టాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కెరీర్ ఇప్పుడు డోలాయమాన స్థితిలో ఉంది. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి హిట్లతో ఒకప్పుడు అతను మంచి ఊపులోనే ఉన్నాడు. కానీ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోక గాడి తప్పాడు. గని, గాండీవధారి అర్జున సినిమాలు అతణ్ని బాగా కిందికి లాగేశాయి. మధ్యలో ఎఫ్-3 సైతం సరిగా ఆడలేదు. ఇప్పుడు వరుణ్ ఆశలన్నీ ఆపరేషన్ వేలంటైన్ మీదే ఉన్నాయి.
వరుణ్ నటించిన తొలి బైలింగ్వల్ మూవీ ఇది. తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి చిత్రీకరించారు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. సోనీ పిక్చర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించింది. ఐతే వరుణ్ ట్రాక్ రికార్డు దెబ్బ తినడం, బాలీవుడ్ మూవీ ఫైటర్తో పోలికల వల్ల దీనికి ఆశించిన స్థాయిలో బజ్ కనిపించలేదు మొన్నటిదాకా. కానీ రిలీజ్ టైం దగ్గర పడేసరికి పరిస్థితి మెరుగుపడుతోంది.
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ పడ్డ, పడుతున్న కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో లీడ్ రోల్ కోసం వరుణ్ ఎయిర్ పైలట్స్ దగ్గర శిక్షణ తీసుకుని ఆ పాత్రకు తగ్గట్లుగా ఆహార్యం కూడా మార్చుకున్నాడు. సినిమా కోసం రాజీ లేకుండా కష్టపడడమే కాదు.. దీని ప్రమోషన్ల కోసం చాలా ముందు నుంచే రంగంలోకి దిగాడు. విడుదలకుకొన్ని వారాల ముందు నుంచే పలు చోట్ల ఈవెంట్లలో పాల్గొన్నాడు. అలాగే ఎన్నో మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. టీవీ ఛానెళ్లలో, యూట్యూబ్ ఛానెళ్లలో కూర్చున్నాడు. ఇలా ఒక హీరోగా సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తూ వస్తున్నాడు.
ఆదివారం చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా వరుణ్ ఎంతో నిజాయితీగా మాట్లాడాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ను ప్రేక్షకులకు చేరువ చేయడానికి వరుణ్ పడ్డ కష్టం ప్రశంసనీయం. అతడి కమిట్మెంట్, కష్టానికైనా ఈ సినిమా బాగా ఆడాలని సినీ ప్రియులు అభిలషిస్తున్నారు.
This post was last modified on February 26, 2024 6:19 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…