ఆపరేషన్ వాలెంటైన్ తో పాటు నిన్న విడుదలైన సినిమాల్లో బజ్ తక్కువగా ఉన్నా కాసింత ఆసక్తి రేపిన వాటిలో భూతద్దం భాస్కర్ నారాయణ ఒకటి. హీరోగా సెటిలయ్యేందుకు కష్టపడుతున్న శివ కందుకూరి కథానాయకుడిగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. అనూహ్యంగా దీనికే కొంత డీసెంట్ టాక్ వినిపించడం గమనార్హం. ముందు రోజు రాత్రి హైదరాబాద్ లో వేసిన ప్రీమియర్లతో పాటు రిలీజ్ రోజు మెల్లగా పెరుగుతున్న ఆక్యుపెన్సీలు చిన్నగా ఆశలు పెంచుతున్నాయి. ఇంతకీ భాస్కర్ ఏం చేశాడో చూద్దాం.
ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామంలో దిష్టిబొమ్మ హత్యలు అంతు చిక్కని మిస్టరీగా మారతాయి . 18 ఏళ్లలో పదిహేను స్త్రీలను చంపేసినా హంతకుడు ఎవరో కనుక్కోలేక పోలీసులు సతమతమవుతూ ఉంటారు. అప్పుడు రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఎలాగైనా గొప్ప పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్న ఈ సరదా గూఢచారి మెల్లగా కూపీలు లాగుతూ అవి మర్డర్లు కాదని, నరబలులని గుర్తిస్తాడు. అయితే చేసిందెవరో అర్థం కాదు. చివరికి ఇలాంటి సస్పెన్స్ డ్రామాల్లోలాగే ఇక్కడా ఎవరూ ఊహించని వ్యక్తి విలన్ గా తేలతాడు.
క్రైమ్ కథలు మనకు కొత్త కాకపోయినా మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్ తీసుకున్న పురుషోత్తం రాజ్ దాన్ని కాస్త విభిన్నంగా అందించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయాలు, హత్యల నేపధ్యం ఇలా ఏదోలా టైం పాస్ చేయించి అసలు ట్విస్టులు సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు. మధ్యలో అవసరం లేని ఉపకథలు, డ్రామాలు వచ్చి ఇబ్బంది పెడతాయి. విలన్ ని రివీల్ చేసే విధానం, దానికి ఎంచుకున్న ఆర్టిస్టు చిన్న షాకే. బిగిసడలని కథనం అవసరమైన ఇలాంటి సినిమాలో అది పూర్తి స్థాయిలో లేకపోవడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. వీకెండ్ లో ఏదోకటి చూడాల్సిందే అంటేనే ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on March 2, 2024 7:18 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…