టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్ ఒక సినిమాలో భాగం కావడం, కాకపోవడం గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ‘బేబి’ సినిమా కోసం అడిగితే దర్శకుడు సాయి రాజేష్తో అతను వ్యవహరించిన తీరు గురించి ఆ సినిమా రిలీజ్ టైంలో పెద్ద చర్చ జరిగింది. ఇక అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పి.. షూట్ మొదలయ్యాక దాన్నుంచి వైదొలగడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు విశ్వక్ మరో సినిమా నుంచి తప్పుకోవడం గురించి సోషల్ మీడియాలో చిన్న డిస్కషన్ నడుస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర కోసం విశ్వక్సేన్ పేరును పరిశీలించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఐతే తనను ఆ పాత్ర కోసం సంప్రదించిన మాట వాస్తవమే అని.. కానీ తాను ఆ పాత్ర చేయనని చెప్పానని విశ్వక్ తెలిపాడు.
బాలయ్య మీద విశ్వక్సేన్కు బాగానే అభిమానం ఉంది. వీళ్లిద్దరూ కలిసి కొన్ని వేడుకల్లో కనిపించారు కూడా. ఐతే బాలయ్య సినిమాలో తాను చేస్తే బాగా ప్రాధాన్యమున్న, ప్రత్యేకమైన పాత్రే చేయాలని అనుకున్నానని.. ఐతే తనకు ఆఫర్ చేసింది ఆ స్థాయి పాత్ర కాదు అనిపించడంతో బాబీ సినిమాలో చేయలేకపోయానని విశ్వక్ తెలిపాడు.
భవిష్యత్తులో బాలయ్యతో కలిసి నటిస్తానని అతను ఈ సందర్భంగా చెప్పాడు. విశ్వక్ హీరోగా నటించిన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘గామి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇది విశ్వక్ కెరీర్ ఆరంభంలో మొదలుపెట్టిన సినిమా. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ‘గామి’ టీం ఈ సినిమాను పూర్తి చేసింది. ఏకంగా ఆరేళ్లు ప్రొడక్షన్లో ఉన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. విద్యాధర్ కాగిత రూపొందించిన ఈ చిత్రం క్రౌడ్ ఫండింగ్తో తెరకెక్కగా.. చివర్లో యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రానికి అండగా నిలిచి రిలీజ్ చేస్తోంది.
This post was last modified on March 6, 2024 2:33 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…