ఒక కథను రెండు మూడు భాగాలుగా చెప్పే ట్రెండు ఇండియన్ సినిమాలో గట్టిగానే నడుస్తోందిప్పుడు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప.. ఇలా ఈ వరుసలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇందులో బాహుబలి కథ రెండు భాగాలకే ముగిసినా.. ఇంకో పార్ట్ గురించి పెద్ద చర్చ నడిచింది. కానీ తర్వాత ఆ ప్రచారానికి తెరపడింది. కేజీఎఫ్ కథ రెండు భాగాలతో ముగిసినట్లు కనిపించినా.. మూడో చాప్టర్ గురించి కూడా సంకేతాలు వచ్చాయి. భవిష్యత్తులో మూడో భాగం వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
ఇప్పుడు రెండో భాగంతో ముస్తాబవుతున్న పుష్ప సినిమాకు మూడో భాగం ఉంటుందనే ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని గురించి చాన్నాళ్ల ముందే వార్తలు మొదలయ్యాయి. ఈ మధ్యే అల్లు అర్జున్ సైతం పుష్ప-3 గురించి ప్రస్తావించాడు. ఇంకో భాగం ఉండొచ్చన్నాడు.
ఐతే ఈ మాట పట్టుకుని కొందరు ఇష్టం వచ్చినట్లు వార్తలు అల్లేస్తున్నారు. పుష్ప-3కి కథ రెడీ అయిపోయిందని.. ఆల్రెడీ మూడో పార్ట్ కోసం కొన్ని సీన్లు కూడా తీశారని.. 2025 వేసవిలో పుష్ప-3 రలీజ్ ఉంటుందని.. ఇలా ప్రచారం చేసేస్తున్నారు. ఐతే ఈ వార్తలు చూసి పుష్ప టీం సభ్యులు నవ్వుకుంటున్నారట. పుష్ప-2నే అనుకున్న టైంకి రావట్లేదు. వాయిదాల మీద వాయిదాలు పడి.. చివరికి ఈ ఆగస్టు 15కు షెడ్యూల్ అయింది. కానీ అప్పుడైనా సినిమా వస్తుందా రాదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. షూటింగ్ షెడ్యూళ్లు ఆలస్యం అవుతున్నాయి. అనుకున్న ప్రకారం షూట్ పూర్తి చేసి ఆగస్టు 15న రిలీజ్ చేయడమే సవాలుగా మారింది.
సుక్కు తన మార్కు పర్ఫెక్షనిజంతో యూనిట్ సభ్యులకు, నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నాడట. పుష్ప-2 సంగతే ఇలా ఉంటే.. అప్పుడే పుష్ప-3 పనులు మొదలుపెట్టి, రిలీజ్ ప్లాన్ చేయడం అంటే టీం సభ్యులకు నవ్వు రాకుండా ఎలా ఉంటుంది?
This post was last modified on March 6, 2024 3:50 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…