బాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన కొన్ని సినిమాల్లో రంగీలా ఒకటి. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లయింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా ఈ సినిమా గురించి మంచి మంచి కథనాలు ఇస్తోంది. టీవీలు, వెబ్ సైట్లు, వీడియో ఫ్లాట్ ఫామ్స్లో కూడా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు.
ఆ సినిమా తాలూకు నోస్టాల్జిక్ మూమెంట్స్ను గుర్తు చేస్తున్నారు. లెజెండరీ సినిమాలు ఇలా మైల్ స్టోన్ మార్క్ను అందుకున్నపుడు మీడియా దాన్ని సెలబ్రేట్ చేయడం మామూలే. ఐతే రంగీలా సినిమా సంబరాల్లో ఎక్కడా దాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ చిత్ర ఆర్టిస్టులతో మాట్లాడుతున్నారు, ఇతర టెక్నీషియన్లతో మాట్లాడుతున్నారు. వారి అనుభవాలను ఇస్తున్నారు. కానీ ఎవ్వరూ వర్మను మాత్రం పట్టించుకోవడం లేదు.
ఒక సినిమా క్లాసిక్గా నిలిచిందీ అంటే.. అందులో మేజర్ క్రెడిట్ దర్శకుడికే వెళ్తుంది. ఇలాంటి సినిమాలు మైల్ స్టోన్ మార్కును అందుకున్నపుడు కచ్చితంగా దర్శకుడినే ముందు మీడియా సంప్రదిస్తుంది. అతనెలా ఈ సినిమాను తీర్చిదిద్దాడో అనుభవాలు రాబడుతుంది. ఆ దర్శకుడి పనితనాన్ని పొగుడుతారు. కానీ వర్మ విషయంలో అలా జరగట్లేదు. ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు సత్య సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయినపుడు కూడా ఇలాగే జరిగింది.
ఆ సినిమాకు రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన వాళ్లతో ఇంటర్వ్యూలు చేసింది బాలీవుడ్ మీడియా. వర్మను మాత్రం పట్టించుకోలేదు. అతడు తీసిన సినిమాను పొగుడుతూ.. తనను మాత్రం విస్మరించింది. ఒక దశ దాటాక నాసిరకం సినిమాలు తీయడం, అనవసర వివాదాల్లో తలదూర్చి స్థాయి తగ్గించుకోవడంతో వచ్చిన సమస్య ఇది. ఇప్పటికైనా తాను ఏ స్థితికి పడిపోయానో వర్మకు అర్థమవుతుందా?
This post was last modified on September 10, 2020 11:20 am
వీవీఐపీలు…ప్రత్యేకించి ముఖ్యమంత్రుల కాన్వాయ్ లు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అనుకోని కారణాల వల్ల సీఎం వెళ్లడం కాస్తంత…
తమిళనాడు రాజకీయం రంజుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనన్ని ట్విస్టులు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు కారణం నిన్నటిదాకా అక్కడ ఉన్నవి…
దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం…
అవును.. దళపతి విజయ్ ఏడ్చేశాడు. అవేమీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు కావు. తన…
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…