తమిళ నటుడు మాధవన్ చూడ్డానికి చాాలా సాఫ్ట్గా కనిపిస్తాడు. తొలి చిత్రం ‘సఖి’తో మొదలుపెడితే అతను కెరీర్లో చాలా వరకు సాఫ్ట్ క్యారెక్టర్లే చేశాడు. మొదట్లో అతడికి లవర్ బాయ్ ముద్ర ఉండేది. తర్వాత రకరకాల పాత్రలు చేసి మెప్పించాడు. ‘యువ’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న రఫ్ క్యారెక్టర్తో మెప్పించాడు. తెలుగులో అతను ‘సవ్యసాచి’ చిత్రంలో విలన్ పాత్రలోనూ నటించిన సంగతి తెలిసిందే. అందులో మాధవన్ పెర్ఫామెన్స్ బాగున్నప్పటికీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మాధవన్ను విలన్ పాత్రలో మన వాళ్లు జీర్ణించుకోలేదనే చెప్పాలి. ఐతే ఇప్పుడు మాధవన్ బాలీవుడ్లో విలన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ‘సైతాన్’ అనే పెద్ద సినిమాలో అతను నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
సైతాన్ ఎంతో ఆసక్తి రేకెత్తించే కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం. క్వీన్, సూపర్ 30 లాంటి చిత్రాలు రూపొందించిన వికాస్ బల్ ఈ చిత్రానికి దర్శకుడు. అజయ్ దేవగణ్ ఇందులో హీరోగా నటించడమే కాదు.. స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు కూడా.
కోలీవుడ్ హీరోయిన్, సూర్య భార్య జ్యోతిక ఇందులో హీరోయిన్ పాత్ర చేస్తుండడం విశేషం. ఆమె చాలా ఏళ్ల తర్వాత హిందీలో నటిస్తున్న చిత్రమిది. పెళ్లి తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న జ్యోతిక తిరిగి అక్కడ కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. గతంలో జ్యోతిక పక్కన హీరోగా నటించిన మాధవన్.. ‘సైతాన్’లో ఆమెకు విలన్ పాత్రలో కనిపించనుండడం విశేషం. మాధవన్ బాలీవుడ్లో చాలా సినిమాలే చేశాడు. కొంచెం గ్యాప్ తర్వాత బాలీవుడ్లోకి అతను రీఎంట్రీ ఇస్తున్నాడు. మార్చి 8న ‘సైతాన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on February 20, 2024 4:29 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…