Movie News

యానిమల్ పార్క్ గురించి సందీప్ స్పష్టత

గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పఠాన్, జవాన్, గదర్ 2 సరసన స్థానం సంపాదించుకున్న యానిమల్ కొనసాగింపు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న అభిమానులు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. కబీర్ సింగ్ తోనే గొప్ప గుర్తింపు తెచ్చుకున్నా యానిమల్ దెబ్బకి టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వాంటెడ్ సెలబ్రిటీగా మారిపోయాడు. అందుకే ఈవెంట్లకు, లాంచులకు స్పెషల్ గెస్టుగా తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఒక వేడుకలో సందీప్ వంగా ఒక ముఖ్యమైన విషయం పంచుకున్నాడు.

యానిమల్ పార్క్ ఇప్పట్లో రాదనే క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని తేల్చి చెప్పాడు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథను సరికొత్త పంథాలో చెప్పబోతున్నానని, ప్రభాస్ ని గతంలో చూడని ఒక కొత్త మేకోవర్ లో ఆవిష్కరిస్తానని వివరించాడు. ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేదు కానీ డార్లింగ్ అభిమానులకు కావాల్సిన కీలకమైన పాయింట్ అయితే దొరికేసింది. అయితే స్పిరిట్ స్క్రిప్ట్ పనులు ఎప్పుడు పూర్తవుతాయనేది మాత్రం చెప్పలేదు. ఇంకో ఏడాది పట్టినా ఆశ్చర్యం లేదేమో.

ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ , కల్కి 2898 ఏడిలు సమాంతరంగా చేస్తున్నాడు. హను రాఘవపూడితో చేసే ప్యాన్ ఇండియా మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైపోయాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంని ఈ ఏడాదే మొదలుపెట్టే ఛాన్సుందని బెంగళూరు వర్గాలు ఉటంకిస్తున్నాయి. మరి స్పిరిట్ ఎప్పుడు కార్యరూపంలోకి వస్తుందనేది వేచి చూడాలి. సందీప్ వంగాకు దీంతో పాటు యానిమల్ పార్క్ కాకుండా అల్లు అర్జున్ తో ఒక కమిట్ మెంట్ ఉంది. వీటికే ఇంకో మూడు నాలుగేళ్లు సులభంగా పడుతుంది. ఆ తర్వాతే ఇతర హీరోలకు ఛాన్స్ ఉంటుంది.

This post was last modified on February 29, 2024 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆపరేషన్ అరణ్యకు శ్రీకారం చుట్టిన పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…

18 minutes ago

ఏపీ కోరినట్టుగానే.. ‘వాల్తేర్’తోనే విశాఖ రైల్వే జోన్

కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…

2 hours ago

హమ్మయ్యా… బెర్తులన్నీ సేఫ్

తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

5 hours ago

ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్

సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…

9 hours ago

పేదల గుండెకు బాబు సర్కారు భరోసా

ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…

10 hours ago

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…

10 hours ago