మంజుమ్మెల్ బాయ్స్.. ఇప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చిత్రం. ఇందులో ఒకరిద్దరు మినహా పేరున్న ఆర్టిస్టులు లేరు. దర్శకుడికి ఇది రెండో చిత్రం మాత్రమే. పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మామూలు సంచలనం రేపట్లేదు. గత నెల 22న విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్.. రిలీజై రెండు వారాలు కావస్తున్నా హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది.
కేరళలో ప్రతి థియేటర్లో ప్రతి షోకూ హౌస్ ఫుల్ బోర్డు పడిపోతోంది. వరల్డ్ వైడ్ సినిమా ఆడుతున్న ప్రతి చోటా మంచి వసూళ్లు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో సైతం ఆడుతున్న షోలన్నీ మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తున్నాయి. తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇప్పటికే అక్కడ పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘లాల్ సలాం’ గత నెలలో విడుదలై తమిళనాట 18 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా.. దాన్ని ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే చిన్న సినిమా దాటేయబోతోందని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. విదేశాల్లో ఈ చిత్రం రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.80 కోట్లకు చేరువగా ఉన్నాయి. వంద కోట్ల మార్కును అందుకోవడం లాంఛనమే. ఈ సినిమా స్థాయికి ఈ వసూళ్లు అనూహ్యం.
ఇది తమిళనాట జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడం విశేషం. కొన్నేళ్ల కిందట కేరళ నుంచి కొందరు యువకుల బృందం.. కోడైకెనాల్ ట్రిప్ వేసింది. అప్పుడు ఆ గ్రూప్లోని ఒకరు గుహలో చిక్కుకుపోయాడు. అతణ్ని అక్కడి నుంచి బయటికి తేవడానికి మిత్ర బృందం ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సినిమాను తీర్చిదిద్దడంతో ప్రేక్షకులకు మాంచి థ్రిల్ ఇస్తోంది. మంజుమ్మెల్ బాయ్స్ను తెలుగులో కూడా త్వరలోనే విడుదల చేయాలని చూస్తున్నారు.
This post was last modified on March 4, 2024 5:46 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…