నందమూరి బాలకృష్ణకు బయట ఎక్కడైనా కోపం వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అభిమానుల మధ్యకు వచ్చినపుడు.. షూటింగ్ స్పాట్లో ఆయనకు ఎవరైనా కోపం తెప్పిస్తే ముందు వెనుక ఆలోచించకుండా చేయి చేసుకుంటారు. దీనికి సంబంధించి చాలా వీడియోలో సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.
గతంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై సింహా’ చిత్రీకరణ సందర్భంగా ఒక అసిస్టెంట్ మీద బాలయ్య చేయి చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు కేఎస్ రవికుమార్ చెన్నైలో జరిగిన ఒక వేడుకలో బాలయ్య కోపం గురించి మాట్లాడారు.
తన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవ్వరైనా నవ్వితే చాలు బాలయ్యకు కోపం వచ్చేస్తుందని.. కొట్టేస్తాడని రవికుమార్ చెప్పడం గమనార్హం. బాలయ్యతో రవికుమార్ ‘జైసింహా’తో పాటు ‘రూలర్’ అనే ఇంకో సినిమా కూడా చేశాడు. అప్పటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘షూటింగ్లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే ఆయన ఊరుకోడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరీ కొడతాడు. ఓ సినిమా షూటింగ్ టైంలో నా అసిస్టెంట్ శరవణన్ను ఫ్యాన్ తీసుకురావాలని ఆయన చెప్పాడు. అతను అనుకోకుండా ఫ్యాన్ బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది.
దీంతో శరవణన్ కొంచెం నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు. ఆయన కోపం గురించి నాకు తెలిసిందే కాబట్టి ఎక్కడ శరవణన్ను కొట్టేస్తాడో అనిపించి.. అతను మన అసిస్టెంటే అని చెప్పాను. అయినా ఆయన కూల్ అవ్వలేదు. నేను వెంటనే శరవణన్ను గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోమన్నాను. అప్పుడు బాలకృష్ణ కొంచెం స్థిమితపడ్డాడు’’ అని రవికుమార్ ఆ ఉదంతం గురించి గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on March 6, 2024 3:44 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…