జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈపాటికి ‘దేవర’ సినిమా రిలీజ్ కౌంట్ డౌన్లో బిజీగా ఉండాల్సింది. సినిమా మొదలైనపుడే 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అంటూ ఘనంగా ప్రకటన ఇచ్చిన చిత్ర బృందం.. నెల కిందటి వరకు అదే మాటకు కట్టుబడి ఉంది. రిలీజ్కు వంద రోజుల కౌంట్ డౌన్ కూడా ఇచ్చారు ఆ మధ్య. కానీ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడడం, ఇంకేవో కారణాలతో ఏప్రిల్ 5 నుంచి సినిమాను వాయిదా వేశారు. ముందు మీడియాలో దీని గురించి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిత్ర బృందం తీరును బట్టి వాయిదా అనివార్యం అని తేలిపోయింది.
ఏప్రిల్ 5కు విజయ్ దేవరకొండ సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ కూడా ఖరారైపోవడంతో తారక్ అభిమానులను నిరుత్సాహం ఆవహించింది. ఐతే ఏప్రిల్ కాకపోతే వేసవి చివర్లో లేదా జులై-ఆగస్టు నెలల్లో అయినా సినిమా వస్తుందని ఆశించారు.
కానీ అక్టోబరు 10 అంటూ వాళ్లు ఊహించని డేట్ ఇచ్చారు. ఇక్కడ్నుంచి ఇంకో ఎనిమిది నెలలు ఎదురు చూడాలంటే అభిమానులకు కష్టమే. ‘అరవింద సమేత’ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కోసం నాలుగేళ్లు ఎదురు చూశారు. తర్వాతి సినిమా’ అయినా త్వరగా వస్తుందనుకుంటే.. ‘దేవర’ సెట్స్ మీదికి వెళ్లడంలోనే విపరీతమైన జాప్యం జరిగింది.
అన్నీ పక్కాగా సిద్ధం చేసుకుని షూట్కు వెళ్లడంతో రిలీజ్ అయినా అనుకున్న ప్రకారం జరుగుతుందనుకుంటే దగ్గరకొచ్చేసరికి వాయిదా పిడుగు పడింది. కొత్త డేట్ ఇచ్చి క్లారిటీ ఇవ్వడం ఓకే కానీ.. మరీ అంత లాంగ్ డేట్ ఎంచుకోవడం మాత్రం అభిమానులకు నచ్చట్లేదు. సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ ఉస్సూరుమంటున్న పోస్టులే కనిపిస్తున్నాయి. ఒక నిట్టూర్పు విడిచాక కనీసం ఆ డేట్కు అయినా కట్టుబడితే చాలని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on February 17, 2024 2:16 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…