సినిమా అంటే థియేటర్లలోనే చూడాలి అనే పాత కాలం ధోరణులు మారాలిక. కనీసం చిన్న సినిమాలు అయినా ఓటిటి ప్లాట్ఫారం వాడుకోవడంపై దృష్టి పెట్టాలి. థియేటర్లలో విడుదల చేయడం వల్ల ప్రింట్లు, థియేటర్ల ఖర్చులు తప్ప చాలా సినిమాలకి కనీస వసూళ్లు రావు.
కంటెంట్ క్వాలిటీ పెంచుకుని, థియేటర్ల రెవిన్యూపై ఆధారపడకపోతే చిన్న సినిమా పరిఢవిల్లుతుంది. పెద్ద సినిమాలను కొనేంత స్థాయికి ఇండియాలో ఈ బిజినెస్ ఇంకా డెవలప్ అవలేదు. కానీ చిన్న సినిమాలు ఖచ్చితంగా ఈ వేదికని వాడుకోవడంపై శ్రద్ధ పెట్టవచ్చు.
లాక్ డౌన్ చిన్న సినిమాలను ఈ దశగా నడిపించడానికే వచ్చిందేమో అన్నట్టుగా ఉంది. ఇప్పటికే కొన్ని మీడియం రేంజ్ సినిమాలను కొనేయడానికే ఓటిటీలు ముందుకొస్తున్నాయి. అయితే నిర్మాతలే వెనక్కు తగ్గుతున్నారు. ఈ కొద్ది కాలం నష్టం కోసం సాంప్రదాయ థియేటర్స్ బిజినెస్ ఎందుకు పాడు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
అయితే ఇక ఇప్పట్లో థియేట్రికల్ రిలీజ్ కష్టం అని అర్థం చేసుకున్న ‘అమృతరామమ్’ నిర్మాతలు ఈ నెల 29న జీ 5 ద్వారా తమ సినిమా రిలీజ్ చేస్తున్నారు. వీరిని చూసి మరింత మంది చిన్న నిర్మాతలు ఈ దిశగా అడుగులేసే అవకాశం లేకపోలేదు.
This post was last modified on April 26, 2020 4:36 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…