ఆపరేషన్ వాలెంటైన్ తో పాటు నిన్న విడుదలైన సినిమాల్లో బజ్ తక్కువగా ఉన్నా కాసింత ఆసక్తి రేపిన వాటిలో భూతద్దం భాస్కర్ నారాయణ ఒకటి. హీరోగా సెటిలయ్యేందుకు కష్టపడుతున్న శివ కందుకూరి కథానాయకుడిగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. అనూహ్యంగా దీనికే కొంత డీసెంట్ టాక్ వినిపించడం గమనార్హం. ముందు రోజు రాత్రి హైదరాబాద్ లో వేసిన ప్రీమియర్లతో పాటు రిలీజ్ రోజు మెల్లగా పెరుగుతున్న ఆక్యుపెన్సీలు చిన్నగా ఆశలు పెంచుతున్నాయి. ఇంతకీ భాస్కర్ ఏం చేశాడో చూద్దాం.
ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామంలో దిష్టిబొమ్మ హత్యలు అంతు చిక్కని మిస్టరీగా మారతాయి . 18 ఏళ్లలో పదిహేను స్త్రీలను చంపేసినా హంతకుడు ఎవరో కనుక్కోలేక పోలీసులు సతమతమవుతూ ఉంటారు. అప్పుడు రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఎలాగైనా గొప్ప పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్న ఈ సరదా గూఢచారి మెల్లగా కూపీలు లాగుతూ అవి మర్డర్లు కాదని, నరబలులని గుర్తిస్తాడు. అయితే చేసిందెవరో అర్థం కాదు. చివరికి ఇలాంటి సస్పెన్స్ డ్రామాల్లోలాగే ఇక్కడా ఎవరూ ఊహించని వ్యక్తి విలన్ గా తేలతాడు.
క్రైమ్ కథలు మనకు కొత్త కాకపోయినా మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్ తీసుకున్న పురుషోత్తం రాజ్ దాన్ని కాస్త విభిన్నంగా అందించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయాలు, హత్యల నేపధ్యం ఇలా ఏదోలా టైం పాస్ చేయించి అసలు ట్విస్టులు సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు. మధ్యలో అవసరం లేని ఉపకథలు, డ్రామాలు వచ్చి ఇబ్బంది పెడతాయి. విలన్ ని రివీల్ చేసే విధానం, దానికి ఎంచుకున్న ఆర్టిస్టు చిన్న షాకే. బిగిసడలని కథనం అవసరమైన ఇలాంటి సినిమాలో అది పూర్తి స్థాయిలో లేకపోవడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. వీకెండ్ లో ఏదోకటి చూడాల్సిందే అంటేనే ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on March 2, 2024 7:18 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…