నందమూరి బాలకృష్ణకు బయట ఎక్కడైనా కోపం వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అభిమానుల మధ్యకు వచ్చినపుడు.. షూటింగ్ స్పాట్లో ఆయనకు ఎవరైనా కోపం తెప్పిస్తే ముందు వెనుక ఆలోచించకుండా చేయి చేసుకుంటారు. దీనికి సంబంధించి చాలా వీడియోలో సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.
గతంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై సింహా’ చిత్రీకరణ సందర్భంగా ఒక అసిస్టెంట్ మీద బాలయ్య చేయి చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు కేఎస్ రవికుమార్ చెన్నైలో జరిగిన ఒక వేడుకలో బాలయ్య కోపం గురించి మాట్లాడారు.
తన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవ్వరైనా నవ్వితే చాలు బాలయ్యకు కోపం వచ్చేస్తుందని.. కొట్టేస్తాడని రవికుమార్ చెప్పడం గమనార్హం. బాలయ్యతో రవికుమార్ ‘జైసింహా’తో పాటు ‘రూలర్’ అనే ఇంకో సినిమా కూడా చేశాడు. అప్పటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘షూటింగ్లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే ఆయన ఊరుకోడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరీ కొడతాడు. ఓ సినిమా షూటింగ్ టైంలో నా అసిస్టెంట్ శరవణన్ను ఫ్యాన్ తీసుకురావాలని ఆయన చెప్పాడు. అతను అనుకోకుండా ఫ్యాన్ బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది.
దీంతో శరవణన్ కొంచెం నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు. ఆయన కోపం గురించి నాకు తెలిసిందే కాబట్టి ఎక్కడ శరవణన్ను కొట్టేస్తాడో అనిపించి.. అతను మన అసిస్టెంటే అని చెప్పాను. అయినా ఆయన కూల్ అవ్వలేదు. నేను వెంటనే శరవణన్ను గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోమన్నాను. అప్పుడు బాలకృష్ణ కొంచెం స్థిమితపడ్డాడు’’ అని రవికుమార్ ఆ ఉదంతం గురించి గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on March 6, 2024 3:44 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…