Movie News

రెండేళ్ల ముందే కంగనకు నోటీసులు.. నిజమా?

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఆమె వ్యవహారం చూస్తుంటే అతి త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేసేలా కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కంగనాకు పూర్తి మద్దతునిస్తూ మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన సర్కారుపైకి ఉసిగొల్పుతోందన్నది స్పష్టం.

అక్కడి ప్రభుత్వం మీద ఆమె కొన్ని రోజులుగా ఎలా విరుచుకుపడుతోందో చూస్తూనే ఉన్నాం. అటు వైపు నుంచి కూడా అదే స్థాయిలో స్పందన వస్తోంది. తాజాగా ఈ గొడవ మరో స్థాయికి చేరింది. ముంబయిలోని కంగనా కార్యాలయం అక్రమ నిర్మాణం అంటూ దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసింది బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ). బొంబాయి హైకోర్టు దీనిపై స్టే విధించే లోపు దాన్ని చాలా వరకు కూలగొట్టేశారు కూడా.

ఇదిలా ఉంటే.. కంగనా కార్యాలయంలో అక్రమ నిర్మాణాల గురించి రెండేళ్ల కిందటే ఆమెకు నోటీసులు పంపినట్లు బీఎంసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతో తప్పు కంగనాదే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దీనికి కంగనా దీటుగా బదులిచ్చింది. తన కార్యాలయానికి సంబంధించి బీఎంసీ రెండేళ్ల కిందటే నోటీసులిచ్చారనడం పూర్తి అబద్ధమని.. అది నిజమే అని రుజువు చేయాలని బీఎంసీ అధికారులకు సవాలు విసిరింది. తన ఆఫీస్ అక్రమంగా నిర్మించిందైతే ఇన్నేళ్లుగా సైలెంటుగా ఉండి ఉన్నట్లుండి ఈ రోజు బీఎంసీ ఎందుకు విధ్వంసానికి దిగిందని.. కేవలం 24 గంటల వ్యవధిలో ఇది అక్రమ నిర్మాణంగా మారిపోయిందా అని ఆమె ప్రశ్నించింది.

#Shameonmahagovt.. #deathofdemocracy అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మహారాష్ట్ర సర్కారు మీద ఆమె తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసింది. తన కార్యాలయాన్ని కూలగొట్టిన ఫొటోలు, వీడియోలను ఆమె ట్విట్టర్లో షేర్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్‌కు అనేక ప్రశ్నలు సంధించింది.

This post was last modified on September 10, 2020 1:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

43 minutes ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

6 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

7 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

7 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

7 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

9 hours ago