మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసుకున్న ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన పనులు బయటికి ఎక్కువ లీక్ కాకుండా చకచకా జరిగిపోతున్నాయి. త్వరలో క్యాస్ట్ అండ్ క్రూతో భారీ వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున ఒక కీలక పాత్ర చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ నెరేషన్ అయిపోయిందని, నాగ్ అంగీకారం వచ్చేసిందని వినికిడి. మహేష్ కి జోడిగా చెల్సియా ఇస్లాన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాగా నాగార్జున సరసన కల్కి భామ దీపికా పదుకునేని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ డీల్ ఇంకా తుదిదశకు చేరుకోలేదట.
ఒకవేళ ఓకే అయితే కాంబినేషన్ మరింత క్రేజీగా మారుతుంది. ఆర్ఆర్ఆర్ కు ఇదే తరహాలో అలియా భట్, అజయ్ దేవగన్ లను తీసుకొచ్చిన జక్కన్న దానికి తగ్గట్టే మంచి ఫలితం అందుకున్నాడు. తక్కువ నిడివి ఉన్న పాత్రలైనా సరే భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి ఒప్పించాడు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని రిపీట్ చేయచ్చు. వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో స్క్రీన్ పంచుకున్న మహేష్ ఇప్పుడు నాగ్ తో కలిసి తెరమీద కనిపిస్తే అంతకంటే అభిమానులకు కావాల్సింది ఏముంటుంది. ఇంకొన్ని రోజుల పాటు ఇలాంటి డీటెయిల్స్ ఏవీ అఫీషియల్ చేయబోరు.
అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ఎప్పుడు ఉండాలనే ముహూర్తం ఇంకా ఫిక్స్ చేయలేదని తెలిసింది. ఉగాది పండగకు చేద్దామా లేక ఇంకో నెల ఆగి ఏప్రిల్ లో ప్రకటిద్దామా అనే ఆలోచన కొలిక్కి రాలేదట. 2026లో విడుదల చేయాలనే సంకల్పంతో పనులు చేస్తున్నారు కానీ ఇది పూర్తిగా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కీరవాణి సంగీతం సమకూర్చబోయే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ కు మహారాజా అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చినా యూనిట్ వర్గాలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 28, 2024 5:44 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…