Movie News

కమల్ హాసన్ సినిమాపై మైనారిటీల ఆగ్రహం

వివాదాలు కమల్ హాసన్ కు కొత్త కాదు. అయితే ఈసారి హీరోగా కన్నా నిర్మాతగా ఆయన తీస్తున్న సినిమా మీద కాంట్రావర్సి మొదలైంది. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న అమరన్ టీజర్ ఇటీవలే విడుదలయ్యింది. కాశ్మీర్ ఉగ్రవాదంపై పోరాటం చేసి 2014లో వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. టీజర్ లో కంటెంట్ చూసిన మైనారిటీ వర్గాలు కాశ్మీర్ ముస్లింలను తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు టిఎంజికె సంఘం సభ్యులు కేసు నమోదుకి సిద్ధమై హీరో దర్శక నిర్మాతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అమరన్ లో చూపిస్తున్నది వాస్తవాలే. వేర్పాటువాదం తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధంలో ఎందరో అమాయకులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కుట్ర వెనుక శత్రుదేశం నుంచి వచ్చిన చొరబాటుదారులు ఉన్నారు. అవన్నీ అసురన్ లో చూపించే అవకాశముంది. కానీ పూర్తిగా చూడకుండానే కేవలం టీజర్ ఆధారంగా ఇలా చేయడం సరికాదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. కమల్ ఇలాంటివి ఎన్నో చూశారు.

విశ్వరూపం టైంలో ఏకంగా నిషేధం దాకా వెళ్ళింది వ్యవహారం. అయినా సరే అప్పటి సీఎం జయలలితతో పోరాటం చేసి మరీ సినిమాను రిలీజ్ చేయించుకున్నారు. హే రామ్ వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ రభస జరిగింది. గాంధీ మద్దతుదారులు సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలా ఎన్నో సందర్భాల్లో కమల్ హాసన్ వీటిని ఎదుర్కొని విజయం సాధించిన దాఖలాలే ఎక్కువ. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న అమరన్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇది ఇక్కడితో ఆగుతుందా లేక కొత్త పరిణామాలకు దారి తీస్తుందా చూడాలి.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

35 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

9 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

12 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago