తమిళ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ పేరెత్తగానే బొద్దైన అవతారం గుర్తుకొస్తుంది. ఆమె కమెడియన్గా రాణించడానికి తన లుక్ కూడా ఒక కారణమే. ఇలా బొద్దయిన అవతారంతోనే లేడీ కమెడియన్లు చాలామంది అవకాశాలు అందుకున్నారు. తన లుక్ విషయంలో ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ లేవని గతంలో చెప్పింది విద్యుల్లేఖ. అదే లుక్తో గతంలో ఆమె ఒక హాట్ ఫొటో షూట్ కూడా చేసింది.
లావుగా ఉన్న వాళ్లు ఇలాంటి ఫొటో షూట్లు చేయకూడదా అంటూ ఆత్మవిశ్వాసంతో అడిగింది. కానీ అప్పటికి ఆమె మానసిక స్థితి అలా ఉందేమో కానీ.. తర్వాతి రోజుల్లో తన అవతారం విషయంలో ఆమె బాధ పడిందని తాజా వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. లాక్ డౌన్ టైంలో విద్యుల్లేఖ ఒక్కసారిగా బరువు తగ్గి మామూలు అమ్మాయిలా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తనను ట్రైన్ చేసిన అబ్బాయినే పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమైంది.
ఒకప్పుడు తాను లావుగా ఉన్న, ఇప్పుడు సన్నబడ్డ ఫొటోలు రెండూ సోషల్ మీడియాలో షేర్ చేసిన విద్యుల్లేఖ.. ఇలా బరువు తగ్గాలని పట్టుబట్టడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. లావుగా ఉన్న ఫొటో గురించి వివరిస్తూ.. ఒక తమిళ సినిమా ఆడియో వేడుకకు వెళ్లాల్సిన సమయంలో రెడీ కాబోతుంటే ఇంట్లో ఉన్న బట్టలేవీ తనకు సరిపోలేదని.. దీంతో ఒక లెగ్గింగ్ వేసుకుని.. పైన ఒక కోట్ వేసి కవర్ చేశానని.. అప్పుడు తన మీద తనకే చాలా కోపం వచ్చిందని విద్యుల్లేఖ చెప్పింది.
ఇంతకుముందు తన బరువు విషయంలో బాధ పడకూడదని తనకు తాను సర్దిచెప్పుకున్నానని.. కానీ గత ఏడాది కొన్ని అనుభవాల వల్ల బరువు తగ్గడం కోసం తనలో తాను స్ఫూర్తి నింపుకున్నానని ఆమె వెల్లడించింది. ‘‘ఇంతకుముందు నా బరువు 86.5 కేజీలు. ఇప్పుడు 65.2 కేజీలకు చేరా. అంటే 20 కేజీలకు పైగా తగ్గాను. ఇది శ్రమ, కన్నీళ్లు, అనేక మలుపులతో కూడుకున్న సుదూర ప్రయాణం’’ అని విద్యుల్లేఖ వెల్లడించింది.
This post was last modified on September 9, 2020 3:02 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…