వివాదాలు కమల్ హాసన్ కు కొత్త కాదు. అయితే ఈసారి హీరోగా కన్నా నిర్మాతగా ఆయన తీస్తున్న సినిమా మీద కాంట్రావర్సి మొదలైంది. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న అమరన్ టీజర్ ఇటీవలే విడుదలయ్యింది. కాశ్మీర్ ఉగ్రవాదంపై పోరాటం చేసి 2014లో వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. టీజర్ లో కంటెంట్ చూసిన మైనారిటీ వర్గాలు కాశ్మీర్ ముస్లింలను తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు టిఎంజికె సంఘం సభ్యులు కేసు నమోదుకి సిద్ధమై హీరో దర్శక నిర్మాతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అమరన్ లో చూపిస్తున్నది వాస్తవాలే. వేర్పాటువాదం తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధంలో ఎందరో అమాయకులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కుట్ర వెనుక శత్రుదేశం నుంచి వచ్చిన చొరబాటుదారులు ఉన్నారు. అవన్నీ అసురన్ లో చూపించే అవకాశముంది. కానీ పూర్తిగా చూడకుండానే కేవలం టీజర్ ఆధారంగా ఇలా చేయడం సరికాదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. కమల్ ఇలాంటివి ఎన్నో చూశారు.
విశ్వరూపం టైంలో ఏకంగా నిషేధం దాకా వెళ్ళింది వ్యవహారం. అయినా సరే అప్పటి సీఎం జయలలితతో పోరాటం చేసి మరీ సినిమాను రిలీజ్ చేయించుకున్నారు. హే రామ్ వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ రభస జరిగింది. గాంధీ మద్దతుదారులు సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలా ఎన్నో సందర్భాల్లో కమల్ హాసన్ వీటిని ఎదుర్కొని విజయం సాధించిన దాఖలాలే ఎక్కువ. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న అమరన్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇది ఇక్కడితో ఆగుతుందా లేక కొత్త పరిణామాలకు దారి తీస్తుందా చూడాలి.
This post was last modified on February 23, 2024 12:37 pm
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…