ఎల్లుండి వెన్నెల కిషోర్ చారి 111 విడుదల కానుంది. స్పై బ్యాక్ డ్రాప్ లో కామెడీ కం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించినట్టు ట్రైలర్ చూశాక అర్థమైపోయింది. ప్రస్తుతానికి దీని మీద ఎలాంటి బజ్ కనిపించడం లేదు. టీమ్ కాన్ఫిడెన్సో లేక టాక్ తో నిలబడతామనే ధీమానో ఏమో కానీ హీరో ముందు పెద్ద సవాల్ నిలవనుంది. గత వారం ఇద్దరు కమెడియన్లు కథానాయకులుగా లాంచ్ అయ్యారు. హర్ష చెముడు సుందరం మాస్టర్ ని రవితేజ లాంటి పెద్ద హీరో నిర్మించినా కంటెంట్ బలహీనంగా ఉండటం వల్ల ఆడియన్స్ తిరస్కారానికి గురయ్యింది. హర్ష ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు.
అభినవ్ గోమటం మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రాని పబ్లిక్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈవెంట్లు గట్రా చేశారు కానీ ప్రేక్షకులకు కనీసం వచ్చిందన్న విషయం కూడా రిజిస్టర్ కానంత దారుణంగా దెబ్బ తింది. టాక్ ఓ మోస్తరుగా సోసో అన్నారు కానీ జనాన్ని థియేటర్లకు రప్పించేంత మ్యాటర్ లేదని తేలిపోవడంతో ఫ్లాప్ ముద్ర తప్పలేదు. ఇప్పుడు వెన్నెల కిషోర్ వంతు వచ్చింది. కొత్తగా తను ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి లేదు కానీ ఇతని ఇమేజ్ ఓపెనింగ్స్ తెస్తుందని నమ్మకంతో ఉన్న ప్రొడ్యూసర్ల ఆశలు నెరవేరాలంటే మాములు హిట్ అనిపించుకుంటే సరిపోదు.
జాతిరత్నాలు రేంజ్ టాక్ వస్తే తప్ప చారి 111 నిలదొక్కుకోవడం కష్టం. పోటీలో ఉన్న ఆపరేషన్ వాలెంటైన్ కోసం వరుణ్ తేజ్ రెండు వారాలుగా నాన్ స్టాప్ ప్రమోషన్లు చేస్తుంటే అందులో కనీసం సగం కూడా వెన్నెల కిషోర్ వైపు నుంచి జరగలేదు. కారణాలు ఏంటో కానీ సినిమా చూశాక ఒక క్లారిటీ రావొచ్చు. ఇకపై ఈ సిరీస్ లో వరసగా సినిమాలు తీస్తానని దర్శకుడు టిజి కీర్తి కుమార్ అంటున్నాడు. పెద్ద స్టార్లు భాగమవుతారట. రుద్రనేత్ర స్ఫూర్తిగా చెప్పి మెగా ఫాన్స్ ని టార్గెట్ చేశాడు. ఇవన్నీ ఓకే కానీ అసలే స్తబ్దుగా ఉన్న బాక్సాఫీస్ కు జోష్ తెచ్చే విజేత ఎవరో ఇంకో రెండు రోజుల్లో తేలిపోతుంది.
This post was last modified on February 28, 2024 9:48 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…