మంజుమ్మెల్ బాయ్స్.. ఇప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చిత్రం. ఇందులో ఒకరిద్దరు మినహా పేరున్న ఆర్టిస్టులు లేరు. దర్శకుడికి ఇది రెండో చిత్రం మాత్రమే. పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మామూలు సంచలనం రేపట్లేదు. గత నెల 22న విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్.. రిలీజై రెండు వారాలు కావస్తున్నా హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది.
కేరళలో ప్రతి థియేటర్లో ప్రతి షోకూ హౌస్ ఫుల్ బోర్డు పడిపోతోంది. వరల్డ్ వైడ్ సినిమా ఆడుతున్న ప్రతి చోటా మంచి వసూళ్లు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో సైతం ఆడుతున్న షోలన్నీ మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తున్నాయి. తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇప్పటికే అక్కడ పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘లాల్ సలాం’ గత నెలలో విడుదలై తమిళనాట 18 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా.. దాన్ని ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే చిన్న సినిమా దాటేయబోతోందని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. విదేశాల్లో ఈ చిత్రం రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.80 కోట్లకు చేరువగా ఉన్నాయి. వంద కోట్ల మార్కును అందుకోవడం లాంఛనమే. ఈ సినిమా స్థాయికి ఈ వసూళ్లు అనూహ్యం.
ఇది తమిళనాట జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడం విశేషం. కొన్నేళ్ల కిందట కేరళ నుంచి కొందరు యువకుల బృందం.. కోడైకెనాల్ ట్రిప్ వేసింది. అప్పుడు ఆ గ్రూప్లోని ఒకరు గుహలో చిక్కుకుపోయాడు. అతణ్ని అక్కడి నుంచి బయటికి తేవడానికి మిత్ర బృందం ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సినిమాను తీర్చిదిద్దడంతో ప్రేక్షకులకు మాంచి థ్రిల్ ఇస్తోంది. మంజుమ్మెల్ బాయ్స్ను తెలుగులో కూడా త్వరలోనే విడుదల చేయాలని చూస్తున్నారు.
This post was last modified on March 4, 2024 5:46 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…