ప్రభాస్ కల్కి 2898 ఏడి విడుదల మే 9నే ఉంటుందని యూనిట్ వర్గాలు నొక్కి చెబుతున్నాయి. ఒకవేళ ఇది వాయిదా పడే క్రమంలో ఇండియన్ 2 లాంటివి ఆ స్లాట్ ని తీసుకునేందుకు ఎదురు చూస్తున్న తరుణంలో వాయిదా వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు నాగ అశ్విన్ ఎక్కడైనా బయట కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వీలైనంత కబుర్లు కల్కి గురించి పంచుకుంటున్నారు. వాటిలో భాగంగానే ఈ సినిమా 6000 సంవత్సరాల కాల క్రమంలో, మహాభారతంతో మొదలై భవిష్యత్తులో వచ్చే 2898 సంవత్సరం దాకా జరుగుతుందని కీలకమైన క్లూస్ ఇచ్చాడు.
హాలీవుడ్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ బ్లేడ్ రన్నర్ తరహా ఛాయలు విన్నప్పుడు అనిపించినా ఏ కోశానా అలాంటి పోలికలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నామని క్లారిటీతో చెప్పాడు. భారతం అంటే పాండవులు, కౌరవులు, కృష్ణుడు ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. అసలే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని క్యామియోల గురించి ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే కురుక్షేత్ర సంగ్రామం తాలూకు సాంపిల్ చూపించి వీళ్ళను ఏమైనా వాడుకునే స్కెచ్ వేశారేమో చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్ద పీఠ వేస్తున్న కల్కిలో పురాణాల రిఫరెన్స్ బలంగా ఉంటాయట.
రిలీజ్ డేట్ గురించి అనుమానాలు కాదు కానీ వీలైనంత త్వరగా ప్రమోషన్లు మొదలుపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. మే 9 ఎంతో దూరంలో లేదు. సరిగ్గా ఇంకో డెబ్భై మూడు రోజులు కౌంట్ డౌన్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి డబ్బింగ్ వగైరా పనులు చాలా ఉంటాయి. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ప్లాన్ చేసుకున్నారు. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ కావడంతో బిజినెస్ వర్గాల్లో చాలా క్రేజ్ ఉంది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు డివైడ్ టాక్ వచ్చినా ప్రభాస్ వందల కోట్లు కొల్లగొట్టాడు. ఇక కల్కి 2898కి ఆకాశమే హద్దుగా మారుతుందేమో.
This post was last modified on February 26, 2024 1:02 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…