ఇవాళ పెద్ద ఎత్తున కొత్త రిలీజులు థియేటర్లకు వచ్చాయి. అయిదారు స్క్రీన్లున్న మల్టీప్లెక్సులకు సైతం ఢోకా లేకుండా సినిమాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కట్ చేస్తే ఓపెనింగ్స్ కనిపించడం లేదు. హర్ష చెముడు టైటిల్ రోల్ పోషించిన సుందరం మాస్టర్ కు మెయిన్ సెంటర్స్ లో ఓ మోస్తరుగా జనం వస్తే మిగిలిన సెంటర్లలో మాత్రం పికప్ కాకపోతే కష్టమనేలా ఉంది. అభినవ్ గోమటంని హీరోగా మార్చిన మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా పరిస్థితి ఇంతకన్నా అన్యాయంగా ఉంది. ప్రమోషన్లు జనాలకు అంతగా రీచ్ కాకపోవడంతో ఇదొచ్చిందన్న సంగతే పెద్దగా తెలియలేదు.
విపరీతమైన క్యారెక్టరైజేషన్ తో అర్జున్ రెడ్డి రేంజ్ లో హడావిడి చేసిన సిద్దార్థ్ రాయ్ ఆడియన్స్ ని రప్పించేందుకు పోరాడుతున్నాడు. దర్శకుడు యశస్వి చాలా కొత్తగా ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ ప్రాధమిక రిపోర్ట్స్ మాత్రం మిక్స్డ్ గానే ఉన్నాయి. మమ్ముట్టి భ్రమ యుగం మీద ఆశలు పెట్టుకున్న హారర్ లవర్స్ మలయాళం హిట్ టాక్ తెలిసిపోయింది దీనికి మాత్రం ప్రత్యేకంగా వెళ్లిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అలా అని హౌస్ ఫుల్ బోర్డులు లేవు కానీ డీసెంట్ ఫిగర్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇవి కాకుండా మరో నాలుగు సినిమాలు గురించి చెప్పుకోకపోవడం బెటర్.
అన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలు కావడంతో హైప్ లేకపోవడం సమస్యగా మారింది. ఆ మాటకొస్తే సంక్రాంతికి తిరిగి అంత ఊపు తెచ్చిన సినిమాలేవీ బాక్సాఫీస్ ని పలకరించలేదు. ఊరుపేరు భైరవకోన ఒకటే డీసెంట్ గా నడుస్తుండగా, ఈగల్ రెండో వారానికే నెమ్మదించిపోయింది. ఇక యాత్ర 2, లాల్ సలాంల గురించి తెలిసిందే. పైన చెప్పిన సినిమాలకు యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాకపోయినా ఇవాళ సాయంత్రానికి లేదా రేపటికి పర్వాలేదు చూడొచ్చనే మాట తెచ్చుకుంటే వీకెండ్ కి పుంజుకోవచ్చు. మొదటి రోజు మార్నింగ్ షోకే జనాలు పల్చగా ఉంటే అదే కదా అసలు సమస్య.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…