా బన్నీ ఫాలోయింగ్ తో పోటీ పడే స్థాయిలో అజయ్ దేవగన్, విజయ్ ఇద్దరూ లేరు. పైగా సుకుమార్ ఈసారి స్కేల్ భారీగా పెంచి మరీ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. మూడో భాగం ఉండొచ్చనే లీక్ ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. వేసవిలో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టడం ద్వారా పుష్ప 2ని ఇండియా వైడ్ ఆడియన్స్ కి చేరువ చేసేందుకు ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లాన్ సిద్ధమవుతోందని సమాచారం.
This post was last modified on March 7, 2024 6:15 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…