గత ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చి ఆ అంచనాలను అందుకోలేక యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకున్న సినిమా లియో. పేరుకు తమిళ సినిమా కానీ.. తెలుగులో దీనికి బంపర్ క్రేజ్ వచ్చింది. సౌత్ ఇండియా అంతటా సినిమా భారీ స్థాయిలో రిలీజైంది. ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి. కానీ సినిమా వీకెండ్ తర్వాత నిలవలేకపోయింది. ఖైదీ, విక్రమ్ తర్వాత లోకేష్ కనకరాజ్ నుంచి ప్రేక్షకులు ఎంతో ఆశించగా.. అతను మరీ పేలవంగా సినిమాను నడిపించి ప్రేక్షకులను నిరాశపరిచాడు.
రిలీజ్ తర్వాత లియో విషయంలో జరిగిన తప్పులను అతను అంగీకరించాడు. సెకండాఫ్ తేడా కొట్టిందని.. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నానని.. లియో పార్ట్-2 విషయంలో జాగ్రత్త పడతానని అన్నాడు. లియో కథను అసంపూర్తిగా వదిలేసిన నేపథ్యంలో సీక్వెల్ ఉంటుందనే అభిమానులు కూడా ఆశించారు.
కానీ ఫస్ట్ పార్ట్కు ఆశించిన పలితం రానపుడు సీక్వెల్ రావడం కష్టం. దీనికి తోడు విజయ్ ఈ మధ్యే తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించాడు. ఇంకొక్క సినిమా చేసి తర్వాత పూర్తిగా రాజకీయాలకు అంకితం అవుతానని ప్రకటించాడు. విజయ్ చివరి చిత్రం కోసం వేరే దర్శకులు రేసులో ఉన్నారు. అతను పొలిటికల్ సబ్జెక్ట్ చేసి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఐతే లోకేష్ కనకరాజ్ మాత్రం లియో-2 ఉంటుందని ఇప్పటికీ నమ్ముతున్నాడు. ఆ సినిమా కోసం కథ కూడా సిద్ధంగా ఉందని.. విజయ్ అంగీకరిస్తే ఆ సినిమా ఉంటుందని అతను చెప్పాడు.
లియో విషయంలో జరిగిన తప్పులు పార్ట్-2లో సరిదిద్దుకుంటానని చెప్పిన లోకేష్ కనకరాజ్.. లియో-2 ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం తనకు తెలియదన్నాడు. విజయ్ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు సినిమా ఉంటుందని లోకేష్ చెప్పాడు. కానీ విజయ్ లియో-2 కోసం సమయం కేటాయించే అవకాశాలు దాదాపు లేనట్లే కనిపిస్తున్నాయి.
This post was last modified on February 18, 2024 11:07 pm
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…