Movie News

విశ్వంభరలో హిట్లర్ సెంటిమెంట్

చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ విశ్వంభర షూటింగ్ జనవరి నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి మొదటి వారంలో చిరు, త్రిషలు పాల్గొన్న కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక చిన్న బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం సెలవుల కోసం అమెరికాలో ఉన్న మెగాస్టార్ తిరిగి రాగానే కంటిన్యూ చేయబోతున్నారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో అంజి, జగదేకవీరుడు అతిలోకసుందరిలను మించి ఒక సరికొత్త ప్రపంచాన్ని ఇందులో పరిచయం చేయబోతున్నట్టు యూనిట్ తెగ ఊరిస్తోంది. ఇప్పుడు మరో కీలక లీక్ ఆసక్తిగొలిపేలా ఉంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం విశ్వంభరలో చిరంజీవి పాత్ర పేరు దొరబాబు. భీమవరం దగ్గరలోని ఒక గ్రామంలో కథ మొదలవుతుంది. పెద్ద కుటుంబమే అయినప్పటికీ అయిదుగురు అక్కాచెల్లెళ్ల బాధ్యత అతని తలమీదే ఉంటుంది. దానికోసమే ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాడు. గతంలో ఇంత సిస్టర్ సెంటిమెంట్ తో చిరంజీవి చేసిన మూవీ హిట్లర్ ఒక్కటే. అది ఎమోషన్స్ ఎక్కువగా నడిచే ఫ్యామిలీ కం కమర్షియల్ డ్రామా. కానీ విశ్వంభర దానికి పూర్తి విరుద్ధం. అయినా ఇందరేసి తోబుట్టువులు ఉన్నారంటే ఖచ్చితంగా భావోద్వేగాలకు పెద్ద పీఠ వేస్తాడు వశిష్ట.

ప్రస్తుతం వీళ్ళ క్యాస్టింగ్ పనులు జరుగుతున్నట్టు తెలిసింది. నా సామిరంగలో మెప్పించిన ఆశికా రంగనాథ్ పేరు పరిశీలనలో ఉందట. హీరోయిన్లు కాకపోయినా చిరు ఫ్యామిలీ సభ్యులుగా పేరున్న ఫిమేల్ ఆర్టిస్టులనే తీసుకోవాలని నిర్ణయించినట్టు వినికిడి. మృణాల్ ఠాకూర్ కూడా జోడిగా ఉండకపోవచ్చని అంటున్నారు. త్రిష మాత్రమే ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసిన మెయిన్ లీడ్. చెల్లెల్లు కాకుండా ఇంకో ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉందట. వశిష్టకు ఇదే పెద్ద కసరత్తుగా మారింది. బడ్జెట్ విషయంలో యువి సంస్థ భారీగా ఖర్చు పెడుతోంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం మరో ప్రధాన ఆకర్షణ.

This post was last modified on February 21, 2024 4:49 pm

Share
Show comments

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

4 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

5 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

6 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

7 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

8 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

8 hours ago