ఏపీ ఎన్నికలకు ఇంకా నెలన్నర దాకా టైం ఉన్నప్పటికీ ఎలక్షన్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. రెండు రోజుల క్రితం టిడిపి జనసేన పొత్తుకు సంబంధించిన సీట్ల ప్రకటన జరిగినప్పటి నుంచి ఒక్కసారిగా అభిమానుల అటెన్షన్ అటువైపు వెళ్లిపోయింది. పవన్ ఇంకా ఎక్కువ టికెట్లు డిమాండ్ చేసుండాల్సిందని ఒక వర్గం, తెలుగుదేశం కొన్ని కీలక స్థానాలు త్యాగం చేసి జనసేనకు ప్రాధాన్యత ఇచ్చిందని ఇంకో వర్గం ఇలా రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్థమవుతున్నాయి. ఇరు వైపులా పాజిటివ్ నెగటివ్ రెండు రకాల కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఈ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగనుంది.
అసలే ఫిబ్రవరి నెల డ్రైగా గడిచిపోవడం పట్ల బయ్యర్లు దిగులుగా ఉన్న టైంలో ఇలా రాజకీయాల గురించి ఫోకస్ పెరగడం మరింత ఆందోళన కలిగించేదే. తెలంగాణలో వీటి ప్రభావం లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల వారీగా మీటింగులు, ర్యాలీలు, అసంతృప్తుల సమావేశాలు ఒకటేమిటి ఎక్కడ చూసినా ఇదే హడావిడి కనిపిస్తోంది. అధికార పార్టీ వైసిపి సైతం సోషల్ మీడియా మీద ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నలుగురు కలిసి టీ బంకు దగ్గర గుమికూడితే చాలు వాళ్ళ మధ్య సినిమాల కంటే స్థానిక పాలిటిక్స్ గురించిన టాపిక్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఆశ్చర్యం కాదు.
దీని వల్ల కలెక్షన్లు అమాంతం తగ్గిపోతాయని కాదు కానీ ప్రభావమైతే ఖచ్చితంగా ఉంటుంది. ఖాళీగా ఉన్న యువతను పార్టీలు వాడుకునేందుకు చూస్తాయి. తాత్కాలికంగా ఆదాయ మార్గాలు చూపిస్తాయి. అలాంటప్పుడు థియేటర్లకు అదే పనిగా వెళ్లే శాతం తగ్గిపోతుంది. పైగా పిల్లల పరీక్షల దెబ్బకు పెద్దలు నో సినిమా బోర్డు పెట్టేసుకున్నారు. సో మార్చి రెండో వారం దాకా ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఆపరేషన్ వాలెంటైన్, గామి, భీమాలు ఏదైనా అద్భుతం చేస్తేనే మళ్ళీ థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు చూడొచ్చు. లేదంటే ఎన్నికల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది.
This post was last modified on February 26, 2024 5:22 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…