తెలుగు నాట మరే కన్నడ నటుడికీ లేని ఫాలోయింగ్ ఉపేంద్రకు ఉంది. 2000వ సంవత్సరానికి అటు ఇటు తెలుగులో విడుదలైన అతడి సినిమాలు సంచలనం రేపాయి. ఉపేంద్ర, రా లాంటి చిత్రాలు అతడికి మాంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఇక్కడ అతణ్ని ఒక స్టార్ లాగా చూశారు. ఈ ఊపులో నేరుగా తెలుగులో కొన్ని సినిమాలు కూడా చేశాడు ఉప్పి. చాలా గ్యాప్ తర్వాత అతను స్వీయ దర్శకత్వంలో నటించిన ‘సూపర్’ సినిమా కూడా ఇక్కడ బాగానే ఆడింది.
ఐతే నటుడిగా మాత్రం తెలుగులో చాన్నాళ్లు కనిపించని ఉపేంద్ర.. ఆ మధ్య అల్లు అర్జున్-త్రివిక్రమ్ల ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో నెగెటివ్ టచ్ ఉన్న కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఉపేంద్ర మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఐతే యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఉప్పి ఓ కీలక పాత్ర చేయనున్నట్లు ఇంతకుముందు ఊహాగానాలు వినిపించాయి.
ఈ విషయంపై ఉపేంద్ర స్పందించాడు. తాను వరుణ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత తెలుగులో నటించకపోవడానికి అందరూ విలన్ పాత్రలే ఆఫర్ చేయడమే కారణమన్నాడు. అలాంటి పాత్రలు తాను చేయాలా అని ఆలోచనలో పడ్డానన్నాడు. సరైన స్క్రిప్టు, పాత్ర కోసం ఎదురు చూస్తున్ తనకు వరుణ్ సినిమాలో క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నట్లు చెప్పాడు.
ఉప్పి మాటల్ని బట్టి చూస్తే అది విలన్ రోల్ కాదని అర్థమవుతోంది. ఇదిలా ఉండగా.. ఉపేంద్ర హీరోగా ‘కబ్జా’ పేరుతో ప్రస్తుతం ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఇంతకుముందు అతడితో రెండు సినిమాలు తీసిన చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ, తెలుగుతో పాటు ఏడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. ఇటీవలే రిలీజ్ చేసిన ‘కబ్జా’ ఫస్ట్ లుక్లో ఉపేంద్ర సూపర్ స్టైలిష్గా కనిపించాడు.
This post was last modified on April 27, 2020 10:13 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…