హీరోగా మాస్ మార్కెట్ ని ఎంజాయ్ చేస్తూనే ఇంకోవైపు కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే ఉద్దేశంతో రవితేజ మొదలుపెట్టిన బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు పెద్ద స్ట్రోక్ ఇస్తున్నాయి. రావణాసురలోనూ మాస్ రాజా నిర్మాణ భాగస్వామిగా ఉన్నప్పటికీ సోలో ప్రొడ్యూసర్ గా చూడాల్సింది మాత్రం ఛాంగురే బంగారురాజా నుంచే. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నంతో పాటు అధిక శాతం కమెడియన్లను క్యాస్టింగ్ గా పెట్టుకుని తీసిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది. కంటెంట్ లో చెప్పుకోదగ్గ పాయింట్ ఉన్నా పేలవమైన రైటింగ్, డైరెక్షన్ తో డిజాస్టరయ్యింది.
తాజాగా సుందరం మాస్టర్ కూడా అదే బాటలో వెళ్తున్నట్టు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. టాక్ ఆశాజనకంగా లేదు. దీనికన్నా ముందు అసలు పబ్లిక్ ఈ సినిమా మీద ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని మార్నింగ్ షో జనాలను చూస్తేనే అర్థమైపోయింది. హర్ష చెముడుని హీరోగా పరిచయం చేయాలనే ఆలోచన మంచిదే కానీ కథా కథనాల విషయంలో ఎంటర్ టైన్మెంట్ కన్నా ఎక్కువగా సందేశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో సెకండ్ హాఫ్ సహనానికి పరీక్ష పెట్టి ఓడించేసింది. ఈ వీకెండ్ లో ఏదైనా రాబడితేనే అదే గొప్పనుకోవాలి తప్పించి సోమవారం నుంచి అగ్ని పరీక్షే ఉంటుంది.
డబ్బుల పరంగా రవితేజకు వీటివల్ల పెద్దగా రిస్క్ ఏం లేదు. డబ్బింగ్, శాటిలైట్ ఇలా ఏదో ఒక రూపంలో పెట్టుబడి వెనక్కు వస్తుంది. కానీ బ్రాండ్ ఇమేజ్ కూడా ముఖ్యం కదా. రవితేజ ప్రొడక్షన్ అంటే అభిమానుల్లోనే కాదు సగటు మూవీ లవర్స్ లోనూ ప్రత్యేక గౌరవం ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చాలా ముఖ్యం. అలా అని బ్యాడ్ మూవీస్ తీయలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూరే పరిగణనలోకి వస్తుంది. అసలే హీరోగా రవితేజనే వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. అలాంటిది ఇలా నిర్మాణ పరంగానూ కాలం కలిసి రాకపోవడం దురదృష్టం. ఇకనైనా క్వాలిటీ మీద దృష్టి పెట్టాలి.
This post was last modified on February 24, 2024 10:45 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…