ఒకప్పుడు హీరోలు నటించడం ద్వారా వచ్చిన డబ్బుని ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో లేదా ఆస్తులు కూడబెట్టడంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కొందరు థియేటర్లు కట్టుకుని వాటి నిర్వహణ ద్వారా వచ్చిన సొమ్ముని కుటుంబ వారసులకు వచ్చేలా చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతిదీ ఖరీదైపోయింది. స్వంతంగా ఓ పది సెంట్ల చోటు కొనాలన్నా హైదరాబాద్ లాంటి నగరాల్లో కోట్లు కావాలి. భాగస్వామ్యం లేకుండా బిజినెస్ చేయడం కష్టమైపోయింది. అందుకే పార్ట్ నర్ షిప్పులు పెరుగుతున్నాయి. అలాంటిదే మల్టీప్లెక్స్ వ్యాపారం. టాలీవుడ్ లో ఈ తరహా టై అప్ లు పెరుగుతున్నాయి.
మహేష్ బాబుతో గచ్చిబౌలిలో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో సూపర్ ప్లెక్స్ నిర్మించాక దానికి వచ్చిన స్పందన, రెవిన్యూ చూసి ఇతర స్టార్లు క్రమంగా ఇదే బాట పట్టడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ ఇదే సంస్థతో మెహబూబ్ నగర్ లో సముదాయం కట్టించగా అమీర్ పేట్ సత్యం థియేటర్ ని పడగొట్టి అందులో మల్టీప్లెక్స్ కట్టడం ద్వారా అల్లు అర్జున్ ఈ రంగంలో అడుగు పెట్టాడు. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఇదే తరహాలో దిల్ సుఖ్ నగర్ లో ఆరు స్క్రీన్ల సముదాయాన్ని ఏషియన్ తోనే ప్లాన్ చేసుకున్నారట. అతి త్వరలో ప్రారంభమయ్యేలా పనులు జరుగుతున్నాయట.
ఒక్కటి మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏడాది పొడవునా హిట్ సినిమాలు లేక ఎన్నో వారాలు డెఫిషిట్లతో నడుస్తున్న థియేటర్లు ఎక్కువైపోయాయని బయ్యర్లు వాపోతున్న టైంలో ఇలా ఇబ్బడిముబ్బడిగా మల్టీప్లెక్సులు హైదరాబాద్ లో పెరుగుతూ పోవడం గమనార్హం. ఖరీదు ఎక్కువైనా సరే సగటు మధ్య తరగతి జనాలు కూడా మంచి అనుభూతిని కోరుకుంటున్నారు. అందుకే సింగల్ స్క్రీన్ల కన్నా వీటికి డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టే ఏషియన్ లాంటి సంస్థలు పక్కా ప్రణాళికతో స్టార్ హీరోలతో చేతులు కలిపి తమ నెట్ వర్క్ ప్లస్ బిజినెస్ రెండూ పెంచేసుకుంటున్నాయి.
This post was last modified on February 21, 2024 10:56 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…