తమిళ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ పేరెత్తగానే బొద్దైన అవతారం గుర్తుకొస్తుంది. ఆమె కమెడియన్గా రాణించడానికి తన లుక్ కూడా ఒక కారణమే. ఇలా బొద్దయిన అవతారంతోనే లేడీ కమెడియన్లు చాలామంది అవకాశాలు అందుకున్నారు. తన లుక్ విషయంలో ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ లేవని గతంలో చెప్పింది విద్యుల్లేఖ. అదే లుక్తో గతంలో ఆమె ఒక హాట్ ఫొటో షూట్ కూడా చేసింది.
లావుగా ఉన్న వాళ్లు ఇలాంటి ఫొటో షూట్లు చేయకూడదా అంటూ ఆత్మవిశ్వాసంతో అడిగింది. కానీ అప్పటికి ఆమె మానసిక స్థితి అలా ఉందేమో కానీ.. తర్వాతి రోజుల్లో తన అవతారం విషయంలో ఆమె బాధ పడిందని తాజా వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. లాక్ డౌన్ టైంలో విద్యుల్లేఖ ఒక్కసారిగా బరువు తగ్గి మామూలు అమ్మాయిలా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తనను ట్రైన్ చేసిన అబ్బాయినే పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమైంది.
ఒకప్పుడు తాను లావుగా ఉన్న, ఇప్పుడు సన్నబడ్డ ఫొటోలు రెండూ సోషల్ మీడియాలో షేర్ చేసిన విద్యుల్లేఖ.. ఇలా బరువు తగ్గాలని పట్టుబట్టడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. లావుగా ఉన్న ఫొటో గురించి వివరిస్తూ.. ఒక తమిళ సినిమా ఆడియో వేడుకకు వెళ్లాల్సిన సమయంలో రెడీ కాబోతుంటే ఇంట్లో ఉన్న బట్టలేవీ తనకు సరిపోలేదని.. దీంతో ఒక లెగ్గింగ్ వేసుకుని.. పైన ఒక కోట్ వేసి కవర్ చేశానని.. అప్పుడు తన మీద తనకే చాలా కోపం వచ్చిందని విద్యుల్లేఖ చెప్పింది.
ఇంతకుముందు తన బరువు విషయంలో బాధ పడకూడదని తనకు తాను సర్దిచెప్పుకున్నానని.. కానీ గత ఏడాది కొన్ని అనుభవాల వల్ల బరువు తగ్గడం కోసం తనలో తాను స్ఫూర్తి నింపుకున్నానని ఆమె వెల్లడించింది. ‘‘ఇంతకుముందు నా బరువు 86.5 కేజీలు. ఇప్పుడు 65.2 కేజీలకు చేరా. అంటే 20 కేజీలకు పైగా తగ్గాను. ఇది శ్రమ, కన్నీళ్లు, అనేక మలుపులతో కూడుకున్న సుదూర ప్రయాణం’’ అని విద్యుల్లేఖ వెల్లడించింది.
This post was last modified on September 9, 2020 3:02 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…