Movie News

కోట్లు మునిగిపోయినా సీక్వెల్ తీస్తున్నారు

2022లో వచ్చిన ది లెజెండ్ ని థియేటర్లో, ఓటిటిలో చూసినవాళ్లు ఎవరూ మర్చిపోలేరు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలైన ఈ కళాఖండం మీద ఎంత ట్రోలింగ్ జరిగిందో వివరించడం కష్టం. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన శరవణన్ యాభై ఏళ్ళ వయసు దాటాక కేవలం స్క్రీన్ మీద కనిపించాలనే తాపత్రయంతో ది లెజెండ్ తీయించారు. అయితే ఏదో ఆషామాషీగా చుట్టేయలేదు. భారీ క్యాస్టింగ్ ని పెట్టుకుని 70 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారని చెన్నై టాక్ తిరిగింది. ఇంతా చేసి థియేట్రికల్ రైట్స్ ని డెఫిషిట్ తో 45 కోట్లకు స్వంతంగా రిలీజ్ చేశారు.

ఇంత చేసినా బొమ్మ భారీ డిజాస్టర్ అయ్యింది. జనాలు అయ్య బాబోయ్ అనేశారు. శరవణన్ ఎక్స్ ప్రెషన్ల గురించి జరిగిన కామెడీ అంతా ఇంతా కాదు. అయినా సరే ఆయన వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయిల్ షూట్ జరుగుతోంది. ధనుష్, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోలను డీల్ చేసిన దురై సెంథిల్ కుమార్ ని దర్శకుడిగా తీసుకున్నారు. రెమ్యునరేషన్ భారీగా ముట్టజెబుతున్నారు. ఇందులో కూడా శరవణన్ రకరకాల గెటప్స్ లో కనిపిస్తారట. యాక్షన్, సోషల్ మెసేజ్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని సమాచారం.

దీని గురించి మనకెందుకు అంటే ఈ మాస్టర్ పీస్ ప్యాన్ ఇండియాలో వస్తుంది కాబట్టి. ఒక్క విషయంలో శరవణన్ ని మెచ్చుకోవాలి. ఎంత వందల కోట్లు ఉన్నా సరే ఇలా అయాచితంగా సినిమాల మీద ఖర్చు పెట్టే సాహసం అందరూ చేయరు. కానీ ఈయన మాత్రం నా రూటే వేరు అంటున్నారు. నటుడిగా ఎంత ట్రోల్ చేసినా ఒక వ్యాపారవేత్తగా మాత్రం శరవణన్ మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యాన్. తన సంస్థల్లో ఉద్యోగులు దేవుడిలా కొలుస్తారు. కాకపోతే యాక్టింగ్ పిచ్చి ఆయన్ని కేవలం బిజినెస్ కి పరిమితం చేయకుండా తెరదాకా లాకొచ్చింది. ఈసారి ఎలాంటి షాకులు ఇస్తారో చూడాలి.

This post was last modified on February 22, 2024 9:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

యంగ్ అండ్ డేరింగ్ ఎంపీ.. హ్యాట్రిక్ ప‌క్కా!

లోక్‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌శ్నించిన నేత‌గా టీడీపీ ఎంపీ…

4 hours ago

రెబ‌ల్ స్టార్ స‌తీమ‌ణి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు విన్న‌పం

రెబ‌ల్ స్టార్, దివంగ‌త కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి అనూహ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు రాజ‌కీయ ప్ర‌చారం…

7 hours ago

పంతంగి ప్యాక్ అయింది !

సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…

8 hours ago

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం…

8 hours ago

ఏపీలో ఏం జ‌రుగుతోంది.. నిమ్మ‌గ‌డ్డకు టెన్ష‌న్ ఎందుకు?

ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యేందుకు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ.. ఇంత‌లోనే ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌నే…

8 hours ago

బ్రహ్మరథం బన్నీకా.. వైసీపీకా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. రెండు రోజుల కిందటే…

9 hours ago