జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈపాటికి ‘దేవర’ సినిమా రిలీజ్ కౌంట్ డౌన్లో బిజీగా ఉండాల్సింది. సినిమా మొదలైనపుడే 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అంటూ ఘనంగా ప్రకటన ఇచ్చిన చిత్ర బృందం.. నెల కిందటి వరకు అదే మాటకు కట్టుబడి ఉంది. రిలీజ్కు వంద రోజుల కౌంట్ డౌన్ కూడా ఇచ్చారు ఆ మధ్య. కానీ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడడం, ఇంకేవో కారణాలతో ఏప్రిల్ 5 నుంచి సినిమాను వాయిదా వేశారు. ముందు మీడియాలో దీని గురించి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిత్ర బృందం తీరును బట్టి వాయిదా అనివార్యం అని తేలిపోయింది.
ఏప్రిల్ 5కు విజయ్ దేవరకొండ సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ కూడా ఖరారైపోవడంతో తారక్ అభిమానులను నిరుత్సాహం ఆవహించింది. ఐతే ఏప్రిల్ కాకపోతే వేసవి చివర్లో లేదా జులై-ఆగస్టు నెలల్లో అయినా సినిమా వస్తుందని ఆశించారు.
కానీ అక్టోబరు 10 అంటూ వాళ్లు ఊహించని డేట్ ఇచ్చారు. ఇక్కడ్నుంచి ఇంకో ఎనిమిది నెలలు ఎదురు చూడాలంటే అభిమానులకు కష్టమే. ‘అరవింద సమేత’ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కోసం నాలుగేళ్లు ఎదురు చూశారు. తర్వాతి సినిమా’ అయినా త్వరగా వస్తుందనుకుంటే.. ‘దేవర’ సెట్స్ మీదికి వెళ్లడంలోనే విపరీతమైన జాప్యం జరిగింది.
అన్నీ పక్కాగా సిద్ధం చేసుకుని షూట్కు వెళ్లడంతో రిలీజ్ అయినా అనుకున్న ప్రకారం జరుగుతుందనుకుంటే దగ్గరకొచ్చేసరికి వాయిదా పిడుగు పడింది. కొత్త డేట్ ఇచ్చి క్లారిటీ ఇవ్వడం ఓకే కానీ.. మరీ అంత లాంగ్ డేట్ ఎంచుకోవడం మాత్రం అభిమానులకు నచ్చట్లేదు. సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ ఉస్సూరుమంటున్న పోస్టులే కనిపిస్తున్నాయి. ఒక నిట్టూర్పు విడిచాక కనీసం ఆ డేట్కు అయినా కట్టుబడితే చాలని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on February 17, 2024 2:16 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…