నిన్న సాయంత్రం ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా పద్మభూషణ్ పురస్కారం ప్రకటించాక ఆయన హాజరైన ఇండస్ట్రీ సినిమా ఈవెంట్ ఇదే కావడంతో అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిరు తనదైన శైలిలో పంచులు, చమక్కులతో మెరిపించారు. కమెడియన్ అభినవ్ గోమటంని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మధ్య సోషల్ మీడియా మీమ్స్ లో మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా అంటూ ఒక వ్యక్తి బాగా ఆకట్టుకున్నాడని అతని స్టైల్ లోనే డైలాగు చెప్పడం స్టేజి మీద ఓ రేంజ్ లో పేలింది.
పక్కనే ఉన్న అభినవ్ ఏకంగా కాళ్ళ మీద పడినంత పని చేశాడు. యాంకర్ సుమ చిరు లీక్స్ ప్రస్తావన తెచ్చినప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్న సంగతి తన దగ్గర దాచారని, నాగబాబు కన్నా ఎక్కువగా నాతోనే చనువుగా ఉండే వరుణ్ ఇది మాత్రం రహస్యంగా ఉంచడం పట్ల హర్ట్ అయ్యాయని సరదాగా చెప్పడం, దానికి బదులుగా మెగా ప్రిన్స్ గౌరవంతో అలా చేసినా తర్వాత ముందు చెప్పింది పెదనాన్నకేనంటూ బదులు చెప్పడం జరిగిపోయాయి. ఈ సందర్భంగానే ఒక ఫోటో గురించి వివరిస్తూ వరుణ్ చిన్నప్పుడు చైనీస్ అబ్బాయిలా ఉండేవాడన్న సంగతి గుర్తు చేసుకున్నారు.
సుమని ఉద్దేశించి చిరంజీవి మరో పంచు వేస్తూ తన మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంతో అందరూ ఘొల్లుమన్నారు. ఇలా సరదాగా నవ్వించిన చిరు అసలు ప్రసంగంలో ఆపరేషన్ వాలెంటైన్ ప్రాముఖ్యత, పుల్వామా దాడిలో మన సైనికులు చూపించిన సాహసం గురించి చెబుతూ ఇలాంటి సినిమాలు ప్రోత్సహించడం ద్వారా వాళ్లకు సెల్యూట్ చేయాలని కోరారు. కొంత గ్యాప్ తర్వాత పబ్లిక్ ఈవెంట్ లో కనిపించిన తీరు తమ ముద్రని చూపించారు. విశ్వంభర రెగ్యులర్ షూటింగ్ ఇవాళ హైదరాబాద్ లో కొనసాగనుంది.
This post was last modified on February 26, 2024 1:01 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…