చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ విశ్వంభర షూటింగ్ జనవరి నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి మొదటి వారంలో చిరు, త్రిషలు పాల్గొన్న కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక చిన్న బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం సెలవుల కోసం అమెరికాలో ఉన్న మెగాస్టార్ తిరిగి రాగానే కంటిన్యూ చేయబోతున్నారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో అంజి, జగదేకవీరుడు అతిలోకసుందరిలను మించి ఒక సరికొత్త ప్రపంచాన్ని ఇందులో పరిచయం చేయబోతున్నట్టు యూనిట్ తెగ ఊరిస్తోంది. ఇప్పుడు మరో కీలక లీక్ ఆసక్తిగొలిపేలా ఉంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం విశ్వంభరలో చిరంజీవి పాత్ర పేరు దొరబాబు. భీమవరం దగ్గరలోని ఒక గ్రామంలో కథ మొదలవుతుంది. పెద్ద కుటుంబమే అయినప్పటికీ అయిదుగురు అక్కాచెల్లెళ్ల బాధ్యత అతని తలమీదే ఉంటుంది. దానికోసమే ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాడు. గతంలో ఇంత సిస్టర్ సెంటిమెంట్ తో చిరంజీవి చేసిన మూవీ హిట్లర్ ఒక్కటే. అది ఎమోషన్స్ ఎక్కువగా నడిచే ఫ్యామిలీ కం కమర్షియల్ డ్రామా. కానీ విశ్వంభర దానికి పూర్తి విరుద్ధం. అయినా ఇందరేసి తోబుట్టువులు ఉన్నారంటే ఖచ్చితంగా భావోద్వేగాలకు పెద్ద పీఠ వేస్తాడు వశిష్ట.
ప్రస్తుతం వీళ్ళ క్యాస్టింగ్ పనులు జరుగుతున్నట్టు తెలిసింది. నా సామిరంగలో మెప్పించిన ఆశికా రంగనాథ్ పేరు పరిశీలనలో ఉందట. హీరోయిన్లు కాకపోయినా చిరు ఫ్యామిలీ సభ్యులుగా పేరున్న ఫిమేల్ ఆర్టిస్టులనే తీసుకోవాలని నిర్ణయించినట్టు వినికిడి. మృణాల్ ఠాకూర్ కూడా జోడిగా ఉండకపోవచ్చని అంటున్నారు. త్రిష మాత్రమే ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసిన మెయిన్ లీడ్. చెల్లెల్లు కాకుండా ఇంకో ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉందట. వశిష్టకు ఇదే పెద్ద కసరత్తుగా మారింది. బడ్జెట్ విషయంలో యువి సంస్థ భారీగా ఖర్చు పెడుతోంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం మరో ప్రధాన ఆకర్షణ.
This post was last modified on February 21, 2024 4:49 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…