రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఆర్సి 16 ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసుకోవడం ఆలస్యం మేకోవర్ కోసం ఒక నెల గ్యాప్ తీసుకుని అటుపై ఈ సెట్లో మెగా పవర్ స్టార్ అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యంగా జరిగిపోవడంతో పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. క్యాస్టింగ్ కి సంబంధించిన ఆడిషన్లను ఈ నెలలోనే కొలిక్కి తెస్తారు. ఎంపిక చేసిన వాళ్ళతో హైదరాబాద్ లో వర్క్ షాప్ ఉంటుంది. వేసవిలో చిత్రీకరణ స్టార్ట్ చేసేలా సెట్ చేసుకున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారనే వార్త పది రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. టీమ్ స్పందించే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ ఒక మీడియా ఛానల్ తో చేసిన ప్రైవేట్ ఛాట్ లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన కూతురు రామ్ చరణ్ సరసన నటించబోతోందని, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదమేనని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు శ్రీదేవి జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో చిరంజీవితో భాగం పంచుకుంటే ఇప్పుడు ఆమె తనయ రామ్ చరణ్ తో జోడి కట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సో ఆర్సి 16 బృందం చెప్పినా చెప్పకపోయినా న్యూస్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ వెంటనే ఆర్ఆర్ఆర్ లో ఉన్న ఇంకో హీరోతో జోడి కట్టే అవకాశం రావడం అదృష్టమే. ఈ లెక్కన ఎక్కువ హైదరాబాద్ లోనే గడపాల్సి రావొచ్చు. ఎన్ని సినిమాలు చేసినా బాలీవుడ్ లో జాన్వీకి పెద్ద రేంజ్ కు వెళ్లలేకపోతోంది. పెర్ఫార్మన్స్ ఎంత బాగా ఇస్తున్నా స్టార్ల సరసన కుదరడం లేదు. కానీ తెలుగులో తారక్, చరణ్ ల సరసన ఒకేసారి జాక్ పాట్ కొట్టేసింది. ఇవి హిట్ అయితే మాత్రం హ్యాపీగా ఇక్కడే సెటిలైపోవచ్చు.
This post was last modified on February 19, 2024 11:23 am
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. భారతీయ సినీ రంగంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన నిర్మాణ సంస్థ. తమిళంలో టాప్ స్టార్ అయిన విజయ్ చివరి…
ఆప్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా..ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోతోంది. సామాన్యుల పక్షాన…
ఒక కథ ఫస్ట్ డ్రాఫ్ట్లో ఉన్నట్లే.. మేకింగ్ టైంకి ఉండకపోవచ్చు. ఆ కథకు మెరుగులు దిద్దే క్రమంలో.. సలహాలు సూచనలను…
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. దేశవ్యాప్తంగా కొన్నాళ్ల కిందట పెట్రోలు, డీజిల్కు కొరత ఏర్పడుతుందన్న అంచనాలు వచ్చాయి. కానీ, వాటిని…
తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ ఎస్) పార్టీని ప్రకటించిన మాజీ ఎంపీ, మాజీఎమ్మెల్సీ కవిత.. సంచలన ప్రకటనలు చేశారు. తాను తెలంగాణకు…