మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన మమ్ముట్టి భ్రమ యుగంని తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ శుక్రవారం 23 రిలీజ్ చేయడానికి సిద్ధపడటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నిర్మాత నాగవంశీ గుంటూరు కారం ఇంటర్వ్యూల సమయంలో ఇకపై డబ్బింగ్ సినిమాలు పంపిణి చేయమని చెప్పడం గుర్తే. కానీ దానికి భిన్నంగా ఇప్పుడీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ కావడం ఊహించని పరిణామం. అయితే భ్రమ యుగంకి ఇదో సానుకూలాంశం కానుంది. ఎందుకంటే సితారకున్న నెట్ వర్క్ చిన్నది కాదు. ఏపీ తెలంగాణలో మంచి థియేటర్లను దక్కించుకోవడంలో దోహదపడుతుంది.
గత ఏడాది దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి తీవ్రమైన పోటీ మధ్య లియోకి మంచి రిలీజ్ వచ్చేలా చేసింది సితార. ఇప్పుడు భ్రమ యుగంకి అలాంటి సమస్య లేదు. ఎందుకంటే రేస్ లో ఉన్నవన్నీ చిన్న సినిమాలే. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, సుందరం మాస్టర్ రెండింట్లో కమెడియన్లే హీరోలు. టాక్ బ్రహ్మాండంగా వస్తేనే నిలబడతాయి. వర్మ వ్యూహం ఏ ఎజెండాతో తీశారో తెలిసిందే కాబట్టి దానికొచ్చే ఓపెనింగ్స్ ని ఈజీగా చెప్పేయొచ్చు. అర్జున్ రెడ్డి ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్న సిద్దార్థ్ రాయ్ నిలబడాలంటే ఏదో అద్భుతం జరగాలి. హీరో దర్శకుడు అంతకు మించే అంటున్నారు.
సో వీటి మధ్య భ్రమ యుగం రావడం ఒకరకంగా దానికి అడ్వాంటేజే. అయితే హారర్ జానర్ కున్న పరిమిత రీచ్, మమ్ముట్టికి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవడం, మన ప్రేక్షకులు అంత సులభంగా అంగీకరించని స్లో నెరేషన్ లాంటి కొన్ని అంశాలు ఈ విభిన్న ప్రయోగానికి ఇబ్బందిగా మారొచ్చు. ఒరిజినల్ వెర్షన్ ని థియేటర్లలో చూసినవాళ్లు మాత్రం మెచ్చుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీనికన్నా ముందు ఇంకో సంచలనం ప్రేమలుని డబ్బింగ్ చేయమని మూవీ లవర్స్ కోరుతున్నారు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు.
This post was last modified on February 19, 2024 5:14 pm
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…