Movie News

ఆ సినిమా ఓటీటీలోకి.. ట్రోలర్స్ రెడీనా?

నందమూరి కుటుంబం నుంచి చాలా ఏళ్ల కిందటే చైతన్యకృష్ణ ఓ వారసుడు వచ్చిన విషయం అందరూ మరిచిపోయిన సమయంలో ఈ మధ్యే అతను హీరోగా ‘బ్రీత్’ అనే సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్ తనయుల్లో ఒకరైన జయకృష్ణ కొడుకే ఈ చైతన్య కృష్ణ. అతను 2003లో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘ధమ్’ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ రోల్ చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చైతన్యకృష్ణ జనాల దృష్టిలో పడలేదు.

ఐతే ‘ధమ్’ తర్వాత సినిమాల్లో కనిపించని చైతన్య.. గత ఏడాది ‘బ్రీత్’ సినిమాలో నటించాడు. దానికి నిర్మాత అతడి తండ్రే. వంశీకృష్ణ ఆకెళ్ల రూపొందించిన ఈ చిత్రం విడుదలైన సంగతి కూడా జనాలకు తెలియలేదు. ఐతే ఈ సినిమా సౌండ్ చేయకపోయినా.. దీని ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో, వేరే వేదికల్లో చైతన్యకృష్ణ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ట్రోలర్లకు కావాల్సిన సరంజామా అతను బాగానే ఇచ్చాడు.

దీంతో సోషల్ మీడియాలో చైతన్యకృష్ణ మీద ట్రోల్ పేజీలు పెట్టి మరీ అతణ్ని ఆటాడుకుంటున్నారు జనాలు. ఎవరికీ పట్టని ‘ధమ్’ సినిమాలో చైతన్యకృష్ణ ఎక్స్‌ప్రెషన్లు, డైలాగులు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు పట్టుకొచ్చి అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక బ్రీత్ సినిమాకు ప్రమోషనల్ వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు.

ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన దగ్గర్నుంచి ఓటీటీ రిలీజ్ కోసం ట్రోలర్స్ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వారి పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మార్చి 8న ఆహా ఓటీటీలో ‘బ్రీత్’ స్ట్రీమ్ కానుంది. దీంతో ట్రోలర్స్ ఆల్రెడీ సంబరాలు మొదలుపెట్టేశారు. బ్రీత్ డిజిటల్ రిలీజ్ తర్వాత మరింతగా చైతన్యను ట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఐతే చైతన్య కూడా ఇలాంటి ట్రోలింగ్‌కు బాగా అలవాటు పడిపోయినట్లున్నాడు. ట్రోలింగ్ గురించి అతను చాలా స్పోర్టివ్‌గానే మాట్లాడాడు కొన్ని ఇంటర్వ్యూల్లో.

This post was last modified on March 5, 2024 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago