Movie News

కమల్ హాసన్ సినిమాపై మైనారిటీల ఆగ్రహం

వివాదాలు కమల్ హాసన్ కు కొత్త కాదు. అయితే ఈసారి హీరోగా కన్నా నిర్మాతగా ఆయన తీస్తున్న సినిమా మీద కాంట్రావర్సి మొదలైంది. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న అమరన్ టీజర్ ఇటీవలే విడుదలయ్యింది. కాశ్మీర్ ఉగ్రవాదంపై పోరాటం చేసి 2014లో వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. టీజర్ లో కంటెంట్ చూసిన మైనారిటీ వర్గాలు కాశ్మీర్ ముస్లింలను తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు టిఎంజికె సంఘం సభ్యులు కేసు నమోదుకి సిద్ధమై హీరో దర్శక నిర్మాతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అమరన్ లో చూపిస్తున్నది వాస్తవాలే. వేర్పాటువాదం తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధంలో ఎందరో అమాయకులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కుట్ర వెనుక శత్రుదేశం నుంచి వచ్చిన చొరబాటుదారులు ఉన్నారు. అవన్నీ అసురన్ లో చూపించే అవకాశముంది. కానీ పూర్తిగా చూడకుండానే కేవలం టీజర్ ఆధారంగా ఇలా చేయడం సరికాదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. కమల్ ఇలాంటివి ఎన్నో చూశారు.

విశ్వరూపం టైంలో ఏకంగా నిషేధం దాకా వెళ్ళింది వ్యవహారం. అయినా సరే అప్పటి సీఎం జయలలితతో పోరాటం చేసి మరీ సినిమాను రిలీజ్ చేయించుకున్నారు. హే రామ్ వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ రభస జరిగింది. గాంధీ మద్దతుదారులు సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలా ఎన్నో సందర్భాల్లో కమల్ హాసన్ వీటిని ఎదుర్కొని విజయం సాధించిన దాఖలాలే ఎక్కువ. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న అమరన్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇది ఇక్కడితో ఆగుతుందా లేక కొత్త పరిణామాలకు దారి తీస్తుందా చూడాలి.

This post was last modified on February 23, 2024 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago