రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఆర్సి 16 ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసుకోవడం ఆలస్యం మేకోవర్ కోసం ఒక నెల గ్యాప్ తీసుకుని అటుపై ఈ సెట్లో మెగా పవర్ స్టార్ అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యంగా జరిగిపోవడంతో పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. క్యాస్టింగ్ కి సంబంధించిన ఆడిషన్లను ఈ నెలలోనే కొలిక్కి తెస్తారు. ఎంపిక చేసిన వాళ్ళతో హైదరాబాద్ లో వర్క్ షాప్ ఉంటుంది. వేసవిలో చిత్రీకరణ స్టార్ట్ చేసేలా సెట్ చేసుకున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారనే వార్త పది రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. టీమ్ స్పందించే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ ఒక మీడియా ఛానల్ తో చేసిన ప్రైవేట్ ఛాట్ లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన కూతురు రామ్ చరణ్ సరసన నటించబోతోందని, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదమేనని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు శ్రీదేవి జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో చిరంజీవితో భాగం పంచుకుంటే ఇప్పుడు ఆమె తనయ రామ్ చరణ్ తో జోడి కట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సో ఆర్సి 16 బృందం చెప్పినా చెప్పకపోయినా న్యూస్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ వెంటనే ఆర్ఆర్ఆర్ లో ఉన్న ఇంకో హీరోతో జోడి కట్టే అవకాశం రావడం అదృష్టమే. ఈ లెక్కన ఎక్కువ హైదరాబాద్ లోనే గడపాల్సి రావొచ్చు. ఎన్ని సినిమాలు చేసినా బాలీవుడ్ లో జాన్వీకి పెద్ద రేంజ్ కు వెళ్లలేకపోతోంది. పెర్ఫార్మన్స్ ఎంత బాగా ఇస్తున్నా స్టార్ల సరసన కుదరడం లేదు. కానీ తెలుగులో తారక్, చరణ్ ల సరసన ఒకేసారి జాక్ పాట్ కొట్టేసింది. ఇవి హిట్ అయితే మాత్రం హ్యాపీగా ఇక్కడే సెటిలైపోవచ్చు.
This post was last modified on February 19, 2024 11:23 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…