గత ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చి ఆ అంచనాలను అందుకోలేక యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకున్న సినిమా లియో. పేరుకు తమిళ సినిమా కానీ.. తెలుగులో దీనికి బంపర్ క్రేజ్ వచ్చింది. సౌత్ ఇండియా అంతటా సినిమా భారీ స్థాయిలో రిలీజైంది. ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి. కానీ సినిమా వీకెండ్ తర్వాత నిలవలేకపోయింది. ఖైదీ, విక్రమ్ తర్వాత లోకేష్ కనకరాజ్ నుంచి ప్రేక్షకులు ఎంతో ఆశించగా.. అతను మరీ పేలవంగా సినిమాను నడిపించి ప్రేక్షకులను నిరాశపరిచాడు.
రిలీజ్ తర్వాత లియో విషయంలో జరిగిన తప్పులను అతను అంగీకరించాడు. సెకండాఫ్ తేడా కొట్టిందని.. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నానని.. లియో పార్ట్-2 విషయంలో జాగ్రత్త పడతానని అన్నాడు. లియో కథను అసంపూర్తిగా వదిలేసిన నేపథ్యంలో సీక్వెల్ ఉంటుందనే అభిమానులు కూడా ఆశించారు.
కానీ ఫస్ట్ పార్ట్కు ఆశించిన పలితం రానపుడు సీక్వెల్ రావడం కష్టం. దీనికి తోడు విజయ్ ఈ మధ్యే తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించాడు. ఇంకొక్క సినిమా చేసి తర్వాత పూర్తిగా రాజకీయాలకు అంకితం అవుతానని ప్రకటించాడు. విజయ్ చివరి చిత్రం కోసం వేరే దర్శకులు రేసులో ఉన్నారు. అతను పొలిటికల్ సబ్జెక్ట్ చేసి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఐతే లోకేష్ కనకరాజ్ మాత్రం లియో-2 ఉంటుందని ఇప్పటికీ నమ్ముతున్నాడు. ఆ సినిమా కోసం కథ కూడా సిద్ధంగా ఉందని.. విజయ్ అంగీకరిస్తే ఆ సినిమా ఉంటుందని అతను చెప్పాడు.
లియో విషయంలో జరిగిన తప్పులు పార్ట్-2లో సరిదిద్దుకుంటానని చెప్పిన లోకేష్ కనకరాజ్.. లియో-2 ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం తనకు తెలియదన్నాడు. విజయ్ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు సినిమా ఉంటుందని లోకేష్ చెప్పాడు. కానీ విజయ్ లియో-2 కోసం సమయం కేటాయించే అవకాశాలు దాదాపు లేనట్లే కనిపిస్తున్నాయి.
This post was last modified on February 18, 2024 11:07 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…