నందమూరి బాలకృష్ణకు బయట ఎక్కడైనా కోపం వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అభిమానుల మధ్యకు వచ్చినపుడు.. షూటింగ్ స్పాట్లో ఆయనకు ఎవరైనా కోపం తెప్పిస్తే ముందు వెనుక ఆలోచించకుండా చేయి చేసుకుంటారు. దీనికి సంబంధించి చాలా వీడియోలో సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.
గతంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై సింహా’ చిత్రీకరణ సందర్భంగా ఒక అసిస్టెంట్ మీద బాలయ్య చేయి చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు కేఎస్ రవికుమార్ చెన్నైలో జరిగిన ఒక వేడుకలో బాలయ్య కోపం గురించి మాట్లాడారు.
తన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవ్వరైనా నవ్వితే చాలు బాలయ్యకు కోపం వచ్చేస్తుందని.. కొట్టేస్తాడని రవికుమార్ చెప్పడం గమనార్హం. బాలయ్యతో రవికుమార్ ‘జైసింహా’తో పాటు ‘రూలర్’ అనే ఇంకో సినిమా కూడా చేశాడు. అప్పటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘షూటింగ్లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే ఆయన ఊరుకోడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరీ కొడతాడు. ఓ సినిమా షూటింగ్ టైంలో నా అసిస్టెంట్ శరవణన్ను ఫ్యాన్ తీసుకురావాలని ఆయన చెప్పాడు. అతను అనుకోకుండా ఫ్యాన్ బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది.
దీంతో శరవణన్ కొంచెం నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు. ఆయన కోపం గురించి నాకు తెలిసిందే కాబట్టి ఎక్కడ శరవణన్ను కొట్టేస్తాడో అనిపించి.. అతను మన అసిస్టెంటే అని చెప్పాను. అయినా ఆయన కూల్ అవ్వలేదు. నేను వెంటనే శరవణన్ను గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోమన్నాను. అప్పుడు బాలకృష్ణ కొంచెం స్థిమితపడ్డాడు’’ అని రవికుమార్ ఆ ఉదంతం గురించి గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on March 6, 2024 3:44 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…