నిన్న సాయంత్రం ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా పద్మభూషణ్ పురస్కారం ప్రకటించాక ఆయన హాజరైన ఇండస్ట్రీ సినిమా ఈవెంట్ ఇదే కావడంతో అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిరు తనదైన శైలిలో పంచులు, చమక్కులతో మెరిపించారు. కమెడియన్ అభినవ్ గోమటంని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మధ్య సోషల్ మీడియా మీమ్స్ లో మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా అంటూ ఒక వ్యక్తి బాగా ఆకట్టుకున్నాడని అతని స్టైల్ లోనే డైలాగు చెప్పడం స్టేజి మీద ఓ రేంజ్ లో పేలింది.
పక్కనే ఉన్న అభినవ్ ఏకంగా కాళ్ళ మీద పడినంత పని చేశాడు. యాంకర్ సుమ చిరు లీక్స్ ప్రస్తావన తెచ్చినప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్న సంగతి తన దగ్గర దాచారని, నాగబాబు కన్నా ఎక్కువగా నాతోనే చనువుగా ఉండే వరుణ్ ఇది మాత్రం రహస్యంగా ఉంచడం పట్ల హర్ట్ అయ్యాయని సరదాగా చెప్పడం, దానికి బదులుగా మెగా ప్రిన్స్ గౌరవంతో అలా చేసినా తర్వాత ముందు చెప్పింది పెదనాన్నకేనంటూ బదులు చెప్పడం జరిగిపోయాయి. ఈ సందర్భంగానే ఒక ఫోటో గురించి వివరిస్తూ వరుణ్ చిన్నప్పుడు చైనీస్ అబ్బాయిలా ఉండేవాడన్న సంగతి గుర్తు చేసుకున్నారు.
సుమని ఉద్దేశించి చిరంజీవి మరో పంచు వేస్తూ తన మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంతో అందరూ ఘొల్లుమన్నారు. ఇలా సరదాగా నవ్వించిన చిరు అసలు ప్రసంగంలో ఆపరేషన్ వాలెంటైన్ ప్రాముఖ్యత, పుల్వామా దాడిలో మన సైనికులు చూపించిన సాహసం గురించి చెబుతూ ఇలాంటి సినిమాలు ప్రోత్సహించడం ద్వారా వాళ్లకు సెల్యూట్ చేయాలని కోరారు. కొంత గ్యాప్ తర్వాత పబ్లిక్ ఈవెంట్ లో కనిపించిన తీరు తమ ముద్రని చూపించారు. విశ్వంభర రెగ్యులర్ షూటింగ్ ఇవాళ హైదరాబాద్ లో కొనసాగనుంది.
This post was last modified on February 26, 2024 1:01 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…