సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ వాంటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ విడుదలకు కేవలం 25 రోజులే ఉంది. మార్చి 29 థియేటర్లలో అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు గత నెలే ట్రైలర్ లాంచ్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ షో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. అయితే రిలీజ్ ఇంత దగ్గరగా ఉన్నా ప్రమోషన్లలో ఇంకా వేగం కనిపించడం లేదు. మాములుగా సితార సంస్థ నుంచి వచ్చే సినిమాలు పెద్దవైనా చిన్నవైనా పబ్లిసిటీ పరంగా కనీసం నాలుగైదు వారల ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటారు.
కానీ టిల్లు స్క్వేర్ విషయంలో అంత దూకుడు కనిపించడం లేదు. కారణం ఏంటయ్యాని ఆరా తీస్తే కీలకమైన పనులు కొన్ని పెండింగ్ ఉండిపోవడంతో వాటిని ఆఘమేఘాల మీద పూర్తి చేసే పనిలో దర్శకుడు మల్లిక్ రామ్ బృందం బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారట. షూటింగ్ కు సంబంధించిన చిన్న ప్యాచ్ వర్క్ సైతం ఈ వారంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారట. ఈ సినిమా కోసమే తెలుసు కదా, జాక్ నుంచి బ్రేక్ తీసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఏప్రిల్ మొదటి వారం దాకా దీని ప్రమోషన్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రంగంలో దిగడమే ఆలస్యం.
పోటీ పరంగా టిల్లు స్క్వేర్ కు బాక్సాఫీస్ వద్ద కొన్ని రిస్కులున్నాయి. వాటిలో మొదటిది అదే రోజు హాలీవుడ్ క్రేజీ మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ భారీ ఎత్తున రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. పిల్లలు, యూత్ లో దీని మీద మాములు హైప్ లేదు. వారం తిరక్కుండానే విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ ని నిర్మాత దిల్ రాజు గారు పెద్ద రేంజ్ లో దించేస్తారు. వీటిని కాచుకోవడం సిద్దుకి సవాలే. మళ్ళీ వాయిదా లాంటి షాక్ ఇవ్వరు కదానే అనుమానం ఫ్యాన్స్ లో తలెత్తుతోంది కానీ సితార టీమ్ మాత్రం అదేమీ లేదు చెప్పిన ప్రకారమే వస్తామని హామీ ఇస్తోంది. చూద్దాం.
This post was last modified on March 4, 2024 3:21 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…