ఆపరేషన్ వాలెంటైన్ తో పాటు నిన్న విడుదలైన సినిమాల్లో బజ్ తక్కువగా ఉన్నా కాసింత ఆసక్తి రేపిన వాటిలో భూతద్దం భాస్కర్ నారాయణ ఒకటి. హీరోగా సెటిలయ్యేందుకు కష్టపడుతున్న శివ కందుకూరి కథానాయకుడిగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. అనూహ్యంగా దీనికే కొంత డీసెంట్ టాక్ వినిపించడం గమనార్హం. ముందు రోజు రాత్రి హైదరాబాద్ లో వేసిన ప్రీమియర్లతో పాటు రిలీజ్ రోజు మెల్లగా పెరుగుతున్న ఆక్యుపెన్సీలు చిన్నగా ఆశలు పెంచుతున్నాయి. ఇంతకీ భాస్కర్ ఏం చేశాడో చూద్దాం.
ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామంలో దిష్టిబొమ్మ హత్యలు అంతు చిక్కని మిస్టరీగా మారతాయి . 18 ఏళ్లలో పదిహేను స్త్రీలను చంపేసినా హంతకుడు ఎవరో కనుక్కోలేక పోలీసులు సతమతమవుతూ ఉంటారు. అప్పుడు రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఎలాగైనా గొప్ప పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్న ఈ సరదా గూఢచారి మెల్లగా కూపీలు లాగుతూ అవి మర్డర్లు కాదని, నరబలులని గుర్తిస్తాడు. అయితే చేసిందెవరో అర్థం కాదు. చివరికి ఇలాంటి సస్పెన్స్ డ్రామాల్లోలాగే ఇక్కడా ఎవరూ ఊహించని వ్యక్తి విలన్ గా తేలతాడు.
క్రైమ్ కథలు మనకు కొత్త కాకపోయినా మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్ తీసుకున్న పురుషోత్తం రాజ్ దాన్ని కాస్త విభిన్నంగా అందించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయాలు, హత్యల నేపధ్యం ఇలా ఏదోలా టైం పాస్ చేయించి అసలు ట్విస్టులు సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు. మధ్యలో అవసరం లేని ఉపకథలు, డ్రామాలు వచ్చి ఇబ్బంది పెడతాయి. విలన్ ని రివీల్ చేసే విధానం, దానికి ఎంచుకున్న ఆర్టిస్టు చిన్న షాకే. బిగిసడలని కథనం అవసరమైన ఇలాంటి సినిమాలో అది పూర్తి స్థాయిలో లేకపోవడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. వీకెండ్ లో ఏదోకటి చూడాల్సిందే అంటేనే ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on March 2, 2024 7:18 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…