నందమూరి కుటుంబం నుంచి చాలా ఏళ్ల కిందటే చైతన్యకృష్ణ ఓ వారసుడు వచ్చిన విషయం అందరూ మరిచిపోయిన సమయంలో ఈ మధ్యే అతను హీరోగా ‘బ్రీత్’ అనే సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్ తనయుల్లో ఒకరైన జయకృష్ణ కొడుకే ఈ చైతన్య కృష్ణ. అతను 2003లో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘ధమ్’ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ రోల్ చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చైతన్యకృష్ణ జనాల దృష్టిలో పడలేదు.
ఐతే ‘ధమ్’ తర్వాత సినిమాల్లో కనిపించని చైతన్య.. గత ఏడాది ‘బ్రీత్’ సినిమాలో నటించాడు. దానికి నిర్మాత అతడి తండ్రే. వంశీకృష్ణ ఆకెళ్ల రూపొందించిన ఈ చిత్రం విడుదలైన సంగతి కూడా జనాలకు తెలియలేదు. ఐతే ఈ సినిమా సౌండ్ చేయకపోయినా.. దీని ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో, వేరే వేదికల్లో చైతన్యకృష్ణ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ట్రోలర్లకు కావాల్సిన సరంజామా అతను బాగానే ఇచ్చాడు.
దీంతో సోషల్ మీడియాలో చైతన్యకృష్ణ మీద ట్రోల్ పేజీలు పెట్టి మరీ అతణ్ని ఆటాడుకుంటున్నారు జనాలు. ఎవరికీ పట్టని ‘ధమ్’ సినిమాలో చైతన్యకృష్ణ ఎక్స్ప్రెషన్లు, డైలాగులు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు పట్టుకొచ్చి అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక బ్రీత్ సినిమాకు ప్రమోషనల్ వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు.
ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన దగ్గర్నుంచి ఓటీటీ రిలీజ్ కోసం ట్రోలర్స్ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వారి పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మార్చి 8న ఆహా ఓటీటీలో ‘బ్రీత్’ స్ట్రీమ్ కానుంది. దీంతో ట్రోలర్స్ ఆల్రెడీ సంబరాలు మొదలుపెట్టేశారు. బ్రీత్ డిజిటల్ రిలీజ్ తర్వాత మరింతగా చైతన్యను ట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఐతే చైతన్య కూడా ఇలాంటి ట్రోలింగ్కు బాగా అలవాటు పడిపోయినట్లున్నాడు. ట్రోలింగ్ గురించి అతను చాలా స్పోర్టివ్గానే మాట్లాడాడు కొన్ని ఇంటర్వ్యూల్లో.
This post was last modified on March 5, 2024 2:28 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…