Movie News

భలే మంచి మల్టీప్లెక్సు వ్యాపారము

ఒకప్పుడు హీరోలు నటించడం ద్వారా వచ్చిన డబ్బుని ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో లేదా ఆస్తులు కూడబెట్టడంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కొందరు థియేటర్లు కట్టుకుని వాటి నిర్వహణ ద్వారా వచ్చిన సొమ్ముని కుటుంబ వారసులకు వచ్చేలా చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతిదీ ఖరీదైపోయింది. స్వంతంగా ఓ పది సెంట్ల చోటు కొనాలన్నా హైదరాబాద్ లాంటి నగరాల్లో కోట్లు కావాలి. భాగస్వామ్యం లేకుండా బిజినెస్ చేయడం కష్టమైపోయింది. అందుకే పార్ట్ నర్ షిప్పులు పెరుగుతున్నాయి. అలాంటిదే మల్టీప్లెక్స్ వ్యాపారం. టాలీవుడ్ లో ఈ తరహా టై అప్ లు పెరుగుతున్నాయి.

మహేష్ బాబుతో గచ్చిబౌలిలో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో సూపర్ ప్లెక్స్ నిర్మించాక దానికి వచ్చిన స్పందన, రెవిన్యూ చూసి ఇతర స్టార్లు క్రమంగా ఇదే బాట పట్టడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ ఇదే సంస్థతో మెహబూబ్ నగర్ లో సముదాయం కట్టించగా అమీర్ పేట్ సత్యం థియేటర్ ని పడగొట్టి అందులో మల్టీప్లెక్స్ కట్టడం ద్వారా అల్లు అర్జున్ ఈ రంగంలో అడుగు పెట్టాడు. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఇదే తరహాలో దిల్ సుఖ్ నగర్ లో ఆరు స్క్రీన్ల సముదాయాన్ని ఏషియన్ తోనే ప్లాన్ చేసుకున్నారట. అతి త్వరలో ప్రారంభమయ్యేలా పనులు జరుగుతున్నాయట.

ఒక్కటి మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏడాది పొడవునా హిట్ సినిమాలు లేక ఎన్నో వారాలు డెఫిషిట్లతో నడుస్తున్న థియేటర్లు ఎక్కువైపోయాయని బయ్యర్లు వాపోతున్న టైంలో ఇలా ఇబ్బడిముబ్బడిగా మల్టీప్లెక్సులు హైదరాబాద్ లో పెరుగుతూ పోవడం గమనార్హం. ఖరీదు ఎక్కువైనా సరే సగటు మధ్య తరగతి జనాలు కూడా మంచి అనుభూతిని కోరుకుంటున్నారు. అందుకే సింగల్ స్క్రీన్ల కన్నా వీటికి డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టే ఏషియన్ లాంటి సంస్థలు పక్కా ప్రణాళికతో స్టార్ హీరోలతో చేతులు కలిపి తమ నెట్ వర్క్ ప్లస్ బిజినెస్ రెండూ పెంచేసుకుంటున్నాయి.

This post was last modified on February 21, 2024 10:56 pm

Share
Show comments

Recent Posts

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

15 minutes ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

1 hour ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

6 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

6 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago