సినిమా అంటే థియేటర్లలోనే చూడాలి అనే పాత కాలం ధోరణులు మారాలిక. కనీసం చిన్న సినిమాలు అయినా ఓటిటి ప్లాట్ఫారం వాడుకోవడంపై దృష్టి పెట్టాలి. థియేటర్లలో విడుదల చేయడం వల్ల ప్రింట్లు, థియేటర్ల ఖర్చులు తప్ప చాలా సినిమాలకి కనీస వసూళ్లు రావు.
కంటెంట్ క్వాలిటీ పెంచుకుని, థియేటర్ల రెవిన్యూపై ఆధారపడకపోతే చిన్న సినిమా పరిఢవిల్లుతుంది. పెద్ద సినిమాలను కొనేంత స్థాయికి ఇండియాలో ఈ బిజినెస్ ఇంకా డెవలప్ అవలేదు. కానీ చిన్న సినిమాలు ఖచ్చితంగా ఈ వేదికని వాడుకోవడంపై శ్రద్ధ పెట్టవచ్చు.
లాక్ డౌన్ చిన్న సినిమాలను ఈ దశగా నడిపించడానికే వచ్చిందేమో అన్నట్టుగా ఉంది. ఇప్పటికే కొన్ని మీడియం రేంజ్ సినిమాలను కొనేయడానికే ఓటిటీలు ముందుకొస్తున్నాయి. అయితే నిర్మాతలే వెనక్కు తగ్గుతున్నారు. ఈ కొద్ది కాలం నష్టం కోసం సాంప్రదాయ థియేటర్స్ బిజినెస్ ఎందుకు పాడు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
అయితే ఇక ఇప్పట్లో థియేట్రికల్ రిలీజ్ కష్టం అని అర్థం చేసుకున్న ‘అమృతరామమ్’ నిర్మాతలు ఈ నెల 29న జీ 5 ద్వారా తమ సినిమా రిలీజ్ చేస్తున్నారు. వీరిని చూసి మరింత మంది చిన్న నిర్మాతలు ఈ దిశగా అడుగులేసే అవకాశం లేకపోలేదు.
This post was last modified on April 26, 2020 4:36 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…