ఒక కథను రెండు మూడు భాగాలుగా చెప్పే ట్రెండు ఇండియన్ సినిమాలో గట్టిగానే నడుస్తోందిప్పుడు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప.. ఇలా ఈ వరుసలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇందులో బాహుబలి కథ రెండు భాగాలకే ముగిసినా.. ఇంకో పార్ట్ గురించి పెద్ద చర్చ నడిచింది. కానీ తర్వాత ఆ ప్రచారానికి తెరపడింది. కేజీఎఫ్ కథ రెండు భాగాలతో ముగిసినట్లు కనిపించినా.. మూడో చాప్టర్ గురించి కూడా సంకేతాలు వచ్చాయి. భవిష్యత్తులో మూడో భాగం వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
ఇప్పుడు రెండో భాగంతో ముస్తాబవుతున్న పుష్ప సినిమాకు మూడో భాగం ఉంటుందనే ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని గురించి చాన్నాళ్ల ముందే వార్తలు మొదలయ్యాయి. ఈ మధ్యే అల్లు అర్జున్ సైతం పుష్ప-3 గురించి ప్రస్తావించాడు. ఇంకో భాగం ఉండొచ్చన్నాడు.
ఐతే ఈ మాట పట్టుకుని కొందరు ఇష్టం వచ్చినట్లు వార్తలు అల్లేస్తున్నారు. పుష్ప-3కి కథ రెడీ అయిపోయిందని.. ఆల్రెడీ మూడో పార్ట్ కోసం కొన్ని సీన్లు కూడా తీశారని.. 2025 వేసవిలో పుష్ప-3 రలీజ్ ఉంటుందని.. ఇలా ప్రచారం చేసేస్తున్నారు. ఐతే ఈ వార్తలు చూసి పుష్ప టీం సభ్యులు నవ్వుకుంటున్నారట. పుష్ప-2నే అనుకున్న టైంకి రావట్లేదు. వాయిదాల మీద వాయిదాలు పడి.. చివరికి ఈ ఆగస్టు 15కు షెడ్యూల్ అయింది. కానీ అప్పుడైనా సినిమా వస్తుందా రాదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. షూటింగ్ షెడ్యూళ్లు ఆలస్యం అవుతున్నాయి. అనుకున్న ప్రకారం షూట్ పూర్తి చేసి ఆగస్టు 15న రిలీజ్ చేయడమే సవాలుగా మారింది.
సుక్కు తన మార్కు పర్ఫెక్షనిజంతో యూనిట్ సభ్యులకు, నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నాడట. పుష్ప-2 సంగతే ఇలా ఉంటే.. అప్పుడే పుష్ప-3 పనులు మొదలుపెట్టి, రిలీజ్ ప్లాన్ చేయడం అంటే టీం సభ్యులకు నవ్వు రాకుండా ఎలా ఉంటుంది?
This post was last modified on March 6, 2024 3:50 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…