బాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన కొన్ని సినిమాల్లో రంగీలా ఒకటి. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లయింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా ఈ సినిమా గురించి మంచి మంచి కథనాలు ఇస్తోంది. టీవీలు, వెబ్ సైట్లు, వీడియో ఫ్లాట్ ఫామ్స్లో కూడా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు.
ఆ సినిమా తాలూకు నోస్టాల్జిక్ మూమెంట్స్ను గుర్తు చేస్తున్నారు. లెజెండరీ సినిమాలు ఇలా మైల్ స్టోన్ మార్క్ను అందుకున్నపుడు మీడియా దాన్ని సెలబ్రేట్ చేయడం మామూలే. ఐతే రంగీలా సినిమా సంబరాల్లో ఎక్కడా దాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ చిత్ర ఆర్టిస్టులతో మాట్లాడుతున్నారు, ఇతర టెక్నీషియన్లతో మాట్లాడుతున్నారు. వారి అనుభవాలను ఇస్తున్నారు. కానీ ఎవ్వరూ వర్మను మాత్రం పట్టించుకోవడం లేదు.
ఒక సినిమా క్లాసిక్గా నిలిచిందీ అంటే.. అందులో మేజర్ క్రెడిట్ దర్శకుడికే వెళ్తుంది. ఇలాంటి సినిమాలు మైల్ స్టోన్ మార్కును అందుకున్నపుడు కచ్చితంగా దర్శకుడినే ముందు మీడియా సంప్రదిస్తుంది. అతనెలా ఈ సినిమాను తీర్చిదిద్దాడో అనుభవాలు రాబడుతుంది. ఆ దర్శకుడి పనితనాన్ని పొగుడుతారు. కానీ వర్మ విషయంలో అలా జరగట్లేదు. ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు సత్య సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయినపుడు కూడా ఇలాగే జరిగింది.
ఆ సినిమాకు రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన వాళ్లతో ఇంటర్వ్యూలు చేసింది బాలీవుడ్ మీడియా. వర్మను మాత్రం పట్టించుకోలేదు. అతడు తీసిన సినిమాను పొగుడుతూ.. తనను మాత్రం విస్మరించింది. ఒక దశ దాటాక నాసిరకం సినిమాలు తీయడం, అనవసర వివాదాల్లో తలదూర్చి స్థాయి తగ్గించుకోవడంతో వచ్చిన సమస్య ఇది. ఇప్పటికైనా తాను ఏ స్థితికి పడిపోయానో వర్మకు అర్థమవుతుందా?
This post was last modified on September 10, 2020 11:20 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…