Movie News

సితార చేతికి ‘భ్రమ యుగం’ మంచి ప్లానే

మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన మమ్ముట్టి భ్రమ యుగంని తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ శుక్రవారం 23 రిలీజ్ చేయడానికి సిద్ధపడటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నిర్మాత నాగవంశీ గుంటూరు కారం ఇంటర్వ్యూల సమయంలో ఇకపై డబ్బింగ్ సినిమాలు పంపిణి చేయమని చెప్పడం గుర్తే. కానీ దానికి భిన్నంగా ఇప్పుడీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ కావడం ఊహించని పరిణామం. అయితే భ్రమ యుగంకి ఇదో సానుకూలాంశం కానుంది. ఎందుకంటే సితారకున్న నెట్ వర్క్ చిన్నది కాదు. ఏపీ తెలంగాణలో మంచి థియేటర్లను దక్కించుకోవడంలో దోహదపడుతుంది.

గత ఏడాది దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి తీవ్రమైన పోటీ మధ్య లియోకి మంచి రిలీజ్ వచ్చేలా చేసింది సితార. ఇప్పుడు భ్రమ యుగంకి అలాంటి సమస్య లేదు. ఎందుకంటే రేస్ లో ఉన్నవన్నీ చిన్న సినిమాలే. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, సుందరం మాస్టర్ రెండింట్లో కమెడియన్లే హీరోలు. టాక్ బ్రహ్మాండంగా వస్తేనే నిలబడతాయి. వర్మ వ్యూహం ఏ ఎజెండాతో తీశారో తెలిసిందే కాబట్టి దానికొచ్చే ఓపెనింగ్స్ ని ఈజీగా చెప్పేయొచ్చు. అర్జున్ రెడ్డి ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్న సిద్దార్థ్ రాయ్ నిలబడాలంటే ఏదో అద్భుతం జరగాలి. హీరో దర్శకుడు అంతకు మించే అంటున్నారు.

సో వీటి మధ్య భ్రమ యుగం రావడం ఒకరకంగా దానికి అడ్వాంటేజే. అయితే హారర్ జానర్ కున్న పరిమిత రీచ్, మమ్ముట్టికి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవడం, మన ప్రేక్షకులు అంత సులభంగా అంగీకరించని స్లో నెరేషన్ లాంటి కొన్ని అంశాలు ఈ విభిన్న ప్రయోగానికి ఇబ్బందిగా మారొచ్చు. ఒరిజినల్ వెర్షన్ ని థియేటర్లలో చూసినవాళ్లు మాత్రం మెచ్చుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీనికన్నా ముందు ఇంకో సంచలనం ప్రేమలుని డబ్బింగ్ చేయమని మూవీ లవర్స్ కోరుతున్నారు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు.

This post was last modified on February 19, 2024 5:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

40 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago