మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన మమ్ముట్టి భ్రమ యుగంని తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ శుక్రవారం 23 రిలీజ్ చేయడానికి సిద్ధపడటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నిర్మాత నాగవంశీ గుంటూరు కారం ఇంటర్వ్యూల సమయంలో ఇకపై డబ్బింగ్ సినిమాలు పంపిణి చేయమని చెప్పడం గుర్తే. కానీ దానికి భిన్నంగా ఇప్పుడీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ కావడం ఊహించని పరిణామం. అయితే భ్రమ యుగంకి ఇదో సానుకూలాంశం కానుంది. ఎందుకంటే సితారకున్న నెట్ వర్క్ చిన్నది కాదు. ఏపీ తెలంగాణలో మంచి థియేటర్లను దక్కించుకోవడంలో దోహదపడుతుంది.
గత ఏడాది దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి తీవ్రమైన పోటీ మధ్య లియోకి మంచి రిలీజ్ వచ్చేలా చేసింది సితార. ఇప్పుడు భ్రమ యుగంకి అలాంటి సమస్య లేదు. ఎందుకంటే రేస్ లో ఉన్నవన్నీ చిన్న సినిమాలే. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, సుందరం మాస్టర్ రెండింట్లో కమెడియన్లే హీరోలు. టాక్ బ్రహ్మాండంగా వస్తేనే నిలబడతాయి. వర్మ వ్యూహం ఏ ఎజెండాతో తీశారో తెలిసిందే కాబట్టి దానికొచ్చే ఓపెనింగ్స్ ని ఈజీగా చెప్పేయొచ్చు. అర్జున్ రెడ్డి ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్న సిద్దార్థ్ రాయ్ నిలబడాలంటే ఏదో అద్భుతం జరగాలి. హీరో దర్శకుడు అంతకు మించే అంటున్నారు.
సో వీటి మధ్య భ్రమ యుగం రావడం ఒకరకంగా దానికి అడ్వాంటేజే. అయితే హారర్ జానర్ కున్న పరిమిత రీచ్, మమ్ముట్టికి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవడం, మన ప్రేక్షకులు అంత సులభంగా అంగీకరించని స్లో నెరేషన్ లాంటి కొన్ని అంశాలు ఈ విభిన్న ప్రయోగానికి ఇబ్బందిగా మారొచ్చు. ఒరిజినల్ వెర్షన్ ని థియేటర్లలో చూసినవాళ్లు మాత్రం మెచ్చుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీనికన్నా ముందు ఇంకో సంచలనం ప్రేమలుని డబ్బింగ్ చేయమని మూవీ లవర్స్ కోరుతున్నారు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు.
This post was last modified on February 19, 2024 5:14 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…